-
ఊడ్చేవారిని రోడ్డుకీడ్చుతున్నారు..
బొబ్బిలి: ఈ చిత్రంలో కనిపిస్తున్న నిరుపేద మహిళ పేరు జలగడుగుల మంగమ్మ. ఈమె పారిశుద్ధ్య కార్మికుడు గోపాలం కుమార్తె. పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులెవరయినా వారి కుటుంబాల్లోని వారంతా పనులకు వెళతారు. అలానే ఈమె తన భర్త చనిపోవడంతో తండ్రి సంపాదనపైనే ఆధారపడి జీవించేది. గోపాలం చేయాల్సిన పారిశుద్ధ్యపనులన్నీ చేసేది. ఏళ్లపాటు చేశాక ఇటీవల గోపాలం చనిపోయాడు. వాస్తవానికి వారసత్వంగా అతనిపై ఆధారపడిన కుమార్తెకు పారిశుద్ధ్య కార్మికురాలిగా కౌన్సిల్ అనుమతించలేదని తనను పక్కన పెట్టేశారు. ఇప్పుడీమె బతుకు భారమైంది. మున్సిపాలిటీలో ఈమె ఒక్కతే కాదు విజయమ్మ అనే మరో పారిశుద్ధ్య కార్మికురాలు కూడా చనిపోతే ఆమె కుటుంబ సభ్యులకు ఉద్యోగమివ్వలేదు. వేరే వారికి కట్టబెట్టారు. దీంతో ఆయా కార్మికులంతా తీవ్ర మనోవేదనతో తమ కుటుంబాలను ఈడ్చలేక దీనావస్థలో ఉన్నారు. అంగన్వాడీ, సబ్స్టేషన్ ఆపరేటర్ల పోస్టులను అమ్ముకుంటున్నారన్న ఖ్యాతి దక్కించుకుంటున్న తెలుగు తమ్ముళ్లు చివరకు పారిశుద్ధ్య కార్మికుల పోస్టులనూ అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను పూర్తిగా కల్పించని యంత్రాంగం చివరకు వారి పోస్టులను కూడా అందనీయకుండా చేస్తోంది. పట్టణంలోని 30 వార్డులుండగా 95 మంది పారిశుద్ధ్య కార్మికులున్నారు. వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు కల్పించడం లేదు. చేస్తున్న పనులు పారిశుద్ధ్యం కనుక ఖచ్చితంగా బజ్బులు సోకుతున్నాయనీ, వాటిని బాగు చేయించుకోలేక మంచం పట్టి ఇలా చనిపోయిన కుటుంబాలు వీధిన పడాల్సిందేనా అని వారు వాపోతున్నారు. టీడీపీ కార్యకర్తలకు ప్రమోషన్లు.. పట్టణంలో ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులు తక్కువ మంది ఉన్నారు. అయితే వారిలో ఎవరైతే తమకు అనుకూలంగా, అనుసరులుగా ఉండి అందుబాటులో ఉంటారో వారికి సూపర్ వైజర్లుగా ప్రమోషన్లు కల్పించారనీ అందువల్లనే కార్మికుల సంఖ్య తగ్గిందనీ కార్మిక నాయకులు బ హిరంగంగా చెబుతున్నారు. కార్మికులుగా పనిచేయిస్తూ అర్హత మేరకు సూపర్ వైజర్లుగా నియమించుకునే అవకాశం ఉన్నా అలా చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. రూ.50వేల చొప్పున అమ్ముకున్నారు కాంట్రాక్టు కార్మికులయితే గ్రాట్యుటీ ఇవ్వాలి. ఇవ్వడం లేదు కనుక పోస్టును కుటుంబంపై ఆధారపడిన వారికి ఇవ్వాలి. కానీ అమ్ముకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికులను పర్యవేక్షించే వారిని రిటైర్ అయినా వేల రూపాయల వేతనంతో తిరిగి నియమించుకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికుడి పోస్టును టీడీపీ నాయకులు రూ.50వేలకు అమ్ముకున్నారు. అర్హులయిన వారిని వీధిన పడేశారు. నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారు.-పి శంకరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పారిశుధ్య కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల సంఘం కాంట్రాక్టు పోస్టులకు ఇచ్చే అవకాశం లేదు పర్మినెంటు కార్మికుల కుటుంబాలకే వారసత్వ ఉద్యోగ అవకాశం ఉంది. కాంట్రాక్టు కార్మికులకు లేదు. గతంలో గోపాలం రిటైర్ అయిపోయాడు. ఆయన కుటుంబానికి పెన్షన్ వస్తుంది. ఆయన కుమారుడు కూడా ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్నాడు. ఒకే కుటుంబంలో అన్ని ఉద్యోగాలూ ఇచ్చే జీఓ లేదు కదా? అందుకనే గోపాలం కుమార్తెకు పోస్టు ఇవ్వలేదు. -హనుమంతు శంకరరావు, కమిషనర్, బొబ్బిలి మున్సిపాలిటీ -
స్వీపర్ ఉద్యోగాల కోసం బీటెక్లు, ఎంబీయేలు!
ఉత్తరప్రదేశ్లో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. అలహాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ)లో కాంట్రాక్టు పద్ధతిలో స్వీపర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే.. ఏకంగా 1.10 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. అంతేకాదు, కేవలం హిందీలో చదవడం, రాయడం వస్తే సరిపోతుందని అర్హతలలో పేర్కొంటే.. చాలామంది బీటెక్లు, ఎంబీయేలు, ఇతర పీజీలు చేసిన వాళ్లు కూడా క్యూకడుతున్నారు. కాంట్రాక్టు స్వీపర్లు (సఫాయీ కర్మచారీలు) ఉద్యోగాల కోసం వీళ్లంతా ఇంత పెద్ద సంఖ్యలో రావడంతో రిక్రూట్మెంట్కు ఎంతలేదన్నా కనీసం 408 రోజుల పాటు సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. ఈలోపు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చి, ప్రభుత్వం మారితే మరింత ఆలస్యం తప్పదట. అలహాబాద్ మునిసిపాలిటీలో 119 పోస్టులతో పాటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక్కో జిల్లాకు 100 చొప్పున స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికోసం పెద్దపెద్ద చదువులు చదివినవాళ్లు కూడా రావడంతో రోజుకు 250 మంది చొప్పున అభ్యర్థులను అహ్మదాబాద్ మునిసిపాలిటీ పిలుస్తోంది. పెద్దపెద్ద విద్యార్హతలు ఉన్నవాళ్లు, యువకులు దీనికి దరఖాస్తు చేశారని అదనపు మునిసిపల్ కమిపషనర్ ఓపీ శ్రీవాస్తవ తెలిపారు. వీళ్లందరినీ ఇంటర్వ్యూ చేయాలంటే 408 పనిదినాలు.. అంటే సుమారు రెండు సంవత్సరాల సమయం పడుతుందని, వీళ్లంతా ప్రాక్టికల్ పరీక్షలు కూడా పాసవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు. -
రూ.లక్ష కొట్టు... చీపురు పట్టు
♦ స్వీపర్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ♦ ఒక్కో దానికి రూ.లక్ష వంతున వసూలు ♦ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగంలో అక్రమాలు సాక్షి, సిటీబ్యూరో : అన్నా రూ.50 వేలిస్తా.. కుదరు.్ద రూ.లక్ష కావాల్సిందే. అంత ఇచ్చుకోలేనన్నా.. రూ.70 వేలు చేసుకో.పోవయ్యా పో. ఇది వరకే లక్ష తీసుకునేటోళ్లం. అందులో పెద్దసార్లకు పోనూ నాకు మిగిలేది రూ.15 వేల నుంచి రూ. 20 వేలే. ఇప్పుడింక జీతాలు పెరిగినయ్ తెలుసుగా. ఏమనుకున్నావ్? రూ.2 లక్ష లు ఇస్తామని వస్తున్నారు. ... ఇదీ జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మిక ‘పోస్టు’ల రేటు. ఉద్యోగం కావాలని అడుగుతున్న వారికి.. కార్మికుల విధులను పర్యవేక్షించే ఎస్ఎఫ్ఏ (శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్)ల మధ్య జరుగుతున్న బేరం. .... సమ్మె సందర్భంగా విధులకు రాని కార్మికులను తొలగించి... కొత్త వారిని తీసుకుంటామని సీఎం కేసీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ స్పష్టం చేయడంతో... ఈ పోస్టులకు డిమాండ్ భారీగా పెరిగింది. సాధారణ రోజుల్లోనూ రూ.50 వేల డిమాండ్ ఉన్న ఈ పోస్టులకు ఇప్పుడు రూ.లక్షకు త గ్గడం లేదు. జీతాల పెంపుతో బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. పెరిగిన వేతనం మేరకు ఒక్కో కార్మికునికి/కార్మికురాలికి నెల వేతనం రూ.12,500. అంటే రూ.లక్ష వెచ్చించి... పనిలో చేరినా దాదాపు ఏడాదిపాటు కష్టపడితే గానీ పెట్టుబడి రాదు. రెక్కలు ముక్కలు చేసుకునే పనికి ఎందుకింత డిమాండ్ అంటే... పేరుకు 8 గంటలైనా... 2 గంటలు మాత్రమే పని చేస్తారు. మిగతా సమయంతా వేరే పని చేసుకోవచ్చు. ఎస్ఎఫ్ఏ అండదండలు ఉంటాయి కనుక అడిగే వారుండరు. కొంతమంది బినామీలను పెట్టుకుంటారు. వచ్చే వేతనంలో రూ.4 వేల నుంచి 5 వేలు మాత్రం వారికి ఇస్తారు. మిగతాదంతా వీరికి ఉచితంగా అందుతున్నట్లే. ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సదుపాయాలన్నీ తమ పేరిటే ఉంటాయి. ఇంకో తరహా వారున్నారు. రెండు చోట్ల ఔట్సోర్సింగ్ లో పని చేస్తుంటారు. అలా ఈ వేతనం వారికి అదనం. ఎస్ఎఫ్ఏ.. వారిపైన ఉండే ఏఎంఓహెచ్ (అసిస్టెంట్ మెడికల్ ఆఫ్ హెల్త్)/ డిప్యూటీ కమిషనర్ వంటి వారి అండదండలతో పనిచేసేది ఒకే షిప్టులో అయినా రెండు షిప్టుల్లో పేరుంటుంది. రెండు వేతనాలు అందుతాయి. వాస్తవానికి ఏ షిప్టులోనూ పనిచేయకుండా బినామీలను పెడుతూ వేతనాలు పొందుతుంటారు. సాధారణ షిప్టుల్లో కాకుండా సర్కిల్కు ఒక మొబైల్ బృందం ఉంటుంది. అత్యవసర సమయాల్లో.. పండుగల సందర్భాల్లో ఎక్కువ చెత్త పేరుకుపోయినప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడ పనిచేసే బృందమన్న మాట. వీరు పనిచేసేదే అరుదు. వీరసలు ఎక్కడ ఉంటారో .. ఏం పనిచేస్తారో ఎస్ఎఫ్ఏ/ఏఎంఓహెచ్లకు మాత్రమే తెలుసు. మరికొందరి పద్ధతి వేరు. ఒక ఏరియాలో పారిశుద్ధ్య కార్మికునిగా నమోదై ఉంటారు. అదే ప్రాంతంలో సొంత దుకాణం/వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఎప్పుడైనా.. ఎవరైనా తనిఖీలకు వస్తే ‘ఇక్కడే ఉన్నా’.. అంటూ పరుగున వచ్చేస్తారు. .... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వ్యవస్థలోని లొసుగులకు అంతే లేదు. వీటి గురించి పూర్తిగా తెలిసేది ఎస్ఎఫ్ఏకే కనుక ఆయనను మచ్చిక చేసుకుంటే చాలు... పని ‘సులువైపోతుంది.’ .... ఎస్ఎఫ్ఏలంటే వీరికంటే పెద్ద అర్హతలున్నవారు కాదు. కార్మికుల్లో ఒకరిని ఎస్ఎఫ్ఏగా నియమిస్తారు. గ్రూపులో ఏడుగురు సభ్యులు ఉంటారు. ఇలాంటి మూడు బృందాల పనిని ఎస్ఎఫ్ఏ పర్యవేక్షిస్తాడు. మిగిలిన వారికంటే రూ.వెయ్యి అదనంగా ఇస్తారు. వీరి వైభోగం చెప్పనలవి కాదు. త న పరిధిలోని మూడు గ్రూపుల్లో ఉండాల్సిన 21 మంది కార్మికుల్లో ఒక్కరోజూ పూర్తి స్థాయిలో విధులకు హాజరు కారు. 14 లేదా 15 మంది మాత్రమే ఉంటారు. మిగిలిన వారు రాకపోయినా పూర్తి హాజరు వేస్తారు. ఆ జీతాలు ఆయనే అందుకుంటాడు. అందులో ఏఎంఓహెచ్లు/డీఎంసీలకు వాటాలు చెల్లిస్తారు. అంతేకాదు. ఎస్ఎఫ్ఏల ఇబ్బందులివీ... ఇక ఎస్ఎఫ్ఏగా కొనసాగాలంటే ఏఎంఓహెచ్/ డీఎంసీ/ ఇతరత్రా ‘పెద్దసార్లు’ చెప్పిన పని చేయాలి. విధుల్లోలేని ఆరేడుగురికి హాజరు వేసినందుకు ఆ జీతాల్లో వాటాలు పంచాలి. కొందరు తమ ఇంటికి అవసరమయ్యే మాంసం/చేపలు వంటి వాటితోపాటు సీజన్ను బట్టి పండ్లు తదిరమైనవి సరఫరా చేయాలి. ఆదివారాల్లో ఈ కోటాలు అదనం. కార్పొరేటర్ల హయాంలో వారి కోసం ఏర్పాటు చేసుకున్న గ్రూ పులు కాగి తాల మీదే ఉండేవి. గ్రూపులోని కార్మికుల వేతనాలన్నీ కార్పొరేటర్లకు, అధికారులకు, ఎస్ఎఫ్ఏలకు వెళ్లేవి. పెద్దల కనుసన్నల్లోనే... ఈ సంగతి తెలియదా అంటే... అందరికీ తెలుసు. కానీ చర్యల్లేవు. ఎవరి అవసరాలు వారివి. గట్టిగా అడ్డుకుందామంటే సచివాలయం స్థాయి నుంచి ఆదేశాలు. స్థానిక ఎమ్మెల్యేల నుంచి హుకుంలు. వీరిలో దాదాపు 20 శాతం నియామకాలు వారి సిపాసులతో జరిగేవే. అందుకే తమ అనుచరుల కోసం.. వారి సంబంధీకుల కోసం వారే ఫోన్లు చేసి ఈ పోస్టులు ఇప్పిస్తారు. రాకపోయినా వచ్చినట్టే... తాజా సమ్మె నేపథ్యంలో ధర్నాలో పాల్గొన్నప్పటికీ పలువురు విధుల్లో ఉన్నట్టు హాజరు నమోదైంది. తొలగింపు హెచ్చరికల నేపథ్యంలో విధుల్లో ఉన్న వారి పేర్ల కోసం భారీ డిమాండ్ పలుకుతోంది. ఉద్యోగం ఉండాలంటే... ఎలాగైనా హాజరు వేయాల్సిందిగా వేడుకుంటున్నారు. మరో రకం దందా నడుస్తోంది. కార్మికుల పేర్లు వేసేదీ.. తీసేది ఎస్ఎఫ్ఏలే కనుక ఇప్పటికే బోగస్లుగా ఉన్నవారి స్థానంలో తమను నియమించాల్సిందిగా పలువురు వారి వెంట పడుతున్నారు. సమ్మె సందర్భంగా ఎలాగైనా ఎక్కువ మందిని విధుల్లోకి రప్పించాల్సిందిగా పైనుంచి ఆదేశాలు అందడంతో.. ఎవరు పడితే వారిని పనిలోకి తెచ్చారు. అసలు కార్మికుల స్థానే అందుబాటులో ఉన్నవారిని వినియోగించారు. ‘ఇప్పుడు మీకు ఉద్యోగం ఖాయమవుతుంద’ం ంటూ వారి నుంచీ లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్మికులు వీధులు శుభ్రపరచినట్లు కార్పొరేటర్లు ధ్రువీకరించాలని గతంలో ఓ తీర్మానం చేశారు. నిజంగా వీధులు శుభ్రపడేందుకు కాదు. కార్పొరేటర్ల జేబులు నిండేందుకు. పని చేయని వారిని చూసీ చూడనట్లు వదిలేసేందుకు. అదనపు వాటా కోసం. ఇవన్నీ బహిరంగ విషయాలే. చర్చల సందర్భాల్లో వెల్లడైన అంశాలు. అయినప్పటికీ అధికారులకు కనిపించదు. ఎవరిపైనా చర్యలుండవు. ఎందుకంటే వారే సమాధానం చెప్పాల్సి వస్తుంది. అదీ కథ. జేబుల్లోకి జీహెచ్ఎంసీ డబ్బు బోగస్లు, డూప్లికేట్లు.. ఇతరత్రా దాదాపు 5 వేల మందికి పని చేయకుండానే వేతనాలు అందుతున్నాయి. ఈ మొత్తం వ్యక్తుల జేబుల్లోకి వెళుతోంది. నెలకు సగటున ఒక్కొక్కరి వేతనం రూ.8 వేలుగా లెక్కించుకున్నా రూ.4 కోట్ల వరకూ జీహెచ్ఎంసీ సొమ్ము రాబందుల పాలవుతోంది. మూన్నాళ్ల ముచ్చటే.. అవకతవకల నిరోధానికి... కార్మికులు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు? ఏ వీధిలో చెత్త ఎంత ఉంది? అనే అంశాలను కార్యాలయాల్లోని కంప్యూటర్ల నుంచే ఉన్నతాధికారులు వీక్షించేలా ప్రవేశపెట్టిన ఓఎస్సార్టీ సాంకేతిక విధానాన్ని అటకెక్కించారు. హాజరు కోసం బయోమెట్రిక్ను అట్టహాసంగా ఒక సర్కిల్లో ప్రారంభించారు. అదీ అతీగతీ లేకుండా పోయింది. ఇలా .. ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినా వెంటనే అటకెక్కిస్తారు. ఎందుకంటే... వాటి వల్ల అందరికీ నష్టమని. అధికారం వారిదే... గ్రూపులో ఎవరైనా నచ్చకపోతే తొలగిస్తారు. తొలగింపు.. నియామక అధికారాలు వీరివే. కొత్తగా నియమించుకున్నవారి నుంచి వారి అవసరం.. ఆయన దర్పాన్ని బట్టి కనిష్టంగా రూ.50 వేల నుంచి ఎంత వీలైతే అంత ఎక్కువగా దండుకుంటాడు. మహిళా కార్మికులపై కన్నేస్తే సతాయింపులు మామూలే. తమ మాట వినని వారిని ఏదో వంకతో తప్పిస్తారు. కుటుంబ పరిస్థితులు, ఆర్థికావసరాలతో చాలా విషయాలను బాధితులు వెల్లడించరు. నెలనెలా వేతనాల్లోనూ మొత్తం జీతం కార్మికులకు అందదు. వారి ఏటీఎం కార్డులు ఎస్ఎఫ్ఏల వద్దే ఉంటాయి. కేవలం జీతం డబ్బులు డ్రా చేసేందుకు కార్మికులనూ యంత్రాల్లానే వినియోగించుకుంటారు. వచ్చే మొత్తంలో రూ.వెయ్యి, రూ.రెండు వేలు తగ్గించి ఇస్తారు. ఇంతటి ‘అధికారాలున్న’ ఎస్ఎఫ్ఏ పోస్టులకు మరింత డిమాండ్ ఉంటోంది. ప్రస్తుతం కనిష్టంగా రూ.2 లక్షలు పలుకుతున్నాయి. పక్కాగా ఉండాలని... వివిధ విభాగాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్కుమార్ విధుల్లోని కార్మికుల వివరాలను ఆయా వీధుల్లో బోర్డులపై ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎవరైనా... ఏ వీధినైనా శుభ్రపరచకుంటే సంబంధిత అధికారికి ఫిర్యాదు చేసేలా ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచుతామన్నారు. దీనిపైఎందుకనో పెద్దగా శ్రద్ధ చూపలేదు. ప్రస్తుతం ఈ వ్యవస్థపై సీరియస్గా ఉన్నారు. ఆధార్ అనుసంధానంతో సహా బయోమెట్రిక్, బ్యాంకు అకౌంట్లు తదితరమైనవన్నీ పక్కాగా అమలు చేస్తామంటున్నారు. మాయల్లో మచ్చుకు కొన్ని.. సర్కిల్-9లో ఒక పారిశుద్ధ్య కార్మికుడు కొంతకాలం క్రితం మరణించాడు. పీఎఫ్ డబ్బులు, దహన సంస్కారాల కోసం ఇచ్చే ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకుంటే... కార్మికుడు మరణించలేదని, అతని పేరిట ఎలా ఇస్తామని అధికారులు ఎదురు ప్రశ్నించారు. మరణించాక దాదాపు ఏడు నెలలపాటు ఆయన పేరిట నెలనెలా పీఎఫ్ జమవుతోందన్నారు. అంటే విధుల్లో ఉన్నట్లే లెక్క. పీఎఫ్ జమ అయిందంటే నెలనెలా వేతనం కూడా పొందాడు. మరి ఈ మొత్తం ఎవరి జేబుల్లోకి వెళ్లింది..? మరణించినప్పటికీ ఆయన ఎలా జీవించగలిగాడో సంబంధిత అధికారులకే తెలియాలి. కంచన్బాగ్ పరిసరాల్లోని ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో స్వీపర్గా ఔట్సోర్సింగ్పై పని చేస్తున్న ఓ వ్యక్తి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య గ్రూపుల్లోనూ స్వీపర్గా వేతనాలు పొందుతున్నాడు. ఏళ్ల తరబడి ఈ తంతు సాగుతోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షిప్టు అయినప్పటికీ.. ఎస్ఎఫ్ఏ చలువతో ఉదయం 8 గంటలకు వెళ్లిపోయి... 10 గంటల నుంచి ప్రభుత్వరంగ సంస్థలో పని చేస్తాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement