-
ఉపాధికోసం వచ్చి ఊపిరొదిలాడు
గుడిహత్నూర్(బోథ్): మండలంలోని సూర్యగూడ పంచాయతీ పరిధిలోని క్వారీ నీటిగుంతలో గల్లంతై గింజల దుర్గాప్రసాద్ (21) అనే యువకుడు మృతి చెందాడు. తోటి స్నేహితులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సమీపంలోని పిఠాపురానికి చెందిన దుర్గాప్రసాద్ స్థానిక సీ5 కంపనీలో అద్దెకు నడుస్తున్న తారురోడ్డు వేసే యంత్రాన్ని ఆపరేట్ చేస్తూ క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న హాస్టల్లో ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం క్యాంపులోని మరో ముగ్గురితో పాటు క్యాంపు సమీపంలో ఉన్న క్వారీలో స్నానం చేయడానికి వెళ్లారు. ఎవరికి వారు స్నానం చేసే పనిలో నిమగ్నమయ్యారు. బండమీద స్నానం చేస్తున్న దుర్గాప్రసాద్ కాలుజారి నీటిలో మునిగిపోయాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో క్యాంపులో ఉన్న వారికి సమాచారం అందించారు. దీంతో క్యాంపు అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే చీకటి పడడంతో సహాయక చర్యలు తీసుకోలేక పోయారు. సోమవారం ఉదయం కుంటాల జలపాతానికి చెందిన గజ ఈతగాళ్లను రప్పించి మృత దేహాన్ని వెలికి తీయించారు. నష్టపరిహారం చెల్లించాలి ఉపాధి కోసం ఆంధ్ర నుంచి వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గాప్రసాద్ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని స్థానిక సూర్యగూడ, ఉమ్రి (బి) ఆదివాసీలు, బంధువులు సీ5 కంపనీ యాజమాన్యంతో పాటు తాను ఆపరేట్ చేసే యంత్రం యజమానిని రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గంట సేపు సంప్రదింపులు జరిగిన అనంతరం సీ5 కంపనీ రూ.4 లక్షలు, యంత్రం యజమాని రూ.2 లక్షలు అందిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాముగౌడ్ తెలిపారు. -
స్మిమ్మింగ్ఫూల్లపై పోలీసుల కార్డన్సెర్చ్
యాకుత్పురా: దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పాతబస్తీలోని స్విమ్మింగ్ పూల్లపై కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ పర్యవేక్షణలో చార్మినార్, మీర్చౌక్, ఫలక్ నుమా, సంతోష్నగర్ డివిజన్లలో సెర్చ్ నిర్వహించారు. గత నెల 23వ తేదీన మదీనానగర్లోని వైఎస్పీ స్విమ్మింగ్ ఫూల్లో ఈతకు వెళ్లిన రిజ్వాన్ అనే యువకుడు మృతి చెందాడు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు స్విమ్మింగ్ ఫూల్లపై కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు రెయిన్బజార్ పీఎస్ పరిధి నుంచి ప్రారంభమైన ఈ సెర్చ్ రాత్రి వరకు కొనసాగింది. రెయిన్బజార్ పీఎస్ పరిధిలోని రెండుతో పాటు మొఘల్పురా, సలాల, బహదూర్పురా, ఖిల్వత్లోని మొత్తం 12 స్విమ్మింగ్ పూల్లలో సెర్చ్ నిర్వహించారు. ఐదు స్విమ్మింగ్ పూల్లలో సీసీ కెమెరాలు, కలుషిత నీరు, లైఫ్ జాకెట్లు లేవు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఐదు స్విమ్మింగ్ పూల్లను పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న స్విమ్మింగ్ ఫూల్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement