-
రష్యా.. మా క్షిపణులు వస్తున్నాయి: ట్రంప్
వాషింగ్టన్/ఐరాస: సిరియా వివాదం అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతోంది. సిరియాలో ఇటీవల జరిగిన విష రసాయన దాడిని తీవ్రంగా తీసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ దేశంలో క్షిపణి దాడికి వెనుకాడబోమని హెచ్చరించారు. ‘సిరియా వైపు వచ్చే ప్రతీ క్షిపణినీ కూల్చేస్తామని రష్యా అంటోంది. రష్యా.. సిద్ధంగా ఉండు. మా క్షిపణులు వస్తున్నాయి. అవి మామూలువి కావు.. అత్యంత ఆధునిక క్షిపణులవి. సొంతదేశ పౌరులను విషవాయువుతో చంపే జంతువుకు నువ్వు మద్దతివ్వకుండా ఉండాల్సింది’ అంటూ ఒక ట్వీట్ చేశారు. -
సిరియా సంక్షోభం.. మళ్లీ వైమానిక దాడులు..!
డమస్కస్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో తాజాగా సోమవారం ఉదయం వైమానిక దాడులు జరిగాయి. ప్రభుత్వ ఆధ్యర్యంలోని తాయ్ఫుర్ వైమానిక స్థావరం లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి. హామ్ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ వైమానిక స్థావరంపై జరిగిన వైమానిక క్షిపణి దాడుల్లో పలువురు చనిపోయారని, పెద్దసంఖ్యలో గాయాలపాలయ్యారని ప్రభుత్వ మీడియా సంస్థ సనా తెలిపింది. సిరియా ప్రభుత్వ వైమానిక స్థావరంపై అమెరికా సైన్యమే వైమానిక దాడులు జరిపినట్టు భావిస్తున్నారు. అయితే, అమెరికా ఈ వార్తలను ఖండించింది. తాము వైమానిక దాడులు నిర్వహించలేదని స్పష్టం చేసింది. తాజాగా తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డౌమా పట్టణంపై విషరసాయనిక దాడులు జరగడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. 42మందిని పొట్టనబెట్టుకొని, వందలమంది గాయపడటానికి కారణమైన గ్యాస్ దాడిపై అంతర్జాతీయ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సిరియా ప్రభుత్వం తన సొంత ప్రజల్నే చంపుకుంటుందని మండిపడ్డాయి. సిరియా అధ్యక్షుడు అసద్ జంతువులాంటి వాడని, అతనితోపాటు అతనికి అండగా నిలుస్తున్న రష్యా, ఇరాన్ ఈ గ్యాస్ భారీ మూల్యం చెల్లించకతప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. -
సిరియాలో ఆగని దాడులు
బీరుట్ : నిరంతరం బాంబుల వర్షంతో అల్లకల్లోలంగా మారిన సిరియాలో నరమేధం ఆగడం లేదు. తాజాగా ఆఫ్రిన్ సిటీపై జరిగిన దాడిలో 18 మంది మృతి చెందారు. ఉత్తర సిరియాలో కుర్దిశ్ వర్గానికి చెందిన ప్రజలు అధికంగా నివసించే ఆఫ్రిన్ సిటీపై టర్కీ ఫిరంగి దాడులు చేయడంతో వీరంతా మరణించినట్లు సిరియా మానవ హక్కుల సంఘం తెలిపింది. మరణించిన వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది జనవరి 20న టర్కీ, సిరియాకు చెందిన తిరుగబాటు ప్రతినిధులు ఆఫ్రిన్ ప్రాంతంలో ప్రమాదకరమైన ఫిరంగులను ఏర్పాటు చేశారు. వీటి మూలంగానే ఆఫ్రిన్ ప్రాంతంలో అలజడులు చెలరేగుతున్నాయి. యూఎస్ మద్దతు గల కుర్దిశ్ పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్(వైపీజీ) నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పటికే టర్కీకి చెందిన బలగాల చేతిలో చిక్కుకోవడంతో రోజుకో ఘటన జరుగుతోంది. నగర ప్రజలు పారిపోయేందుకు వీలుగా ఒకే ఒక రోడ్డు మార్గం మాత్రమే ఉండటంతో వారంతా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కాగా గురువారం నాటికే 30 వేల మంది ఆఫ్రిన్ ప్రజలు మరణించినట్లు ఒక నిఘా సంస్థ తెలిపింది. -
కుప్పకూలిన విమానం ; భారీగా ప్రాణనష్టం
మాస్కో : రష్యాకు చెందిన విమానం ఒకటి సిరియా గడ్డపై కూలిపోయిన ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియాలోని లటాకియా ఫ్రావిన్స్ హమీమ్ ఎయిర్బేర్ వద్ద మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న ఈ ఎయిర్బేస్ నుంచే సిరియా గగనతలంపై దాడులు నిర్వహిస్తుండటం గమనార్హం. విమాన ప్రమాదంపై రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రటకట చేసింది. కూలిపోయింది రవాణా విమానమని, అందులో ప్రయాణిస్తున్న 32 మందిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని ప్రకటనలో పేర్కొన్నారు. చనిపోయినవారిలో ఆరుగురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. కాగా, మిగతావారు సైనికులా, లేక వైమానికదళంలో సహాయకులా అన్నది తెలియాల్సిఉంది. గతంలో సిరియా తీవ్రవాదులు రష్యన్ విమానాలను పేల్చేసిన ఉదంతాల నేపథ్యంలో నేటి ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ప్రాథమిక అంచనా ప్రకారం ఇది ఉగ్రచర్య కాదని, సాంకేతిక లోపం వల్లే విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. కొద్ది రోజుల కిందటే రష్యాలో.. ఆంటొనోవ్ ఏఎన్–148 జెట్ విమానం పేలిపోయి 71 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. -
సిరియాలో ఆగని నరమేధం; మళ్లీ బాంబుల వర్షం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement