-
షేర్లు ‘సిప్’ చేస్తారా? ఇదుగో మీకు కావాల్సిన సమాచారం
మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) గురించి తెలుసు. వారం/పక్షం/మాసం లేదా త్రైమాసికం.. వీటిల్లో ఎంపిక చేసుకున్న నిర్ణీత కాలానికి ఒకసారి బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిగ్గా మ్యూచువల్ ఫండ్ పథకంలోకి పెట్టుబడి వెళుతుంది. ఇదే సిప్ను నేరుగా స్టాక్స్లో పెట్టుబడులకూ సాధనంగా వినియోగించుకోవచ్చు. ఇన్వెస్టర్లు తాము నిర్ణయించుకున్నన్ని షేర్లను నిర్ణీత కాలానికోసారి ఆటోమేటిగ్గా కొనుగోలు చేసుకునే సిప్ సదుపాయాన్ని స్టాక్ బ్రోకర్లు ఆఫర్ చేస్తున్నారు. అయితే, ఇది అందరికీ కాదు.. ఈక్విటీల పట్ల లోతైన అవగాహన, రిస్క్లు తెలిసిన వారికే. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ మార్గమే బెటర్. నేడు సమాచార వ్యాప్తి విస్తృతి కారణంగా గతంతో పోలిస్తే సిప్కు ఎంతో ఆదరణ పెరిగింది. ప్రతి నెలా రూ.11,000 కోట్లకు పైనే సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి పెట్టుబడులు వస్తున్నాయి. ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో రూ.1,000 ప్రతి నెలా సిప్గా నిర్ణయించుకుంటే.. నిర్ణీత రోజున ఆ మొత్తం ఆ పథకంలో పెట్టుబడిగా చేరిపోతుంది. అదే స్టాక్స్లో అయితే ఎంపిక చేసుకున్నన్ని షేర్లు సిప్ రూపంలో డీమ్యాట్ ఖాతాలోకి చేరిపోతాయి. ఇన్వెస్టర్ తరఫున స్టాక్ బ్రోకర్లు ఈ సేవను ఆఫర్ చేస్తున్నారు. ప్రతి నెలా ఏ తేదీన, ఏ కంపెనీ షేర్లను ఎన్ని కొనుగోలు చేయాలన్నది ఇన్వెస్టర్లు చెబితే చాలు. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అయితే ఎంత మొత్తం ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. సొంతంగా వేసుకునే సిప్ (డీఐవై సిప్) ఏ షేర్లలో సిప్ చేసుకోవాలన్నది ఇన్వెస్టర్లు నిర్ణయించుకోవాలి. ఒక్క కంపెనీయే అని కాదు.. ఒకటికి మించిన స్టాక్స్లో సిప్ ఏర్పాటు చేసుకోవచ్చు.. దీనివల్ల పెట్టుబడుల్లో వైవిధ్యం నెలకొంటుంది. తద్వారా పెట్టుబడుల్లో రిస్క్ తగ్గించుకోవచ్చు. స్టాక్ సిప్లను కావాలనుకున్నప్పుడు నిలిపివేసు కోవచ్చు. లేదా రద్దు చేసుకోవచ్చు. ఎప్పుడైనా పెట్టుబడులకు ఇబ్బంది అనిపించినప్పుడు నిలిపివేసుకునే సౌలభ్యం ఇన్వెస్టర్లకు ఉంటుంది. ట్రేడింగ్ ఖాతా నుంచే సిప్లో మార్పులు (మోడిఫై) చేసుకోవచ్చు. స్టాక్ను మార్చుకోవచ్చు. అలాగే, సిప్ రూపంలో కొనుగోలు చేయాల్సిన స్టాక్స్ సంఖ్యను కూడా మార్చుకోవచ్చు. కొందరు బ్రోకర్లు ఎక్సే్ఛంజ్ల్లో ట్రేడయ్యే ఈటీఎఫ్ల్లోనూ సిప్ అవకాశాన్ని కల్పిస్తున్నారు. చార్జీలు నిల్...! ఏ సేవ అయినా అందులో చార్జీలు ఉంటాయని తెలిసిం దే. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో యాక్టివ్ ఫం డ్స్ సాధారణంగా 2.5% వరకు ఎక్స్పెన్స్ రేషియో పేరిట చార్జ్ వసూలు చేస్తున్నాయి. అంటే ఏటా ఇన్వెస్టర్ల పెట్టుబడి వి లువ నుంచి ఈ మేరకు అవి మినహాయించుకుంటాయి. కానీ, స్టాక్ సిప్ విషయానికొస్తే ఎ క్కువ బ్రోకరేజీ సంస్థలు ప్రత్యేకంగా చార్జీలు తీసు కోవడం లేదు. ఈక్విటీ డెలివరీగానే వాటిని చూస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డెలివరీ లావాదేవీలపై 0.5% బ్రోకరేజీ వసూ లు చేస్తోంది. కొందరు బ్రోకర్లు అసలు డెలివరీకి ఎటువం టి చార్జీ తీసుకోవడం లేదు. జెరోదా, అప్స్టాక్స్ ఇవన్నీ డెలివరీకి జీరో బ్రోకరేజీ అమలు చేస్తున్నాయి. కనుక ఆయా సంస్థల్లో స్టాక్ సిప్ ఉచితమే. కాకపోతే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తరఫున లావాదేవీ చార్జీ స్వల్పంగా 0.00345 ఉంటుంది. దీనిపై 18% జీఎస్టీ ఉన్నా కానీ, ఈ చార్జీ చాలా కొద్ది మొత్తమే. రిస్క్లు కూడా ఉన్నాయ్.. మ్యూచువల్ ఫండ్స్ సిప్లతో పోలిస్తే స్టాక్స్ సిప్తో రిస్క్ ఎక్కువగా ఉంటుందని గుర్తించాలి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అన్నవి నిపుణుల ఆధ్వర్యంలో నడిచేవి. అవి ఏ ఒకటి, రెండు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవు. 25 నుంచి 75 స్టాక్స్ వరకు తమ పోర్ట్ఫోలియోలో నిర్వహిస్తుంటాయి. పెట్టుబడుల పరిమాణాన్ని బట్టి స్టాక్స్ సంఖ్యను నిర్ణయిస్తుంటాయి. అది కూడా భిన్న రంగాలకు చెందిన, బిన్న సైజు (లార్జ్, మిడ్, స్మాల్) కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ వైవిధ్యాన్ని పాటించగలవు. తద్వారా పెట్టుబడులపై రిస్క్ను తగ్గిస్తాయి. కానీ, రిటైల్ ఇన్వెస్టర్ నేరుగా సిప్ రూపంలో స్టాక్స్ను కొనుగోలు చేస్తుంటే అది ఒకటి లేదా రెండు స్టాక్స్కు పరిమితం కావచ్చు. దీనివల్ల రిస్క్ అధిక పాళ్లలో ఉంటుంది. సిప్ కోసం ఎంపిక చేసుకున్న రెండు కంపెనీల్లో ఒక కంపెనీలో ఏదైనా అక్రమాలు బయటపడితే.. వ్యాపార విధానంలో తేడా వచ్చి చతికిలపడితే అప్పుడు ఎదుర్కొనే రిస్క్ అధికంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంతేకాదు కొన్నేళ్ల పాటు అలా సిప్ చేసుకుంటూ వెళితే.. మీ పెట్టుబడుల్లో అధిక భాగం అలా ఒకటి రెండు కంపెనీల్లోనే పోగుపడిపోతుంది. మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు, పరిశోధన బృందం మార్కెట్ తీరు, పరిస్థితుల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. భావోద్వేగ నిర్ణయాలకు సాధ్యమైనంత దూరంగా పనిచేస్తుంటారు. పెట్టుబడుల విధానాలు తెలిసి ఉంటారు. ఎంతో లోతైన, విస్తృత అధ్యయనం చేసి, నమ్మకం కలిగితేకానీ ఒక కంపెనీలో ఎక్స్పోజర్ తీసుకోరు. కానీ, రిటైల్ ఇన్వెస్టర్లు ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు ఈ విధమైన పరిశోధన, అధ్యయనం చేస్తారా? దాదాపు లేదనే సమాధానమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తుంది. స్టాక్ సిప్ కోసం ఎంపిక చేసుకున్న కంపెనీ.. సమర్థవంతమైనది కాకపోతే నష్టపోయేందుకు అవకాశం ఉంటుంది. మార్కెట్ల గురించి తెలిసి, మంచి విజ్ఞానం ఉన్న వారికి స్టాక్ సిప్ అనుకూలిస్తుంది. నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వారికి.. రాబడులా లేక నష్టాలా అన్నది ముఖ్యంగా ఎంపికపైనే ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. అంత పరిజ్ఞానం ఉన్న వారికే స్టాక్సిప్. లేదంటే నిపుణుల ఆధ్వర్యంలో నడిచే మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ చేసుకోవడమే మెరుగైన ఆప్షన్ అవుతుంది. ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్లు అసలు స్టాక్ సిప్ గురించి ఆలోచించకపోవడమే మంచిది. ప్రయోజనం ఉందా..? ఒక కంపెనీ స్టాక్ ధర ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదు. తగ్గుతూ పెరుగుతుండడం సాధారణం. సిప్ రూపంలో అయితే తగ్గినప్పుడు, పెరిగినప్పుడు పెట్టుబడి పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకేసారి పెట్టుబడులు పెట్టే వెసులుబాటు లేని ఇన్వెస్టర్లు ఈ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అటువంటి వారు సిప్ రూపంలో దీర్ఘకాలంలో నచ్చిన కంపెనీలో వాటాలను పోగు చేసుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు లోనైనప్పుడే ఇన్వెస్ట్ చేయాలని వేచి చూసే అవస్థ, అయోమయానికి స్టాక్ సిప్ పరిష్కారం చూపుతుంది. ఎందుకంటే మార్కెట్లు పడినా, పెరిగినా సిప్ రూపంలో వాటిని కొనుగోలు చేస్తుంటారు కనుక ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ (ఫోమో)’ను అధిగమించొచ్చు. ఫోమో అంటే ఒకవేళ వెంటనే కొనుగోలు చేయకపోతే ఆ స్టాక్ ధర పెరిగిపోతుందేమో, చేయి దాటిపోతుందేమో? అన్న ఆందోళన. ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఫోమో కారణంగానే స్టాక్స్ను గరిష్ట వ్యాల్యూషన్ల వద్ద కొనుగోలు చేస్తుంటారు. అక్కడి నుంచి స్టాక్స్ పడిపోతుంటే భయంతో అమ్మి బయటపడదామని భావిస్తుంటారు. సిప్ అయితే ఈ తలనొప్పి ఉండదు. -
మ్యూచువల్ ఫండ్పై రుణం కావాలా?
పర్సనల్ లోన్కన్నా తక్కువ వడ్డీకే లభ్యం దాదాపు అన్ని బ్యాంకులూ, ఎన్బీఎఫ్సీలలో లభ్యం ఎంపిక చేసిన మ్యూచువల్ ఫండ్లకు మాత్రమే వర్తింపు ఫండ్ యూనిట్లు తనఖాలో ఉన్నా... డివిడెండ్లు మీకే అత్యవసర నిధి అందరికీ అవసరమే. ఇది జీతానికి ఎన్ని రెట్లు ఉండాలనే విషయమై నిపుణులు రకరకాలుగా చెబుతుంటారు. మరి ఇలా బ్యాంకులో అత్యవసర నిధి కోసం కొంత మొత్తం దాచుకోవాల్సిందేనా? నిజానికి అప్పటికప్పుడు రుణాన్నిచ్చే పెట్టుబడి సాధనాల్ని కూడా అత్యవసర నిధిగానే భావించవచ్చు. అలాంటి వాటిలో మ్యూచ్వల్ ఫండ్లు కూడా ఒకటి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానం (సిప్) ద్వారా పెట్టుబడి పెడుతున్నా... లేక ఏకమొత్తంగా ఒకేసారి ఇన్వెస్ట్ చేసినా చాలు. అత్యవసరంగా డ బ్బులు కావాల్సి వచ్చినపుడు వీటిని అమ్మేయాల్సిన పనిలేదు. తనఖా పెట్టి కూడా ఏ బ్యాంకు నుంచో, ఎన్బీఎఫ్సీ నుంచో తక్కువ వడ్డీకి రుణం తీసుకోవచ్చు. అదెలాగో చెప్పేదే ఈ కథనం... మీరు గనక మ్యూచు వల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నట్లయితే ఆ పత్రాల్ని త నఖా పెట్టుకుని రుణమో, లేకపోతే ఓవర్డ్రాఫ్టో కావాలని మీ దగ్గర్లోని బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీని అడగొచ్చు. ఇలా రుణమివ్వటానికి ముందు బ్యాంకులు ఆ యూని ట్లను తాత్కాలికంగా తమ పేరిట ‘లీన్’లో ఉంచుకుంటాయి. లీన్ అంటే... ఒకరకంగా యాజమాన్య హక్కుల్ని సదరు బ్యాంకుల పేరిట బదలాయించటమే. మీరు రుణం తీర్చలేని సందర్భంలో వాటిని విక్రయించే హక్కు వాటికుంటుందన్న మాట. సదరు ఫండ్ యూనిట్ల విలువను బట్టి మీకు ఎంత రుణమివ్వాలో నిర్ణయిస్తాయి. ఆ రుణాన్ని తిరిగి చెల్లించేశాక ‘లీన్’ను ఎత్తివేసి, యాజమాన్య హక్కుల్ని మీ పేరిట బదలాయిస్తాయి. అయితే లీన్ కోసం మీకు మ్యూచ్వల్ ఫండ్లు జారీ చేసిన ఫండ్ హౌస్ను సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంకు పేరిట సదరు యూనిట్లను లీన్ ఇవ్వాల్సిందిగా అడగాలి. ఈ మేరకు యూనిట్ల హక్కుదారు సంతకం చేసిన లేఖను ఫండ్హౌస్కు సమర్పించాలి. రుణంగా ఎంతిస్తారు? మీ దగ్గరున్న యూనిట్లను, వాటి విలువను బట్టే కాక... ఏ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను తనఖా పెడుతున్నారన్న దానిపై కూడా రుణం విలువ ఆధారపడి ఉంటుంది. సహజంగా అప్పటికి ఉన్న విలువలో 50 శాతాన్ని రుణంగా పొందే అవకాశముంటుంది. కొన్ని బ్యాంకులైతే కనిష్ఠం- గరిష్ఠం ఎంతిస్తామనేది ఒక పరిమితి విధించుకుంటాయి. వాటిని బట్టి రుణం ఇస్తుంటాయి. చాలా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు షేర్లపై రుణాలిస్తుంటాయి. ఆ పరిధిలోనే మ్యూచువల్ ఫండ్లపై కూడా రుణాలిస్తాయి. వడ్డీ సాధారణంగా పర్సనల్ లోన్ రేటు కంటే తక్కువే ఉంటుంది. అయితే సదరు ఫండ్లలోని రిస్కును బట్టి బ్యాంకులు ఈ వడ్డీని నిర్ణయిస్తుంటాయి. రుణం తీసుకోవటానికి ముందు... అన్ని ఫండ్ యూనిట్లపైనా రుణం రాదు. బ్యాంకులు ఎంపిక చేసిన జాబితాలోని ఫండ్ యూనిట్లపై మాత్రమే రుణమిస్తూ ఉంటాయి.అనుమతించిన ఈక్విటీ, డెట్ ఫండ్ యూనిట్ల రెండింటిపైనా రుణమిస్తారు.బ్యాంకులైతే అన్నీ ఈ రుణాలివ్వవచ్చు. ఎన్బీఎఫ్సీల దగ్గరకు వచ్చేసరికి 100 కోట్ల పైబడి ఆస్తులున్నవి మాత్రమే ఈ రుణాలివ్వవచ్చని ఆర్బీఐ చెబుతోంది.రుణం తీరేదాకా ఈ యూనిట్లను విక్రయించజాలరు. కానీ వీటిపై వచ్చే డివిడెండ్ నేరుగా మీకే అందుతుంది. రుణం తిరిగి చెల్లించటంలో విఫలమైతే... లీన్ను ఉపయోగించుకుని వాటిని విక్రయించి డబ్బులివ్వాల్సిందిగా ఫండ్ హౌస్ను బ్యాంకులు కోరుతాయి. నిజానికి మ్యూచువల్ ఫండ్లపై రుణాలు తీసుకోవచ్చని చాలామందికి తెలియదు. దీంతో ఎక్కువ మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవటం లేదని, దీనివల్ల కాస్త తక్కువ వడ్డీకే రుణాలొస్తాయని బ్యాంకులు చెబుతున్నాయి.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కమలోత్సాహం..
పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి
కమలోత్సాహం..
కమలోత్సాహం..
సీఎం సభతో కాంగ్రెస్లో జోష్..
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్
బీజేపీ గెలుపునకు హిందువులు ఏకం కావాలి
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement