-
పార్లమెంటులో టీ-బిల్లుకు మద్దతివ్వండి: టీ.జేఏసీ నేతలు
జాతీయ పార్టీలకు టీ.జేఏసీ నేతల విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని టీజేఏసీ నేతలు పలు జాతీయ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకించాలని వారు కోరారు. టీజేఏసీ ైచైర్మన్ కోదండరాం నేతృత్వంలో నేతలు తెలంగాణకు మద్దతు తెలిపిన రాజకీయపక్షాలను కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ, బిల్లుకు మద్దతు కూడగట్టే పనిలో మంగళవారం రోజంతా బిజీగా గడిపారు. తొలుత ఉదయం గాంధీ సమాధి రాజ్ఘాట్ వద్ద గంట సేపు మౌన దీక్ష చేశారు. అనంతరం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డిని కలిసి తెలంగాణకు మద్దతు కోరారు. ఆ తర్వాత సాయంత్రం బీజేపీ అధ్యకుడు రాజ్నాథ్సింగ్ను ఆయన నివాసంలో కలుసుకుని తెలంగాణకు మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నరాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందని, తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని రాజ్నాథ్ తేల్చిచెప్పారు. సీఎం కిరణ్ వైఖరి ఎలా ఉందని, విభజన తర్వాత ఉద్యోగుల పరిస్థితి ఏమిటని, రాయల తెలంగాణ ప్రతిపాదన తదితర అంశాలపై రాజ్నాథ్ జేఏసీ నేతలతో మాట్లాడారు. కిరణ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా, సీమాంధ్రకు సీఎంగా వ్యవహరిస్తున్నారని నేతలు చెప్పారు. విభజన జరిగితే ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన తెలంగాణను అడ్డుకోడానికి ఆంధ్రవారు వేసిన ఎత్తుగడ అని రాజ్నాథ్కు చెప్పారు. అనంతరం టీజేఏసీ నేతలు జేడీయూ అధినేత శరద్యాదవ్ను కలుసుకున్నారు. యూపీఏ బిల్లు పెడితే తాము మద్దతు ఇస్తామని శరద్ యాదవ్ హామీ ఇచ్చారన్నారు. నేతల భేటీల సందర్భంగా టీజేఏసీ కన్వీనర్ కోదండరాం, శ్రీనివాస్రెడ్డి, దేవీప్రసాద్, విఠల్, మల్లేపల్లి లక్ష్మయ్య, వెంకటస్వామి, తదితరులు మీడియాతో మాట్లాడారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. జీవోఎం తుది భేటీ తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. బుధవారం ఎన్సీపీ, బీఎస్పీ సహా తెలంగాణకు మద్దతు ఇచ్చిన పార్టీలను కలుస్తామని చెప్పారు. తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదించాలి: సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి, దానిని ఆమోదించాలని సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యతేంద్ర కుమార్ మంగళవారం ఒక ప్రకటన చేశారు. రాయల తెలంగాణ పేరిట రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. -
‘రాయల’ను గట్టిగా వ్యతిరేకించండి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు పది జిల్లాలతో కూడిన తెలంగాణకే తాము సమ్మతిస్తామని, రాయల తెలంగాణ పేరుతో కొత్త నాటకాలను తాము అంగీకరించబోమని తెలంగాణ జేఏసీ నేతలు కేంద్ర మంత్రి జైపాల్రెడ్డికి స్పష్టం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదన ఏ రూపంలో వచ్చినా గట్టిగా వ్యతిరేకించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 5 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ బిల్లుకు జాతీయ పార్టీల మద్దతుకూడగట్టేందుకు ఢిల్లీకి వచ్చిన జేఏసీ నేతలు కోదండరాం, దేవీ ప్రసాద్, రాజేందర్రెడ్డి, అద్దంకి దయాకర్లు జైపాల్తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. విభజన అంశం సాఫీగా సాగుతుందనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ కొత్తగా రాయల అంశాన్ని తెరపైకి తేవడంపై వారంతా జైపాల్ వద్ద అసహనాన్ని వ్యక్తంచేశారు. రాజకీయ లభ్ధిని ఆశించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరచడమేనని వారు అన్నట్లు తెలిసింది. దీనిపై జైపాల్ స్పందిస్తూ, ఈ విషయమై తాను ప్రధాని మన్మోహన్ సహా ఇతర ముఖ్య నేతలతో చర్చిస్తున్నానని, రాయల తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించానని చె ప్పారు. నేడు రాజ్ఘాట్ వద్ద మౌన దీక్ష రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రాజ్ఘాట్లోని గాంధీ సమాధి వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు మౌన దీక్ష పాటించనున్నట్టు టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మేరకు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement