-
కాంగ్రెస్లో లాబీయింగ్ బంద్ కావాలి: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో లాబీ యింగ్ వ్యవస్థ బంద్ కావాలని, పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్రెడ్డి(జగ్గారెడ్డి) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కష్టపడే కాంగ్రెస్ నాయకులకు గుర్తింపు లేదని, కష్టపడుతున్న వారికి ఢిల్లీలో ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కష్టపడేవారిని రాహుల్ దగ్గరికి వెళ్లకుండా ఓ కోటరీ అడ్డుకుంటోందని ఆరోపించారు. సీఎల్పీ నేత ఎంపికలో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలను గౌరవించాలని కోరారు. వరుసగా రెండు ఎన్నికల్లో ఒంటేరు ప్రతాప్రెడ్డి పోరాడి ఆర్థికంగా చితికిపోయారన్నారు. ఆయన పార్టీ మారడాన్ని తాను తప్పుపట్టబోనన్నారు. పార్టీలో మార్పు రాకపోతే ప్రతి బలహీనుడు టీఆర్ఎస్కు ఆకర్షితులవుతారని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. -
కేసీఆర్ దాదాగిరి చేయి.. పాతరేయకు!
మెదక్ ఉప ఎన్నిక పోలింగ్ తేది సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతునే ఉంది. తాజాగా మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ .. కేసీఆర్ పై మాటల బాణాల్ని సంధించారు. మంచి కోసం చేయడానికి 'దాదాగిరి' చేసినా ఫర్వాలేదు.. కాని మీడియాను పాతరేస్తాం అనే మాటలు సమంజసం కాదు అని అన్నారు. దాదాగిరి చేయాల్సి వస్తే తప్పును తప్పుగానే చూపించాలని.. అంతేకాని మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి జవదేకర్ విజ్క్షప్తి చేశారు. అభివృద్ది కోసం పాటు పడండి. కేంద్రప్రభుత్వం సహకరిస్తుంది. కేంద్ర, రాష్ట్రం కలిసి మెలిసి ఉండాలి. తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం అని అన్నారు. అంతేకాని మీడియాను పాతరేస్తాం అని అనడం పద్దతి కాదు అని ఆయన ధీటుగా జవాబిచ్చారు. మీడియా కూడా బాధ్యతగా ప్రవర్తించాలన్నారు. పాతరేస్తామని వాడిన భాషనే పాతరేయాలని కేసీఆర్ కు సూచించారు. మెదక్ జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డికి మద్దతుగా ప్రకాశ్ జవదేకర్ ప్రచారాన్ని నిర్వహించారు. బుర్ర ఉన్నవాళ్లు బీజేపీ అభ్యర్థికి ఓటేయ్యరు అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జవదేకర తప్పుపట్టారు. బుర్ర, హృదయం ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటు వేస్తారని ఆయన అన్నారు. 25 కోట్లమంది బీజేపీ ప్రభుత్వాన్ని మద్దతు తెలిపారన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు దేశంలోని పేద ప్రజల్ని అవమాన పరిచారని జవదేకర్ అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement