-
ప్రముఖ సంగీత విద్వాంసుడు కన్నుమూత..
Tabla Musician Tabla Prasad Passed Away: ప్రముఖ సంగీత విద్వాంసుడు 'తబలా ప్రసాద్' శుక్రవారం (మార్చి 18) ఉదయం కన్నుమూశారు. తబలా ప్రసాద్ 70 సంవత్సరాలకుపైగా తమిళం, హిందీ, తెలుగులో 4 తరాల స్వరకర్తలతో పనిచేశారు. ఆయన తబలా సంగీతం ఇచ్చిన ఎన్నో పాటలు హిట్ అయ్యాయి. ఉత్తర భారదేశంలో ఆర్డి బర్మన్, సి. రామచంద్ర, లక్ష్మీకాంత్ ప్యారీలాల్, నవ్షత్, పప్పిలహరితోపాటు సౌత్ ఇండియాలో స్క్రీన్ మ్యుజిషియన్ తిలక్ కెవిఎం, మెలోడీ కింగ్ ఎమ్ఎస్వి, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా వంటి చాలా మందికి తబలా వాయించారు. అంతేకాకుండా ఈ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా, జివి ప్రకాష్తో కలిసి ఐదుకుపైగా భాషల్లో సుమారు 2500 చిత్రాలకు పనిచేశారు. వీటన్నింటితో కలిపి దాదాపు 60000 పాటలకు ఆయన తబలా వాయించారు. 79 ఏళ్ల తబలా ప్రసాద్కు భార్య కృష్ణవేణి, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన కుమారులైన రమణ, కుమార్లు కూడా సంగీత విద్వాంసులుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తబలా ప్రసాద్ భౌతికకాయానికి శనివారం చెన్నైలోని వడపళనిలో ఉన్న ఏవీఎం స్డూడియో సమీపంలో ఉన్న శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. -
పండిత అనురాధా పాల్.. తబలా మాంత్రికురాలు
ఉస్తాద్ అల్లారఖా పెద్ద తబలా మాస్టర్. ఉస్తాద్ జాకిర్ హుసేన్ కూడా. శంకర్ ఘోష్, ఉదయ్ మజుందార్... ఎందరో పురుష ఉస్తాద్లు.. పండిత్లు. కాని వీరితో సరిసాటిగా కాదు కాదు తనే ఒక విలక్షణ మాస్టర్గా అనురాధా పాల్ తబలా వాదనలో ఖ్యాతి గడించింది. స్త్రీలు ఈ రంగంలో రాణించడం సామాన్యం కాదు. ఎన్నో అడ్డంకులను అపధ్వనులను దాటి ఆమె ఈ స్థితికి చేరుకుంది. ఆమె పరిచయం... ముంబైలో అనురాధా పాల్ తబలా కచ్చేరీ జరుగుతోంది. దానికి హాజరైన చిత్రకారుడు ఎం.ఎఫ్.హుసేన్ ఆసాంతం ఆ కచ్చేరి చూసి, ఆమెను కలిసి, ‘రేపు మీ ఇంటికి వస్తున్నాను’ అని వెళ్లిపోయాడు. ఎందుకు వస్తున్నట్టు? మరుసటి రోజు హుసేన్ ఆమె ఇంటికి వచ్చాడు. ఆయనతోపాటు రఫ్ కట్ చేసిన ‘గజ్గామిని’ సినిమా ఉంది. మాధురి దీక్షిత్తో ఎం.ఎఫ్.హుసేన్ తీసిన సినిమా అది. త్వరలో విడుదల కావాల్సి ఉంది. ‘దీనికి నువ్వు నేపథ్య సంగీతం అందించాలి’ అన్నాడు హుసేన్. అనురాధా పాల్ ఆశ్చర్యపోయింది. ‘నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఏమిటి? మీరు తలుచుకుంటే ప్రపంచంలోని మహా మహా సంగీతకారులు ఎవరైనా ఇస్తారు’ అని అనురాధా పాల్ అంది. ‘కాదు నువ్వు ఇవ్వాలి. సినిమా అంతా నీ తబలా వినిపిస్తే చాలు’ అని మీటింగ్ ముగించాడు ఎం.ఎఫ్.హుసేన్. అనురాధా పాల్ తాను ఒక్కతే తబలా వాయిస్తూ ‘గజ్గామిని’కి రీ రికార్డింగ్ చేసింది. బహుశా ప్రపంచంలో కేవలం తబలా మీద అదీ ఒక స్త్రీ వాయిద్యకారిణి వాయిస్తూ ఉంటే రీ రికార్డింగ్ ముగించుకున్న సినిమా అదొక్కటే ఏమో. అది అనురాధా పాల్ ఘనత. ప్రపంచలోనే ఆమె తొలి మహిళా తబలా వాయిద్య కారిణి. అనురాధా పాల్ది ముంబై. అక్కడే పుట్టి పెరిగింది. వాళ్ల కుటుంబం తాతగారి హయాంలో దేశ విభజన సమయంలో ముంబై వచ్చేసింది. ఆమె తండ్రి దేవిందర్ పాల్ వీధి దీపాల కింద చదువుకుని పెద్ద ఫార్మా కన్సల్టెంట్ అయ్యాడు. తల్లి ఇళా పాల్ గాయని, పెయింటర్. ఆ ఇంట్లో కళల పట్ల ఆసక్తి ఉండేది. పిల్లలు ఏదో ఒక కళలో కనీస అభిరుచి కలిగి ఉండాలని తల్లిదండ్రులు కోరుకునేవారు. అయితే చదువు తప్పనిసరి. కాని ఇంటి చిన్న కుమార్తె అయిన అనురాధా పాల్కు చదువు కంటే కళ మీదే ఎక్కువ ఆసక్తి ఏర్పడింది. ఆమె ముందు గాత్రం నేర్చుకుంది. కాని గాత్రం కొనసాగిస్తూ ఉంటే తోడు వాయిద్యం అయిన తబలా ఆమెను ఆకర్షించింది. పాడుతూనే తబలా మీద కొట్టవలసిన తాళాన్ని అందించేది. తబలా ఎందుకు నేర్చుకోకూడదు? అని ఆమెకు అనిపించింది. ఆడపిల్లలు సితార్, వీణ, వయొలిన్ వంటి వాయిద్యాలు నేర్చుకుంటారు. కాని తబలా పూర్తిగా మగవాళ్ల విద్యగా చలామణిలో ఉంది. అలాంటి విద్యను ఆడపిల్ల నేర్చుకోవడమా? కాని తొమ్మిదో ఏటకే అనురాధా పాల్ తబలాలో ప్రావీణ్యం సంపాదించింది. కచ్చేరి ఇచ్చింది కూడా. అనురాధా పాల్ మొదట బెనారస్ ఘరానాలోని గురువుల దగ్గర తబలా నేర్చుకున్నా చివరకు ఉస్తాద్ అల్లారఖా ఆ తర్వాత ఉస్తాద్ జాకిర్ హుసేన్ శిష్యురాలైంది. 18 ఏళ్లకు ఆమె ముంబైలో కచ్చేరి ఇస్తే పత్రికలు ఆమెకు ‘లేడీ జాకిర్ హుసేన్’ అనే బిరుదు ఇచ్చాయి. నిజానికి ఇలాంటి బిరుదులు పరోక్షంగా స్త్రీల శక్తిని తక్కువ అంచనా వేసేవే. కాలక్రమంలో అనురాధా పాల్ తన పేరుతో తానే ఒక గొప్ప తబలా విద్వాంసకురాలిగా పేరు పొందింది. ఆమె పర్కషనిస్ట్ కూడా. అంటే ఒకటికి మించి తోడు వాయిద్యాలను వాయించే వారిని పర్కషనిస్ట్ అంటారు. అనురాధా పాల్ కనీసం 40 రకాల వాయిద్యాలను వాయించగలదు. అలా తానే అన్ని వాయిద్యాలు వాయిస్తూ ఆమె ఆల్బమ్ చేసింది కూడా. అయితే కొత్తల్లో ఆమెకు అంత సజావుగా ఎంట్రీ దొరకలేదు. ‘‘ఒక కచ్చేరిలో నన్ను కొన్ని తాళాలు మాత్రమే వాయించమన్నారు. దూకుడుగా వాయించాల్సిన తాళాలను మగ తబలా ప్లేయర్ వాయిస్తాడని చెప్పారు. కారణం అడిగాను. ‘దూకుడు తాళాల పని నీకు అప్పచెప్తే ఆడపిల్లతో కష్టం చేయిస్తున్నారన్న మాట వస్తుంది’ అని చెప్పారు. నేను అడ్డం తిరుక్కుని మొత్తం వాయించి ప్రేక్షకుల హర్షధ్వానాలు అందుకున్నాను’’ అంటుంది అనురాధా పాల్. సాధారణంగా కచ్చేరీలలో మగవారు గాత్రంలో ఉంటే మగ సహ వాద్యకారులనే తోడు తీసుకుంటారు. ఆడవాళ్లను ప్రోత్సహించరు. ఆ విషయంలో కూడా అనురాధా పాల్ సుదీర్ఘ పోరాటం చేసి పెద్ద పెద్ద గాత్ర విద్వాంసుల తోడు కూచుని కచేరీ చేయగలిగింది. ‘నేను మహిళను. ఈ శక్తి నాది. నా శక్తికి విలువ ఇవ్వండి. నేను మహిళను కాబట్టి నాకు మెచ్చుకోలులో వాటా ఇవ్వకండి’ అంటుంది అనురాధా పాల్. ఆమె అందరూ మహిళా విద్వాంసులు ఉండే ‘స్త్రీ శక్తి’ అనే బ్యాండ్ను తయారు చేసి ప్రపంచంలో అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చింది. అలాగే క్లాసికల్ను వెస్ట్రన్తో జత చేస్తూ ‘రీచార్జ్’ అనే బ్యాండ్ ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇస్తుంది. తన సోలో ప్రదర్శనలు ప్రత్యేకం. ఇంత సాధించినా ఆమెకు ‘పద్మశ్రీ’ ఇంకా దక్కలేదు. సంగీత ప్రపంచంలో పురుషుల ప్రాభవం ఇంకా కొనసాగుతున్నదనే అనుకోవాలి. కాని ఎంత కాలం? అనురాధా పాల్ లాంటి వాళ్లు మరెందరో పుట్టుకు వచ్చి ఇదంతా కచ్చితంగా మార్చరూ? -
పిన్న వయసులో పెద్ద గుర్తింపు
ప్రతిభా కిరణం మాస్టర్ తృప్తరాజ్ పాండే అతి చిన్న వయసు తబలా వాద్యకారుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. అంతేకాదు ప్రపంచంలోనే అతి పిన్న వయసులో గొప్ప తబలా వాద్యకళాకారుడిగా గుర్తింపు పొందాడు. ఇందులో మరొక విశేషం ఉంది. పాండే చేతి వేళ్ల నరాల బలహీనతతో పుట్టాడు. ఇలాంటి పిల్లలు సామాన్యంగా ఏవైనా వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. అయితే పాండే ఈ బలహీనత ను మనోధైర్యంతో అధిగమించాడు. 2006 అక్టోబర్లో ముంబైలోని ములుండ్ ప్రాంతంలో పాండే పుట్టాడు. 18 నెలల పసివాడుగా ఉన్నప్పుడే లయబద్ధంగా ఏ వాద్యాన్నయినా వాయించే నైపుణ్యం ఉండేది. రెండేళ్ళ వయసున్నప్పుడే పాండే సోమయ్య కాలేజీలో మొదటి ప్రదర్శన ఇచ్చాడు. మూడేళ్ళ వయసులో ఆల్ ఇండియా రేడియోలో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చి, ‘బాల కళారత్న’ అవార్డు పొందాడు. పాండే తన నాలుగేళ్ళ వయసు లో దూరదర్శన్ సహ్యాద్రిలో ప్రదర్శన ఇచ్చాడు. ఇప్పటివరకు పాండే భారతదేశంలో దాదాపు 50 సంగీత కచ్చేరీలు చేశాడు. పుట్టుకతో ఉన్న తన నరాల బలహీనతను అధిగమించి, లయబద్ధంగా తబలా వాయిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగలిగే సంగీత మాంత్రికుడైన పాండే ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తాడు. పెద్దయ్యాక మంచి తబలా వాద్యకళాకారుడిగా, క్రికెటర్గా పేరు సంపాదించుకోవాలనేది పాండే కోరిక. ఈ చిన్నారి సంగీత విద్వాంసుడు ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు పొందాడు. సాధన చేయడం, దాన్ని ప్రేక్షకులకు ఉల్లాసం కలిగేలా ప్రదిర్శించడం ద్వారా ప్రతిభకు వయసుతో పనిలేదని, నైపుణ్యతకు హద్దు లేదని నిరూపించాడు పాండే. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్తో పాటు ఇండియన్ బుక్, యునిక్ వరల్డ్ రికార్డు మొదలైనవి పాండేను ‘పిన్న వయసు తబలా విద్యాంసుడి’ గా గుర్తించాయి. పూజ్య ప్రముఖ్ స్వామి, హుస్సేన్, పద్మశ్రీ అనూప్ జలోటా, పండిట్ శివ కుమార్ శర్మ వంటి ఎందరో ప్రముఖ వ్యక్తుల ప్రశంసలు పొందాడు. ఎన్నో సాంస్కృతిక సంఘాలు, సంస్థలు నిర్వహించిన కార్యక్రమా ల్లో పాండే ప్రదర్శనలిచ్చాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement