-
తైవాన్లో విమాన ప్రమాదం
-
విమాన ప్రమాదంలో 31కి చేరిన మృతులు
బీజింగ్: తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య గురువారం 31కి చేరింది. మరో 12 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఈ ప్రమాద ఘటనలో గాయాల బారిన పడి ప్రాణాలతో బయట పడిన 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ట్రాన్స్ ఏసియా 'ఫ్లైట్ జీఈ 235' విమానం ఐదుగురు సిబ్బంది సహా మొత్తం 58 మంది ప్రయాణికులతో ఉత్తర తైపీలోని సాంగ్షాన్ విమానాశ్రయం నుంచి కిన్మెన్ ద్వీపానికి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకుంది. బయలుదేరిన కొద్ది నిమిషాలకే విమానం ఓ పక్కకు ఒరిగి ఫైఓవర్ను ఢీ కొట్టి... ముందుకు దూసుకెళ్లి... ముక్కలుగా విడిపోయి... నదిలో పడిపోయింది. అధికార యంత్రంగా వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. దాంతో 15 మందిని రక్షించారు. ఆ విమాన ప్రయాణికుల్లో 31 మంది చైనీయులే ఉన్నా సంగతి తెలిసిందే. -
కూలిన అల్జీరియా విమానం!
116 మంది మృతి చెందినట్లు అనుమానం ఆఫ్రికాలోని ఉత్తర మాలిలో గల్లంతు అల్జీర్స్: మరో విమానం కుప్పకూలిందా? వారం కిందట మలేసియా విమానం పేల్చివేత, బుధవారం తైవాన్ విమానం కుప్పకూలిన ఘటనలను మరవకుండానే మూడో విమాన దుర్ఘటన చోటుచేసుకుంది! ఆఫ్రికా దేశమైన అల్జీరియాకు చెందిన ఎండీ-83 అనే ఎయిర్ అల్జీరీ విమానం గురువారం మాలి దేశంలోని ఉత్తర ప్రాంతం మీదుగా ప్రయాణిస్తూ గల్లంతైంది. దీంతో ఈ విమానం కూలిపోయి ఉండొచ్చని... అందులోని 116 మంది మృతిచెంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. బుర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగో నుంచి 1:17 గంటలకు (స్థానిక కాలమానం) అల్జీరియా రాజధాని అల్జీర్స్కు బయలుదేరిన 50 నిమిషాల అనంతరం విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలను కోల్పోయిందని అధికారులు చెప్పారు. విమానంలో 50 మందికిపైగా ఫ్రాన్స్ జాతీయులు, 27 మంది బుర్కినా ఫాసో జాతీయులతోపాటు మరో 12 దేశాలకు చెందిన ప్రయాణికులు ఎక్కారన్నారు. విమానం ఆచూకీ కనుగొనేందుకు అల్జీరియా, ఫ్రాన్స్ ప్రభుత్వాలు యుద్ధ విమానాలను రంగంలోకి దించాయన్నారు. మాలి, నైజర్ దేశాల పరిధిలోని ఎడారిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రయాణ మార్గంలో భారీ వర్షం కురుస్తున్నందువల్ల విమాన దిశను మార్చుకునేందుకు అనుమతివ్వాలంటూ నైజర్ దేశంలోని ఏటీసీకి పైలట్ నుంచి చివరి సందేశం అందిందని బుర్కినా ఫాసో ప్రభుత్వం తెలిపింది. ఈ విమానం స్విఫ్ట్ ఎయిర్కు చెందిందని స్పెయిన్ పైలట్ల యూనియన్ తెలిపింది. తైవాన్ విమానం బ్లాక్బాక్స్లు లభ్యం మగాంగ్: తైవాన్లో బుధవారం కుప్పకూలిన ట్రాన్స్ఏసియా ఎయిర్వేస్ విమానానికి చెందిన బ్లాక్బాక్సులను అధికారులు గురువారం కనుగొన్నారు. ఘటనాస్థలి సమీపంలో లభించిన వీటిని స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్బాక్స్ల ద్వారా ఈ ప్రమాదానికి కారణం తెలిసే అవకాశం ఉందన్నారు. ఈ ప్రమాదంలో 48 మంది మృతిచెందడం తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement