-
ఆస్పత్రిలో ఉన్నా.. సాయం మానలేదు
తమిళనాడుకు చెందిన 48 ఏళ్ల వ్యక్తి తాను తిరిగి స్వదేశానికి వెళ్లడానికి అవసరమైన పత్రాల కోసం యూఏఈలో చాలా కాలంగా కోర్టు చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నాడు. రెండేళ్ల పాటు అతడు 20 సార్లు అలా తిరిగాడు. అతడి కష్టం విషయం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు తెలిసింది. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో సుష్మా ఆస్పత్రిలో ఉన్న విషయం తెలిసిందే. అయినా.. తిరుచిరాపల్లికి చెందిన జగన్నాథన్ సెల్వరాజ్ అనే వ్యక్తి గురించి తెలియడంతో.. ఆమె వెంటనే అతడికి సాయం చేసి, తిరిగి సొంత గ్రామానికి రప్పించారు. ఈ విషయాన్ని సుష్మా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సెల్వరాజ్ తల్లి తమిళనాడులో మరణించినా.. ఆమె అంత్యక్రియలకు వెళ్లడానికి అతడికి అనుమతి లభించలేదు. అతడి కష్టాన్ని దుబాయ్కి చెందిన ఖలీజ్ టైమ్స్ పత్రిక ప్రచురించడంతో సుష్మా దృష్టికి విషయం వెళ్లింది. వెంటనే ఆమె కలగజేసుకున్నారు. భారత కాన్సులేట్ను సంప్రదించి అతడికి కావల్సిన పత్రాలు ఇప్పించారు. ట్రాఫిక్, ఎండ, ఇసుక తుపాన్లు.. ఇలాంటి వాతావరణంలో తాను ట్రెక్కింగ్ చేసుకుంటూ దుబాయ్ రోడ్ల మీద వెళ్లినట్లు సెల్వరాజ్ చెప్పాడు. దుబాయ్ శివార్లలోని సోనాపూర్లో గల తన నివాసం నుంచి ప్రతిరోజూ 22 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కోర్టుకు వెళ్లేవాడినన్నాడు. దాదాపు రెండేళ్ల నుంచి అలా కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం కనిపించలేదు. చివరకు సుష్మా స్వరాజ్ చొరవతో ఇంటికి చేరుకున్నాడు. We have brought him back to India and sent him to his village. He went up and down to the court 20 times over a year. That made it 1000 Kms. https://t.co/UGxjGE1Uhf — Sushma Swaraj (@SushmaSwaraj) 6 December 2016 -
ప్రయాణికుడి ఆత్మాహుతియత్నం.. రైల్లో మంటలు
తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కేరళలోని త్రివేండ్రం - నేత్రావతి ఎక్స్ప్రెస్ రైలు టాయిలెట్లో ఆత్మాహుతి యత్నం చేశాడు. దాంతో రైలు బోగీలో మంటలు చెలరేగాయి. ఈ కారణంగా అళప్పుజ జిల్లాలోని కాయంకులం స్టేషన్లో రైఉలును మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాసేపు ఆపేశారు. తమిళనాడులోని వెల్లూరు ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేనట్లు కనిపిస్తోందని పోలీసులు తెలిపారు. అతడిని వారు అదుపులోకి తీసుకుని అళప్పుజ మెడికల్ కాలేజి ఆస్పత్రికి తరలించారు. అతడికి 40 శాతం కాలిన గాయాలయ్యాయి. ఇంజన్కు సమీపంలో ఉన్న జనరల్ కంపార్టుమెంటు టాయిలెట్ లోపలి నుంచి పొగ రావడం తాము చూశామని తోటి ప్రయాణికులు చెప్పారు. అధికారులు వెంటనే ఆ బోగీని వేరుచేసి, దూరంగా తీసుకెళ్లి ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement