-
తంగడపల్లిలో జయశంకర్ విగ్రహం ఆవిష్కరణ
చౌటుప్పల్ (మునుగోడు) : తంగడపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన దివంగత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆదివారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో జయశంకర్ పాత్ర ఎంతో కీలకమన్నారు. 1969 నుంచి తెలంగాణ సాధనే లక్ష్యంగా నిరంతరం శ్రమించారని కొనియాడారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని తెలిపారు. నేటి తరానికి ఆచార్య జయశంకర్ ఆదర్శనీయుడని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడవాలని కోరారు. సర్పంచ్ ముటుకుల్లోజు దయాకరాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మార్కెట్ చైర్మెన్ బొడ్డు రేవతిశ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మెన్ చిరందాసు ధనుంజయ, ఎంపీటీసీ బీపీ కరుణ, గ్రంధాలయ చైర్మెన్ ఊడుగు మల్లేశం, ఉప సర్పంచ్ అరిగె కిష్టయ్య, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
220 లీటర్ల నీలికిరోసిన్ పట్టివేత
చౌటుప్పల్ మండలంలోని తంగడపల్లి గ్రామంలో మంగళవారం 220లీటర్ల నీలి కిరోసిన్ను పట్టుకున్నట్టు తహసీల్దార్ షేక్అహ్మద్ తెలిపారు. అరిగె భిక్షపతి కిరాణం దుకాణంలో 170లీటర్లు, సూరంశెట్టి రంగయ్య కిరాణం దుకాణంలో 50లీటర్ల నీలి కిరోసిన్ నిల్వ ఉంచగా, గ్రామ పోలీసు అధికారి రమేష్ పట్టుకుని, అప్పగించినట్టు తెలిపారు. ప్రజాపంపిణీ కిరోసిన్ను అక్రమంగా నిల్వ ఉంచినందుకు 6ఏ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కిరోసిన్ను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. -
గోదాం
దారి మళ్లుతున్న రేషన్బియ్యం తంగడపల్లిలో లారీని తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు 213 క్వింటాళ్ల బియ్యానికి ఉన్నది 176 క్వింటాళ్లే.. రేషన్ బియ్యం గోదాములనుంచే పక్కదారి పడుతుందని చెప్పడానికి బలం చేకూర్చే ఘటన చౌటుప్పల్ మండలం తంగడపల్లిలో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో సోమవారం వెలుగుచూసింది. కాంట్రాక్టర్లు, ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జ్లు, రేషన్డీలర్లు కలిసి గోదాముల నుంచే లారీల బియ్యాన్ని మాయం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. చౌటుప్పల్ రేషన్ బియ్యం సరఫరా చేసే కాంట్రాక్టర్లు, ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జ్లు, రేషన్ డీలర్లు కుమ్మక్కై ఐఎంజీ గోదాముల నుంచే లారీలకొద్దీ రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. గతంలో రేషన్ దుకాణాల నుంచి రాత్రి పూట వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అమ్ముకునే వారు. ఇటీవలి కాలంలో అంతా కుమ్మక్కై గోదాముల నుంచే కాంట్రాక్టర్లే పక్కదారి పట్టిస్తున్నారు. ఈ వైనంపై గత నెల 25న ‘లారీల కొద్దీ పక్కదారి’ అనే శీర్షికన కథనం ప్రచురించాం. అధికారుల నుంచి స్పందన కరువైంది. దీంతో గోదాం నుంచి బియ్యం పక్కదారి పడుతున్న వైనాన్ని ప్రత్యక్షంగా వెలుగులోకి తెచ్చేందుకు సోమవారం సాక్షి, సాక్షి టీవీ రంగంలోకి దిగింది. బియ్యాన్ని ఎలా పక్కదారి పట్టిస్తున్నారో బట్టబయలైంది. చౌటుప్పల్లోని ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఏపీ16టీటీ 4921అనే నంబరు గల లారీ 213.67క్వింటాళ్ల బియ్యం, 8క్వింటాళ్ల చక్కెరతో సోమవారం మధ్యాహ్నం బయలుదేరింది. సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి, రాధానగర్తండా, మర్రిబావింతండాల్లోని రేషన్ దుకాణాలకు సరఫరా చేయాలి. గోదాంలోనే 45క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తగ్గించి, సంస్థాన్ నారాయణపురం మండలానికి లారీ వెళ్తుందని వచ్చిన సమాచారం మేరకు గోదాం నుంచే వెంబడించింది. సుమారు 2కి.మీ.ల దూరం వెళ్లాక తంగడపల్లిలో లారీని ఆపి, పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులకు సమాచారమివ్వడంతో, అధికారులు వచ్చి లారీలోని బియ్యాన్ని లెక్కించారు. 427బస్తాలకు గానూ 353బస్తాలే ఉన్నాయి. 74బస్తాలు అనగా, 37.17క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్టు అధికాారులు గుర్తించారు. పంచనామా నిర్వహించారు. కాంట్రాక్టర్పై, ఐఎంజీ గోదాం ఇన్చార్జ్పై చర్య తీసుకోమని జాయింట్ కలెక్టర్కు నివేదించనున్నట్టు డివిజనల్ విజిలెన్స్ ఇన్చార్జ్ అధికారి ఉదయ్కుమార్, డీటీసీఎస్ ఎల్లేశం, ఆర్ఐ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. రెండు దుకాణాలకు చెందిన బియ్యమే పంపా : మాధవిలత, గోదాం ఇన్చార్జి రాధానగర్ తండా, వావిళ్లపల్లి గ్రామాలకు చెందిన రెండు రేషన్ దుకాణాలకు సంబంధించిన 166.11క్వింటాళ్ల బియ్యాన్ని మాత్రమే పంపా. మర్రిబావితండాకు సంబంధించి పంపలేదు. నేను రికార్డులు రాసుకుంటూ పనిలో ఉన్నా. హామాలీలు ఎన్ని బస్తాలు వేసుకెళ్లారో తెలియదు. జేసీకి నివేదించా గోదాం ఇన్చార్జి, లారీడ్రైవర్ కుమ్మక్కై బియ్యాన్ని పక్కదారి పటించినట్టు అవగతమవుతోంది. ఇద్దరూ కలిసి రెండు రేషన్ దుకాణాలకు చెందిన బియ్యమేనని వాంగ్మూలమిచ్చారు. రెండు దుకాణాలకు చెందిన బియ్యమే అయితే 166.11క్వింటాళ్లుండాలి. కానీ లారీలో 176క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించాం. వారు చెప్పినట్టు 10క్వింటాళ్ల బియ్యం ఎక్కువగా ఉండడానికి కూడా వీల్లేదు. ఇదే విషయాన్ని జేసీకి మెసేంజర్ ద్వారా సోమవారం రాత్రే నివేదించా. - ఉదయ్కుమార్, సివిల్సప్లై విజిలెన్స్ డివిజన్ ఇన్చార్జ్, భువనగిరి -
తంగడపల్లి రోడ్డు విస్తరణకు రూ.9.65 కోట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: హిమాయత్సాగర్ నుంచి తంగడపల్లి వరకు రోడ్డు వెడల్పునకుగాను ప్రభుత్వం రూ.9.65 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి జి. ప్రసాద్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా విడుదల చేసిన నిధులతో ప్రస్తుతమున్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు పరిపాలన అనుమతులు లభించాయన్నారు. ఈ రోడ్డుపై పెరుగుతున్న రద్దీ దృష్ట్యా వెడల్పు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, ఈనేపథ్యంలో ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వానికి నివేదించామన్నారు. దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేసిందన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
స్ట్రాంగ్ రూమ్ల తనిఖీ
ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
అడ్డగోలుగా పార్కింగ్ చేస్తే.. అంతే
సరకు రవాణాలో సరికొత్త వ్యూహాలు
బాలికపై కేజీహెచ్ ఉద్యోగి లైంగిక వేధింపులు
India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
కేకే లైన్లో డీఆర్ఎం తనిఖీలు
జంతు సంరక్షణ చట్టం నోడల్ అధికారిగా ఏసీపీ శ్యామలరావు
కెమికల్ ఇంజినీరింగ్లో విస్తృత అవకాశాలు
తప్పక చదవండి
- మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా
- Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
- Lok Sabha Election 2024: ఆరో విడతలో 61.11 శాతం
- కలిసికట్టుగా ముందుకు..
- Lok Sabha Election 2024: ముస్లింల ఓట్ల కోసం ‘ముజ్రా’
- India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
- సిరుల విరులు..కొండ చీపుర్లు
Advertisement