-
‘ఆసియా’ ఫైనల్లో తస్నిమ్, తార
సురబాయ (ఇండోనేసియా): ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ బాలికల అండర్–15 సింగి ల్స్ విభాగంలో భారత్కు టైటిల్ లభించడం ఖాయమైంది. ఈ విభాగంలో ఫైనల్ చేరిన ఇద్దరు క్రీడాకారిణులు తస్నిమ్ మీర్, తారా షా భారత్కే చెందిన వారు కావడం విశేషం. శనివారం జరిగిన అండర్–15 బాలికల సింగిల్స్ సెమీఫైనల్స్లో తస్నిమ్ 21–16, 21–11తో సోరా ఇషియోకా (జపాన్)పై... తారా షా 21–18, 21–14తో కజునె ఇవాటో (జపాన్)పై విజయం సాధించారు. చరిత్రకు విజయం దూరంలో... గ్వాంగ్జౌ (చైనా): మరో విజయం సాధిస్తే జపాన్ స్టార్ కెంటో మొమోటా... బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధికంగా 11 టైటిల్స్ గెలిచిన ప్లేయర్గా రికార్డు సృష్టిస్తాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో ప్రపంచ నంబర్వన్, ప్రపంచ చాంపియన్ మొమోటా టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మొమోటా 21–17, 21–12తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై గెలిచాడు. మరో సెమీఫైనల్లో ఆంథోనీ జిన్టింగ్ (ఇండోనేసియా) 21–15, 21–15తో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో జిన్టింగ్తో మొమోటా తలపడతాడు. -
మేఘన–తస్నీమ్ జంటకు ‘ఆసియా’ డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. మయన్మార్లో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో అండర్–15 బాలికల డబుల్స్ విభాగంలో మారెడ్డి మేఘన రెడ్డి–తస్నీమ్ మీర్ జోడీ విజేతగా నిలిచింది. హైదరాబాద్కు చెందిన మేఘన, గుజరాత్ అమ్మాయి తస్నీమ్ ఫైనల్లో 23–21, 21–18తో గాంగ్ యో జిన్–జియోంగ్ డా యోన్ (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. 40 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ పోరులో రెండు జోడీలు ప్రతీ పాయింట్కు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. అయితే కీలకదశలో మేఘన–తస్నీమ్ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ టోర్నమెంట్లో భారత్కు స్వర్ణం సహా నాలుగు కాంస్య పతకాలు లభించాయి. అండర్–15 బాలుర సింగిల్స్లో శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... అండర్–17 బాలికల సింగిల్స్లో అదితి భట్... అండర్–17 బాలుర సింగిల్స్లో మెరబా లువాంగ్... అండర్–15 బాలుర డబుల్స్లో పుల్లెల సాయివిష్ణు–గంధం ప్రణవ్ రావు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు దక్కించుకున్నారు. -
అమెరికా ‘ఇంటిదొంగ’
అంతర్జాతీయ ఉగ్రవాదం మీద ప్రకటించిన యుద్ధంలో పాకిస్థాన్ను తన కుడిభుజంగా అమెరికా ‘భావిస్తోంది’. ఆ కుడిభుజం తాజా నిర్వాకమే ఇప్పుడు అమెరికాను కలవరపెడుతోంది. అమెరికా విదేశ వ్యవహారాల శాఖలో ఒక ఇంటిదొంగ తమ కోసం పని చేస్తున్నట్టు పాకిస్థాన్ అధికారి ఒకరు నోరు జారారు. ఈ అంశమే ఇప్పుడు అగ్రదేశాన్ని కలవరపెడుతోంది. ఆ ఇంటిదొంగ పేరు రాబిన్ ఎల్. రాఫెల్. 67 ఏళ్ల ఈ మహిళా దౌత్య నిపుణురాలి మీద గత నెల నుంచి అమెరికా నిఘా సంస్థ ఎఫ్బీఐ కన్ను వేసి ఉంచింది. కిందటి నెలలో ఇంటిని సోదా చేసి, కొంత సమాచారాన్ని కనుగొన్నారు. ఆమె కార్యాలయానికి సీలు కూడా వేశారు. కానీ రాఫెల్ను ఎఫ్బీఐ ప్రశ్నించలేదని ఆమె కార్యదర్శి ప్రకటించడం విశేషం. అలాగే, రాఫెల్ పాకిస్థాన్ మిత్రురాలు కాబట్టే ఎఫ్బీఐ ప్రశ్నిం చిందని అనుకోవడం సరికాదని పాకి స్థాన్ దౌత్యవేత్త తస్నీమ్ అస్లాం ప్రకటించడం ఈ వివా దంలో మరో కోణం. ఇది అమె రికా అంతర్గత వ్యవహారమని అంటూనే, రాఫెల్ పాక్ చిర కాల మిత్రురాలని తస్నీమ్ చెప్పక చెప్పారు. కానీ, గూఢ చర్యం వంటి కీలక ఆరోపణల గురించిన దర్యాప్తులో ఎఫ్బీఐ సాధారణంగా సమాచారాన్ని బయటకు పొక్కనీయదు. అందుకు భిన్నంగా ఇప్పుడు జరుగుతోంది. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ను రహస్యంగా విన్నపుడు ఈ వివాదం బయటపడింది. అమెరికా దేశ రహస్యాలు అందించే ఒక అధికారి ఉన్నారని అందులో మాట్లాడిన పాక్ అధికారి చెప్పాడు. దీనితో కొన్ని నెలలు నిఘా వేసి, ఇంటిదొంగను పట్టుకున్నారు. రాఫెల్ తన కార్యాలయం నుంచి కొంత సమాచారం ఇంటికి తీసుకువెళ్లినట్టు తేలింది. అయితే పాకిస్థాన్ ఫోన్ కాల్ ఆధారంగానే ఇదంతా చేస్తున్నారా అన్నది తేలడం లేదు. ఆమెపై ఇప్పటికీ నేరారోపణ పత్రం ఏదీ దాఖలు కాలేదు. కానీ గత నెలలోనే రాఫెల్ అధికారాలను పూర్తిగా తొలగించారు. ఆమె పదవీ కాలం నవంబర్ రెండుతో ముగిసిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అమెరికా దౌత్య వ్యవహారాలలో నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన రాఫెల్ ఆ దేశ మహిళా దౌత్యవేత్తలలో ప్రముఖురాలు. బిల్ క్లింటన్ హయాం లో కీలకంగా పనిచేశారు. ట్యునీషియాలో అమెరికా రాయబారిగా పనిచేయ డంతో పాటు, దక్షిణ ఆసియా వ్యవహారాల శాఖకు సహాయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ముఖ్యంగా పాకిస్థాన్ సంబంధాలలో లోతైన అధ్యయనం చేసినవారు. 2005లో పదవీ విరమణ చేసిన తరువాత మళ్లీ అదే శాఖలో చేరి, పాకిస్థానీ లాబీకి దగ్గరయ్యారు. ఈ నెల ఆరంభం వరకు రాఫెల్ పాక్ పౌర వ్యవహారాలలో అమెరికాకు సలహాదారుగానే ఉన్నారు. పాకిస్థాన్కు అమెరికా ఇచ్చిన 7.5 బిలియన్ డాలర్ల సైనికేతర నిధుల నిర్వహణలో ఆమెదే కీలక పాత్ర. పాకిస్థాన్ను కేంద్రంగా మార్చుకుని అఫ్ఘానిస్థాన్ భూమి మీద సోవి యెట్ యూనియన్కు వ్యతిరేకంగా అమెరికా జరిపిన పోరాటం సమయంలో ఒక దౌత్య నిపుణుల బృందం అమెరికాలో వృద్ధిలోకి వచ్చింది. అందులో ఒకరు రాఫెల్. 1975 నుంచి పాకిస్థాన్తో ఆమె అనుబంధం కొనసాగుతోంది. తనకు ఇండియా కంటె పాకిస్థాన్ బాగా అర్థమైందని ఆమె చెప్పేవారు. ఒకటి వాస్తవం. రాఫెల్ మీద ఆరోపణలను నమ్ముతున్నవారు, వ్యతి రేకిస్తున్నవారు కూడా ఉన్నారు. ఆమెను ‘పక్షి’ అని వ్యంగ్యంగా పిలిచే వ్యతిరేక వర్గం బలంగానే ఉంది. అఫ్ఘాన్ యుద్ధంలో వేయి మంది సైనికులు చని పోవడానికి కారణమైన పాకిస్థాన్ను సమర్థించే అధికారిగా ఆమెను ఈసడించే వారు తక్కువేమీ కాదు. తాలిబన్ను శాంతి చర్చలకు తీసుకురావాలని పాకి స్థాన్ను ఒప్పించవచ్చునని భావించి విఫలమైన వ్యక్తిగా కూడా ఆమెను సైనికాధికారులు పరిగణిస్తారు. ఈ యుద్ధంలో 2,350 మంది సైనికులను అమెరికా కోల్పోయింది. రాఫెల్ మాజీ భర్త ఆర్నాల్డ్ ఎల్ రాఫెల్ 1988లో పాకిస్థాన్లో రాయబారి. ఆ సమయంలో జరిగిన విమాన ప్రమాదంలోనే పాకిస్థాన్ అధ్యక్షుడు, సైనిక నియంత జనరల్ జియా ఉల్ హక్ మరణించాడు. విమానం కూల్చివేత పెద్ద కుట్ర అన్న వాదన ఉంది. ఇప్పటికీ చిక్కుముడిగా ఉన్న ఆ విమాన ప్రమాదంలోనే ఆర్నాల్డ్ కూడా మరణించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement