-
పాన్కార్డ్ జాగ్రత్త.. ఈ విద్యార్థికి జరిగిందే మీకూ జరగొచ్చు!
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థికి ఆదాయపన్ను శాఖ నుంచి రూ.46 కోట్లకు ట్యాక్స్ నోటీసు వచ్చింది. మామూలు విద్యార్థికి అన్ని కోట్ల పన్ను నోటీసు రావడమేంటి అనుకుంటున్నారా? అతని పాన్ కార్డ్ను కొందరు దుర్వినియోగం చేశారు. దీంతో ఆ విద్యార్థికి ఐటీ నోటీసు వచ్చింది. తనకు తెలియకుండా తన బ్యాంకు ఖాతా నుండి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గ్వాలియర్కు చెందిన ప్రమోద్ కుమార్ దండోటియా అనే కాలేజీ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో 2021లో తన పాన్కార్డ్ నెంబర్తో ఓ కంపెనీ ప్రారంభించి లావాదేవీలు నిర్వహించారని ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ విభాగాల నుంచి నోటీసు వచ్చినట్లు పేర్కొన్నాడు. ఇది ఎలా జరిగిందో తనకు తెలియదని, తన పాన్ కార్డ్ దుర్వినియోగం అయినట్లు వాపోయాడు. ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు ప్రమోద్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. శుక్రవారం మరోసారి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందిందని, మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ తెలిపారు. -
పాన్ కార్డ్ స్కాం: టీచర్ చనిపోయిన పదేళ్లకు రూ.7 కోట్ల ట్యాక్స్ నోటీసు..
భోపాల్: మధ్యప్రదేశ్లో ఓ కుటుంబానికి విచిత్రమైన సంఘటన ఎదురైంది. ఆ కుటుంబానికి చెందిన స్కూల్ టీచర్ పేరిట రూ.7 కోట్ల ట్యాక్సీ నోటీసు వచ్చింది. అయితే.. ఆ టీచర్ చనిపోయిన పదేళ్ల తర్వాత ఈ నోటీసులు రావడం గమనార్హం. 2013లో ఆ టీచర్ చనిపోగా.. 2017-18 ఏడాదికి గాను ఆమె పేరిట ఇంత మొత్తంలో పన్ను వసూలు నోటీసులు వచ్చాయి. ఉషా సోని మధ్యప్రదేశ్లోని పట్కేటా గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నారు. జులై 26న ఆమె పేరిట రూ.7.55 కోట్ల ట్యాక్సీ వసూలుకు చెందిన ఆదేశాలు ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన ఆమె కుమారుడు పవన్ సోనీ.. మాట్లాడుతూ..' 2013 నవంబర్ 16న మా తల్లి చనిపోయింది. న్యాచురల్ కాస్టింగ్ సంస్థ పేరుపై ముడి సరుకులు కొనుగోలుకు సంబంధించి ఈ ట్యాక్స్ చెల్లించాలని నోటీసులో ఉంది. కేసు నమోదు చేశాము. మా అమ్మ పాన్ కార్డులను ఎవరో దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరో మాకు తెలియదు.' అని అన్నారు. మధ్యప్రదేశ్లో ఈ ఒక్క కుటుంబమే కాదు. అనేక కుటుంబాలకు ఇలాంటి ఘటనలే ఎదురవుతున్నాయి. గిరిజన ప్రాంతాలైన బేతూల్ జిల్లాలో దాదాపుగా 44 మందికి ఇలాంటి నోటీసులు వచ్చాయి. దాదాపు రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల వరకు నోటీసులు వచ్చాయి. నితిన్ జైన్ అనే మరోవ్యక్తికి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. నెలకు రూ.5 నుంచి 7 వేల వరకు సంపాదించే సామర్థ్యం గల ఇతనిపై రూ.1.26కోట్ల పన్ను వసూలుకు సంబంధించిన నోటీసులు వచ్చాయి. తమిళనాడులోని కోర్టల్లమ్లో తన పేరుపై ఓ అకౌంట్ ఉంది. ఈ పేరును ఇదే మొదటిసారి వినడమని నితిన్ తెలిపారు. 2014-15 మధ్య తన పేరుపై అకౌంట్ ఓపెన్ అయినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ ఘటనలపై బేతూల్ ఎస్పీ సిద్ధార్ద చౌదరి స్పందించారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: జైపూర్ కాల్పుల ఘటన.. ఆ రోజు రాత్రి రైలులో ఏం జరిగింది..? -
స్టార్టప్ లకు పన్ను దెబ్బ తగలనుందా...?
ముంబై : మార్కెట్ వాల్యుయేషన్ తక్కువున్న స్టార్టప్ లకు పన్ను దెబ్బ తగలనుంది. ఫండింగ్ లు ఎక్కువగా వస్తూ.. మార్కెట్ వాల్యుయేషన్ పెంచుకోలేని స్టార్టప్ లకు పన్నులు వేయాలని ఆదాయపు పన్ను విభాగం యోచిస్తోంది. మార్కెట్ వాల్యుయేషన్ పడిపోతున్న స్టార్టప్ లతో ఆదాయపు పన్ను విభాగం చర్చిస్తోందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో చాలా స్టార్టప్ కంపెనీలు వాల్యుయేషన్ పెంచుకోలేకపోతున్నాయి.. లాభాలు, వృద్ధితో పాటు పోటీని తట్టుకోలేక స్టార్టప్ లకి ఈ దెబ్బ తగులుతోంది. మార్కెట్లో ఇష్యూ చేసిన షేర్ల కంటే ఫేర్ వాల్యు ఎక్కువ కలిగిఉంటే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56 ప్రకారం పన్నులు విధించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు స్టార్టప్ కంపెనీల వాల్యుయేషన్ పై ఆదాయపు పన్ను అధికారులు రిపోర్టులు నివేదించమని ఆదేశిస్తున్నారు. సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా, ఏంజెల్ ఇన్వెస్టర్లు దగ్గర నమోదుకాని స్టార్టప్ లకు ఈ పన్ను ప్రభావం ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది. ఆదాయపు పన్ను విభాగం ప్రతిపాదిస్తున్న ఈ పన్ను విధానంపై స్టార్టప్ కమ్యూనిటీ ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఈ ప్రతిపాదనపై ఆదాయపు పన్ను విభాగం నుంచి ఎలాంటి నోటీసులు అధికారికంగా జారీ కాలేదు. గతంలో చాలా స్టార్టప్ కంపెనీలు నల్లధనాన్ని ప్రీమియంకు ఆఫర్ చేస్తూ వైట్ మనీగా మార్చుకునే దుర్వినియోగాలకు పాల్పడినట్టు పన్ను అధికారులు చెప్పారు. ఈ దుర్వినియోగాలను దృష్టిలో ఉంచుకుని, మార్కెట్ వాల్యుయేషన్ పై దృష్టిసారించామని అధికారులు చెబుతున్నారు. రాండమ్ గా అడ్ జస్ట్ మెంట్లను తాము చూడటం లేదని, కానీ వాల్యుయేషన్లో పారదర్శకత కోల్పోతుండటం సీరియస్ గా తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే చాలా స్టార్టప్ కంపెనీలు పన్ను నోటీసులు అందుతాయేమోననే ఆందోళనతో, వారి కన్సల్టెన్సుతో, లాయర్లతో సంప్రదింపులు ప్రారంభించారు. -
ఉప్పల్ స్టేడియానికి నోటీస్
ఉప్పల్ : ఉప్పల్ క్రికెట్ స్టేడియంకు జీహెచ్ఎంసీ అధికారులు పన్ను నోటీసు జారీచేశారు. రూ.14.5 కోట్ల రూపాయల మేర ఆస్తి పన్ను ఆస్తి పన్ను బకాయి ఉండడంతో ఈ మేరకు డిమాండ్ నోటీస్ను ఉప్పల్ సర్కిల్ అధికారులు క్రికెట్ స్టేడియం అధికారులకు శుక్రవారం అందజేశారు.పన్ను చెల్లింపుపై గతంలోనే నోటీసులు జారీ చేసినా సరైన స్పందన లేదని అధికారులు తెలిపారు. వివరణ ఇచ్చేందుకు స్టేడియం అధికారులు ఒకరోజు గడువు కోరడంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement