-
ఐటీ రిటర్న్ దాఖలు చేసే ముందు ఇలా..
పశ్చిమగోదావరి, నిడమర్రు: క్యాలెండర్ సంవత్సరం ముగిసి 20 రోజులు దాటింది. సుమారు మరో 70 రోజుల్లో అంటే 2018 మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈలోపు పన్ను ప్లానింగ్ జరిగిపోవాలి. ఆఖరు నిమిషంలో కంగారు పడకుండా ముందస్తుగా అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవటం ద్వారా ఆదాయ పన్నుశాఖకు రిటర్న్ సమర్పించే విషయంలో అవగాహన ఉంటుంది. ఆఖరు నిమిషంలో చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా ఉంటే ముందుగా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పన్ను రాయితీల వినియోగంపై స్పష్టత ఉండాలని నిపుణులు చెబుతున్నారు. టీడీఎస్ వర్తించే ఉద్యోగులు రాయితీ పొందేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు ముందే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. వాటి వివరాలు తెలుసుకుందాం. సెక్షన్ 80 సీ కింద మినహాయింపుల కోసం ఈ సెక్షన్ కింద పెట్టే పెట్టుబడులపై ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. హౌసింగ్ లోన్ మూలధనం చెల్లింపులు, బీమాతో సహా అనేక రకాల పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద మినహాయింపులు వర్తిస్తాయి. వాటికి సంబంధించిన ఆధారాలు జాగ్రత్త చేసుకోవాలి. రూ.1.5 లక్షల మేర పన్ను మినహాయింపు ♦ ఉద్యోగుల్లో ఎక్కువమంది ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు(ఈఎల్ఎస్ఎస్), జీవిత బీమా పథకాలు, పీపీఎఫ్ సహా చిన్న పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తే ఓకే.. లేదంటే ఇప్పటికైనా 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల మేర పన్ను మినహాయింపు పొందడానికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మంచిది. ♦ ఎక్కువ మొత్తంలో టీడీఎస్ కట్ కాకుండా, ఈఎల్ఎస్ఎస్ అయితే ఫండ్ స్టేట్మెంట్, జీవిత బీమా పాలసీ అయితే ప్రీమియం చెల్లించిన రసీదులను ఆఫీసు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో సమర్పించాలి. ♦ పీపీఎప్ పెట్టుబడులకు సంబంధించి బ్యాంకు లేదా పోస్టాఫీసు ద్వారా చేసిన ఆర్థిక లావాదేవీల వివరాలు సూచించే పాస్బుక్ జిరాక్స్ కాపీ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ ఆన్లైన్ ద్వారా పీపీఎఫ్లో పెట్టుబడులు పెడితే ఖాతా వివరాలు, లావాదేవీల వివరాలు తెలిపే ఇ–రసీదు సమర్పించాలి. ఇవేకాకుండా సుకన్య సమృద్ధి యోజన లేదా ఐదేళ్ల కాలపరిమితి ఉండే టాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్ చేస్తే బ్యాంకు ఇచ్చే డిపాజిట్ రసీదు లేదా సర్టిఫికెట్ కాపీ సమర్పించాలి. ఈ జాగ్రత్తలు తీసుకోని పక్షంలో టీడీఎస్ ఎక్కువ కట్ అవుతుంది. మళ్లీ రిటరŠన్స్ ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు.. మీ పిల్లలకు స్కూల్, కళాశాలల్లో చెల్లించే ట్యూషన్ ఫీజు కూడా 80సీ కింద మినహాయింపు వర్తిస్తుంది. ఐటీ రాయితీ క్లెయిమ్ చేస్తుంటే ఫీజులకు సంబంధించిన రసీదులు జిరాక్స్ కాపీని అకౌంట్స్ సిబ్బందికి ఇవ్వాలి, ఈ రసీదుపై స్కూల్/కళాశాల అధికారి స్టాంప్, ఫీజు అందుకున్నవారి సంతకం తప్పకుండా ఉండాలి. తొలిసారి ఇల్లుకొన్న వ్యక్తులు.. కొత్తగా ఇల్లు కొన్నవారికి ఈసారి ప్రత్యేక రాయితీ ఉంది. సాధారణంగా సెక్షన్ 24 కింద గృహరుణాలపై చెల్లించే వడ్డీ మొత్తంలో గరిష్టంగా రూ.2 లక్షలు వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. ∙మొట్టమొదటిసారిగా ఇల్లు కొన్నవారికి అదనంగా మరో రూ.50 వేలు వరకు సెక్షన్ 80ఈఈ కింద ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. అంటే తొలిసారి ఇల్లు కొన్నవారికి వడ్డీ చెల్లింపులపై రూ.2.5 లక్షల వరకూ పన్ను రాయితీ ఉంది. బ్యాంక్ నుండి మూలధనం ఎంత చెల్లించారు. వడ్డీ ఎంత చెల్లించారు తెలిపే సర్టిఫికెట్ సమర్పించాలి. హెచ్ఆర్ఏ మినహాయింపు ♦ హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసేవారు తగిన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఇంటి వార్షిక అద్దె రూ.లక్ష (నెలకు 8,333) దాటితే ఇంటి యజమాని పాన్ నంబర్ కూడా తప్పనిసరిగా పేర్కొనాలి. ఇంకా నిర్ణీత ఫారంలో ఇంటి యజమాని సంతకంతో కూడిన లీజు అగ్రిమెంట్, ఇంటి యాజమాన్యానికి సంబంధించిన ఆధారాలు కాపీలు ఇవ్వాలి. ♦ ఇంటి యాజమాన్యానికి సంబంధించి పన్ను రసీదు లేదా తాజా విద్యుత్ బిల్లు సరిపోతుంది. ఇల్లు ఏదైనా కోఆపరేటివ్ సొసైటీలో ఉంటే ఆ సొసైటీ ఇచ్చే షేర్ సర్టిఫికెట్ అయినా సరిపోతుంది. ఏప్రిల్ 2017 నుంచి ఇప్పటివరకు అందుకున్న ఒరిజనల్ అద్దె రసీదులు కూడా సమర్పించాలి. గృహ రుణంతో కొన్న ఇంటిని అద్దెకిచ్చినా ఆ రుణంపై చెల్లించిన అసలు, వడ్డీల వివరాలు విడివిడిగా పేర్కొంటూ బ్యాంకు ఇచ్చిన సర్టిఫికెట్ జతచేయాలి. ఎన్పీఎస్ పెట్టుబడులు.. మీరు పనిచేసే కంపెనీ, సంస్థ ద్వారా జాతీయ పింఛన్ పథకం (ఎన్పీఎస్)లో పెట్టుబడులు పెడితే, ఆ వివరాలన్నీ మీ కంపెనీ దగ్గరే ఉంటాయి. కాబట్టి ఆ పెట్టుబడుల వివరాలు ప్రత్యేకంగా కంపెనీకి సమర్పించాల్సిన అవసరం లేదు. జీతం నుంచి కాకుండా ఇతరత్రా వచ్చే ఆదాయం నుంచి ఎన్పీఎస్లో వ్యక్తిగత హోదాలో రూ.50 వేలు పెడితే మాత్రం ఆ వివరాలు ఆఫీసుకు సమర్పించాలి. ఇందుకోసం ఉద్యోగి పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్(ప్రాన్), టైర్ 1 ఖాతాకు సంబంధించిన ఎన్పీఎస్ లావాదేవీల స్టేట్మెంట్ వివరాలు ఇవ్వాలి. మెడిక్లెయిమ్లు మెడిక్లెయిమ్ పాలసీ కింద చెల్లించిన ప్రీమియం ప్రూఫ్లు కంపెనీకి ఇవ్వాలి. ఈ చెల్లింపులకు సెక్షన్ 80డీ కింద సీనియర్ సిటిజన్లకు రూ.30 వేల వరకు ఇతరులకు రూ.25 వేల వరకూ మినహాయింపు లభిస్తుంది. -
ట్యాక్స్ రిటర్న్ ఫారాలను సరళీకరించండి
ఆర్థికమంత్రి జైట్లీతో పారిశ్రామిక ప్రతినిధుల భేటీ న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్స్ దరఖాస్తులను సరళీకరించాలని కోరుతూ శుక్రవారం పలువురు వ్యాపారవేత్తలు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీతో సమావేశమయ్యారు. అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని జైట్లీ ఈ సందర్భంగా పారిశ్రామిక ప్రతినిధులకు హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే... 2015-16 అసెస్మెంట్ ఇయర్కు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ ఇటీవల 14 పేజీల ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దరఖాస్తును నోటిఫై చేసింది. దీని ప్రకారం... పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు దేశంలో తమకున్న బ్యాంక్ అకౌంట్ల గురించి, స్థిర డిపాజిట్ల విషయాలూ... అలాగే తాము జరిపిన విదేశీ పర్యటనల గురించి ఐటీ శాఖకు తప్పనిసరిగా తెలియజేయాలి. నల్లధనం అడ్డుకట్టకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ తెలిపింది. అయితే ఐటీఆర్లోని పలు కాలమ్ల పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ అనుచిత సమాచారం కోరడం సరికాదని విమర్శులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐటీఆర్ను ఐటీ శాఖ తిరిగి సమీక్షించి, సరళీకరించాలని నిర్ణయించింది. దీనిపై ఆర్థికమంత్రి శుక్రవారం సీఐఐ, ఫిక్కీ, అసోచామ్ తదితర పారిశ్రామిక మండళ్ల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. 68 ఎఫ్ఐఐలకు పన్ను నోటీసులు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు (ఎఫ్ఐఐ) ఆదాయ పన్ను శాఖ కేవలం 68 కేసుల్లోనే నోటీసులు పంపినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లోక్సభకు తెలిపారు. కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) కింద రూ. 602.83 కోట్లు రాబట్టేందుకు ఈ నోటీసులు జారీ అయినట్లు వివరించారు. కాగా డిజిన్వెస్ట్మెంట్ జాబితాలో బీఎస్ఎన్ఎల్, ఎయిరిండియా లేవని కూడా సిన్హా తెలియజేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement