-
రీడ్ అండ్ టేలర్ కేసులో మరో మలుపు
ముంబయి: రీడ్ అండ్ టేలర్ కంపెనీ దివాలా ప్రక్రియ మరో మలుపు తిరిగింది. ప్రమోటర్ నితిన్ కస్లివాల్ రూ.3,524 కోట్ల మేర అవకతవకలకు పాల్పడ్డాడని, ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలని రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) వెంకటేశన్ శంకర్ నారాయణన్ పేర్కొన్నారు. మరోవైపు రీడ్ అండ్ టేలర్ను గట్టెక్కించడానికి కాకుండా లిక్విడేషన్ కోసమే రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) ప్రయత్నాలు చేస్తున్నారని రీడ్ అండ్ టేలర్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ ఆసోసియేషన్ వ్యాఖ్యానించింది. వివరాలివీ.. రూ.3,524 కోట్ల మేర మోసాలు... రీడ్ అండ్ టేలర్ కంపెనీ రూ.4,100 కోట్ల బకాయిలు చెల్లించడంలో విఫలం కావడంతో ఆ కంపెనీపై దివాలాప్రక్రియ కొనసాగుతోంది. ఈ కంపెనీ ప్రమోటర్ నితిన్ కస్లివాల్ రూ.3,524 కోట్ల మేర అవకతవకలకు పాల్పడ్డాడని రిసొల్యూషన్ ప్రొఫెషనల్ వెంకటేశన్ శంకర్ నారాయణన్ వెల్లడించారు. అందుకని ఆయనపై క్రిమినల్ కేసు పెట్టడానికి అనుమతివ్వాలని ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనాన్ని ఆయన కోరారు. కేపీఎమ్జీ నిర్వహించిన ప్రత్యేక ఆడిట్లో నితిన్ కస్లివాల్ రూ.3,524 కోట్ల మేర అవకతవకలకు పాల్పడ్డాడని తేలిందని ఆర్పీ, వెంకటేశన్ నారాయణన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎన్సీఎల్టీకి ఈ నెల 1న ఒక లేఖ రాశారు. నేడు విచారణ : కంపెనీని టేకోవర్ చేయడానికి తమకు అవకాశమివ్వాలన్న ఉద్యోగుల సంఘం అభ్యర్థనపై నేడు (మంగళవారం) విచారణ జరగనున్నది. కస్లీవాల్ రూ.3,524 కోట్ల అవకతవకల అంశంపై కూడా విచారణ జరగవచ్చు. -
అడ్డుగా ఉన్నాడనే అంతం
వీడిన టైలర్ హత్య కేసు మిస్టరీ ప్రియుడితో కలిసి చంపించిన భార్య నిందితులకు రిమాండు శంషాబాద్: పట్టణంలో కలకలం సృష్టించిన టైలర్ హత్య కేసు మిస్టరీ వీడింది.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్యే ప్రియుడితో కలిసి భర్తను చంపించింది. పోలీసులు శుక్రవారం నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. శంషాబాద్ ఏసీపీ సుదర్శన్ విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. శంషాబాద్ మాజీ ఎంపీపీ తోట లచ్చయ్య కుమారుడు శ్రీశైలం స్థానికంగా టైలర్గా పనిచేస్తూ మధురానగర్కాలనీలోని సొంతింట్లో ఉంటున్నాడు. మహేశ్వరం మండలం సరస్వతీగూడకు చెందిన సరితను ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లికి ముందే సరితకు స్వగ్రామానికి చెందిన సందీప్తో వివాహేతర సంబంధం ఉంది. వివాహానంతరం కూడా సరిత భర్తకు మత్తుమందు ఇచ్చి ఇంట్లోనే తన సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. తమ ‘బంధా’నికి అడ్డుగా ఉన్న శ్రీశైలాన్ని అంతం చేయాలని సరిత, సందీప్ పథకం వేశారు. ఈక్రమంలో సందీప్ తన స్నేహితులైన సరస్వతీగూడ, లేమూరు గ్రామాలకు చెందిన జంగయ్య, బాల్రాజ్, యాదగిరిలతో విషయం చెప్పాడు. శ్రీశైలం హత్యకు సహకరిస్తే రూ. 50 వేలతో పాటు ఓ ప్లాటు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈక్రమంలో గత మే 26న అర్ధరాత్రి సందీప్తో పాటు అతడి మగ్గురు స్నేహితులు ఇండికా కారులో శంషాబాద్లోని శ్రీశైలం ఇంటికి వచ్చారు. యాదగిరి గేటు వద్ద కాపలా ఉండగా మిగతా వారు ఇంట్లోకి వెళ్లారు. తమతో తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో నిద్రిస్తున్న శ్రీశైలం తలపై మోదారు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన అతడిని కారులో వేసుకొని శంషాబాద్ మండలంలోని బూర్జుగడ్డ వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. శ్రీశైలం మృతి చెందే వరకు అక్కడ రాడ్డుతో అతడి తలపై విచక్షణారహితంగా బాదారు. మృతిచెందాడని నిర్ధారించుకున్న వారు తిరిగి మధురానగర్లోని శ్రీశైలం ఇంటికి వెళ్లారు. సందీప్ సరిత వద్ద నుంచి రూ. 2500 తీసుకొని ఇంట్లో రక్తపు మరకలను తుడిచిన దుస్తులను కారులో వేసుకుని రాళ్లగూడ రహదారివైపు వెళ్లారు. శ్రీైశె లం ఇంటి వద్ద ఉన్న అతడి బైక్ను బాల్రాజ్ తీసుకుని రాళ్లగూడ ఔటర్ సర్వీసు రోడ్డువైపు కారు వెంబడి వెళ్లాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నిస్తుండగా పెట్రోలింగ్ శబ్దాన్ని విని మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు వెళ్లిపోయారు. మార్గమధ్యంలో ఉప్పల్ సమీపంలో ఇనుపరాడ్డుతో పాటు రక్తపు మరకలున్న దుస్తులను పడేశారు. మృతదేహం పక్కనే బైకు పడేద్దామనుకున్న బాల్రాజ్ భయపడి స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందున్న ఖాళీ స్థలంలో పెట్టి సరస్వతీగూడకు వెళ్లిపోయాడు. తీవ్ర భయాందోళ నకు గురైన బాల్రాజ్ స్థానిక పెద్దమనుషులకు విషయం చెప్పాడు. మరుసటి రోజు స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మొదట రాజకీయ లేదా ఆర్థిక కారణాలే హత్యకు దారి తీసి ఉండొచ్చని అనుమానించారు. అనంతరం శ్రీశైలం భార్య సరిత తీరు అనుమానాస్పదంగా ఉండడంతో ఆ దిశగా విచారణ జరిపారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసిందని నిర్ధారించుకున్నారు. తొలుత బాల్రాజ్తో పాటు సరితను అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం సందీప్, జంగయ్య, యాదగిరిలను అరెస్ట్ చేశారు. సరితతో పాటు మిగతా నలుగురిని శుక్రవారం రిమాండుకు తరలించారు. కేసు ఛేదించిన సిబ్బందిని ఏసీపీ ఈ సందర్భంగా ప్రశంసించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement