-
ఉపాధ్యాయుడు డుమ్మా..!
మెట్పల్లిరూరల్(కోరుట్ల) : మండలంలోని జగ్గాసాగర్ ప్రాథమిక పాఠశాలకు బడిపంతులు శనివారం డుమ్మాకొట్టాడు. ఎలాంటి సమాచారం లేకుండా గైర్హాజరు కావడంతో తరగతి గదులకు తాళాలు తీసే వారులేక విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఉండిపోయారు. విషయం తెలుసుకున్న పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ డబ్బ రవి తన స్నేహితులతో కలిసి పాఠశాలను తెరిచారు. పాఠశాలలో హెచ్ఎం రవీంధ్రనాథ్, ముగ్గురు ఉపాధ్యాయులు శ్రీనాథ్, రాజేశం, రామకృష్ణ పనిచేస్తున్నారు. ముగ్గురు ఉపాధ్యాయులకు 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. 138 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను ప్రధానోపాధ్యాయుడు ఒక్క డే నిర్వహిస్తున్నాడు. ఆయన పాఠశాలకు రావాల్సి ఉండగా మధ్యాహ్నం 2 గంటల వరకు రాలేదు. దీం తో ఎస్ఎంసీ చైర్మన్ రవి, అతని స్నేహితులు సామ రమేశ్, డబ్బ రమేశ్, ముదాం శ్రీనివాస్, పాలెపు రాజే ందర్, కట్లకుంట రాజేశ్ సాయంత్రం వరకు విద్యార్థులకు పాఠాలు భోదించారు. అనంతరం ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎంఈవో కనకతా రను వివరణ కోరగా ఆమె అందుబాటులో లేరు. -
సమాచారం ఇవ్వకుండా విధులకు ఎగనామం
తిప్పర్తి : ఎవరికేంది సమాచారం ఇచ్చేదీ.. ఎవరొచ్చి చూస్తారిక్కడ.. అని అనుకున్నారేమో పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా పాఠశాలకు ఎగనామం పెట్టేశారు ఆ ఉపాధ్యాయులు. పేరుకేమో ఐదుగురు ఉపాధ్యాయులు.. మంగళవారం వచ్చింది మాత్రం ఒక్కరే.. ఇది మండల మండలంలోని గోదోరిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల తీరు. ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులు ఆటలాడారు. ఇది గమనించిన గ్రామస్తులు ఆరా తీసి ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయుడితో సహా ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్పై మరో పాఠశాలకు పంపించారు. పాఠశాలలో మొత్తం 70 మంది విద్యార్థులు ఉన్నారు. నిబంధనలు ఇలా.. మొత్తం పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులుంటే ఇద్దరికి మాత్రమే సెలవు ఇచ్చేందుకు నిబంధనలు ఉన్నాయి. అలాగే ప్రధానోపాధ్యాయులు సెలవు కావాలంటే ఎంఈఓకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. అయితే గోదోరిగూడెం పాఠశాలలో మంగళవారం ఇద్దరు ఉపాధ్యాయులు సెలవు పెట్టగా, మరో ఉపాధ్యాయుడు అత్యవసర పనిపై లీవ్ కావాలని హెచ్ఎంకు తెలిపారు. ఇదిలా ఉంటే హెచ్ఎం కూడా మండల విద్యాధికారికి సమాచారం ఇవ్వకుండా పాఠశాలకు ఎగనామం పెట్టారు. ఇలా ఎవ్వరికీ వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెమో జారీ – అరుణ శ్రీ, మండల విద్యాధికారి సమాచారం ఇవ్వకుండా విధులకు ఎగనామం పెట్టిన హెచ్ఎంకు మెమో జారీ చేశాం. అలాగే ఒకేసారి ముగ్గురు ఉపాధ్యాయులకు సెలవు ఇవ్వడంపై కూడా వివరణ ఇవ్వాలని హెచ్ఎంకు సూచించాం. నిబంధనల ప్రకారం ఒకేసారి ముగ్గురు ఉపాధ్యాయులకు సెలవు ఇవ్వకూడదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement