-
గురువేనమః
‘‘గురు బ్రహ్మ..గురు విష్ణు.. గురు దేవో మహేశ్వర గురుసాక్ష్యాత్ పరబ్రహ్మ తస్మయిశ్రీ గురువేనమః’’ తపస్వి మాష్టారు పాఠాలు చాలా ఇష్టం ‘వ్యక్తికి క్రమ శిక్షణ నేర్పేది గురువు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రభావం గురువుదే ఉంటుంది. విద్యార్థి దశలో నేర్చుకున్న క్రమశిక్షణ భవిష్యత్కు బాటలు వేస్తుంది. ఇది గురువు వల్లనే సాధ్యం. కరీంనగర్ జిల్లాలోని మా సొంత గ్రామమైన మంథనిలో 5వ తరగతి వరకూ చదువుకున్న పాఠశాల, అప్పట్లో పాఠాలు చెప్పిన తపస్వి మాస్టారు అంటే ఎంతో ఇష్టం. ఆ రోజుల్లో అన్ని సబ్జెకులు కూడా తపస్వి మాస్టారే చెప్పేవారు. ఒక మనిషికి కుటుంబం తర్వాత క్రమ శిక్షణ నేర్పేది పాఠశాల, అక్కడి గురువులే. విద్యార్థి అభ్యున్నతికి పాఠాలు నేర్పిన గురువును గౌరవించుకోవటం మన బాధ్యత.’ - ప్రకాష్రెడ్డి, భద్రాచలం ఏఎస్పీ నా తండ్రే నా ప్రథమ గురువు నా ప్రాథమిక విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలోనే జరిగింది. నా మొదటి గురువు మా నాన్నే. నల్లగొండ జిల్లాలోని చిన్నకొండూరు, తుమ్మలగూడెం, చెరువుమాదారం గ్రామాల్లోని పాఠశాలల్లో నేను ఏడో తరగతి వరకు చదువుకున్నాను. అక్కడే మా నాన్న పద్మయ్య కూడా ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆయన నాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ప్రభుత్వ పాఠశాల కనుక అన్ని క్లాసుల్లో అన్ని సబ్జెక్టులకు టీచర్లుండేవారు కాదు. అప్పుడు నేను చదువుతున్న క్లాసులో ఏ సబ్జెక్టుకు టీచర్లు లేరో ఆ సబ్జెక్టు చెప్పేందుకు ఆయన డ్యూటీ వేయించుకునేవారు. తన బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత అదనంగా ఆ సబ్జెక్టు చెప్పేవారు. సర్వేల్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నేను చేరేందుకు కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సర్వేల్ గురుకులంలో లెక్కల సార్ వీజీ.కృష్ణమూర్తి ఉండేవారు. ఆయనంటే నాకెంతో గౌరవం. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే నేను ఇంతటి స్థాయికి వచ్చాను. ఆయన కొడుకు రవీంద్ర కూడా నా క్లాస్మేట్. పరీక్షలయిన తర్వాత ఆయన ముందు దిద్దేది నా పేపరే. ఆయన కొడుకు కన్నా నాకు ఎక్కువ మార్కులు వస్తే హ్యాపీగా ఫీలయ్యేవారు. గ్రూప్స్లో కూడా నాకు లెక్కల సబ్జెక్టే ఉపకరించింది. రెండు పేపర్లలో కలిపి 300 మార్కులకు గాను 290 మార్కులు వచ్చాయి. అదే మిగిలిన సబ్జెక్టుల్లో 100కు మించి రావడం కష్టం. ఆ రోజు కృష్ణమూర్తి సారు చెప్పిన లెక్కలే ఇప్పుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టాయి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే... గురుకులం హాస్టల్లో కరెంటు లేకపోతే మమ్మల్ని వాళ్లింటికి తీసుకెళ్లి మాకు ఓ రూం ఇచ్చి చదువుకునేందుకు అవకాశం ఇచ్చేవారు కృష్ణమూర్తి సార్. ఎప్పుడైనా సర్వేల్ పాఠశాలకు వెళ్లి ఆయన ఉన్న క్వార్టర్ను చూస్తే ఇందులోనా మనం ఉండి చదువుకుంది... ఇంత చిన్న ఇంట్లో మాకు ఎలా అవకాశం ఇచ్చారో కృష్ణమూర్తి సార్ అనిపిస్తుంది. అందుకే గురుదేవోభవ అంటారు. - కడవేరు. సురేంద్రమోహన్, జాయింట్కలెక్టర్, ఖమ్మం. -
కిషన్ సార్... అక్షరదీపాలను వెలిగిస్తున్న లక్ష్యసాధకుడు
హోరున వర్షం కురుస్తుంటే... కామేపల్లి మండలంలోని ప్రభుత్వపాఠశాలలన్నీ మూసేస్తారు. కాని ఒక ఉపాధ్యాయుడు మాత్రం స్కూల్కు వెళతారు. వెళుతూ వెళుతూ దారిలో కనపడిన పిల్లల్లో కొందరిని బుజ్జగించో, మరికొందరిని మందలించో... స్కూలుకు తీసుకుపోతారు. వానలోనే స్కూలు తెరిచి పాఠాలు మొదలుపెడతారు. ఆయన పాఠాలు చెప్పడం ప్రారంభించగానే వర్షం (విన)పడడం ఆగిపోతుంది. పిల్లలకు ఆయన పాఠం తప్ప మరేదీ వినపడదు. ఆయన కేవలం పాఠాలు చెప్పే మాస్టారు మాత్రమేనా... నడిచే... కాదు కాదు... ‘నడవలేని’ నిజజీవిత పాఠం కూడా. ఖమ్మం నుంచి దాదాపు 25 కి.మీ దూరంలో కామేపల్లి మండలంలో ఉంది ఆ ఊరు. పేరు టేకుల తండా. పూర్తిగా గిరిజన గ్రామం అది. వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది చదువుకున్నవారు లేని ఆ ఊరిలో ప్రస్తుతం రెండు పాఠశాలలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రైమరీ పాఠశాల. ఆ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పే మాస్టారి పేరు సపావట్ కిషన్ (40). ఆ ఊర్లోనే తొలి డిగ్రీ విద్యార్థిగా... బి.ఏ. బి.ఇడి పూర్తి చేసి వీల్చైర్ మీద కూర్చునే... పిల్లలకు పాఠాలు బోధిస్తారు. నడవలేని ఆ మాస్టారు ఎందరో గిరిజన విద్యార్థుల భవితను ముందుకు నడిపిస్తున్నారు. వైద్యుడు కాబోయి... రోగిగా... ‘‘మా అమ్మ పేరు జాంకిలి. నాన్న గోప్యా. నలుగురం అన్నదమ్ములం. మిగిలినవారిని వ్యవసాయానికి పరిమితం చేసినా కాస్త చదువుతున్నానని నన్ను మాత్రం నాన్న స్కూలుకు పంపాడు’’ అంటూ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు కిషన్. తమ ఊరికి దాదాపు 5 కి.మీ దూరంలో ఉన్న పింజరమడుగు తండాకు చిన్నప్పుడు నడుచుకుంటూనే వెళ్లొచ్చేవాడు. దాదాపు 30కి.మీ దూరంలో ఉన్న మూల పోచారం, కిన్నెరసానిలలో హాస్టల్స్లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేశాడు. ఆ తర్వాత కృష్ణసాగర్లోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో ఇంటర్లో... ఆడుతూ ఆడుతూ పడిపోయినప్పుడు తెలిసింది తనకు కండరాల క్షీణత (మస్క్యులర్ డిస్ట్రొఫీ) జబ్బుందని. అది అప్పటికే తన కాళ్లను చాలా బలహీనంగా మార్చిందని, స్వల్పకాలంలోనే తను పూర్తి అవిటివాడిని కానున్నానని కూడా తెలిసింది. ‘‘పెద్ద పెద్ద చదువులు చదవాలనే ఆశ, ఆధునిక వైద్యం అంటే తెలియని మా ఊరి వాళ్లకు డాక్టర్గా సేవలు అందించాలనే ఆశయం సిద్ధించే అవకాశం లేదని తెలిసినప్పుడు ఎంతగా కుమిలిపోయానో’’ అంటూ పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు కిషన్. కాళ్లు కదలకున్నా... నడుస్తూనే ఉన్నా... కదలనని మొరాయిస్తున్న కాళ్లను కదిలించాలని చేసిన వైద్యపరమైన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో కిషన్... డాక్టర్ కావాలనే ఆశల్ని వదిలేసుకున్నాడు. ఇంటి నుంచే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ కట్టాడు. మరోవైపు తనలా చదువుకోవాలనే తపన ఉన్నవారికి కాస్తయినా సాయపడదామనే ఆలోచనతో ఇంటినే స్కూలుగా మార్చాడు. అలా 1994లో కేవలం నలుగురి తో ప్రారంభమైన ‘అక్షర నిలయం’ 140 మంది విద్యార్థులను అక్కున చేర్చుకునే స్థాయికి చేరింది. సోదరులు, తండ్రి, తెలిసినవారి సహకారంతో ఎటువంటి ఫీజులు లేకుండానే దాన్ని నిర్వహిస్తుంటే... 2000 సంవత్సరంలో ఆ గ్రామానికి వచ్చిన కలెక్టర్ ఎలాంటి ప్రభుత్వ సాయం లేకుండానే గ్రామంలో ఉచిత పాఠశాల నడుస్తున్న వైనం చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం కిషన్ను అభినందన పూర్వకంగా కలిసి, ఏవైనా సాయం కావాలా అని అడిగినప్పుడు... ‘‘వ్యక్తిగతంగా నాకేమీ వద్దు సార్... అవసరమైతే నాకున్న స్థలంలో 1000 గజాలను ఊరి కోసమే ఇచ్చేస్తాను. ఇక్కడో పాఠశాల మంజూరు చేయండి సార్’’ అంటూ కిషన్ ప్రాధేయపడ్డాడు. ఆ వినతికి కలెక్టర్ స్పందించారు. అలా కిషన్ చలవ వల్ల ఆ ఊరికి కేవలం విద్యాబుద్ధులే కాదు శాశ్వత ప్రభుత్వ పాఠశాల కూడా వచ్చింది. ఆ తర్వాత అదే స్కూల్కి కిషన్కి టీచర్ పోస్ట్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఈ ఉపాధ్యాయుడు ఇక వెనుకడుగు వేయలేదు. ఊరివాళ్లని చదువూసంధ్యా లేకుండా ఊరికే ఉండనివ్వలేదు. వీల్చైర్ అయితేనేం... విల్ ఉంటే... అడుగు తీసి అడుగు వేయలేకపోయినా... ఆశించిన గమ్యం వైపు నడుస్తూనే ఉన్నారు కిషన్. పేరుకే ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కాని... ఆ ఊరిలో విద్యాదీప్తికి, ఊరిబాగుకు అవసరమైనవన్నీ చేస్తారు. దాదాపు ఏడేళ్లపాటు అనియత విద్యాకేంద్రం, నిరంతర విద్యాకేంద్ర వాలంటీర్గా సూపర్వైజర్గా పనిచేశారు. టేకులతండా, సూర్యాతండా, తాళ్ళగూడెం, గోపాలపురం గ్రామాలకు వెళ్లి సుమారు 800 మంది వయోజనులను అక్షర దీపం, అక్షర సంక్రాంతి కార్యక్రమాల ద్వారా నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధన కోసం కృషి చేశారు. గ్రామ యువకులతో కలిసి సారా నిర్మూలన కార్యక్రమం, పరిశుభ్రత, ఆరోగ్యంపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వ్యవసాయ పనుల్లో పాలేర్లుగా ఉన్న 17 మంది బాలకార్మికులను బలవంతంగా జిల్లా కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్లి హాస్టల్లో చేర్పించారు. వీరిలో పలువురు ప్రస్తుతం హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 2008 లో నిర్మల్ పురస్కార్ గ్రామం కింద ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు, స్వంతంగా కొన్ని నిధులు జమ చేసి గ్రామంలో 54 మరుగుదొడ్లు నిర్మించారు. క్రైస్తవ మిషన్ సహకారంతో గ్రామంలో చేతి బోరు ఏర్పాటు చేయించారు. గ్రంథాలయ నిర్మాణం కోసం తన ఒక నెల వేతనాన్ని అందజేశారు. సాక్షర భారత్లో 14 మంది మహిళలకు అక్షరజ్ఞానం కలిగిస్తున్నారు. ఇక నిరుపేద విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేస్తారు. ఇలా చేతనైనంతలో ఊరికోసం చేయగలిగినంతా చేస్తూ... కన్న ఊరుకు కాంతికిరణమయ్యారు. ‘‘నాకొచ్చే జీతంలో నుంచి ఏడాదికి రూ.25వేలు పూర్తిగా ఊరి మేలు కోసం చేసే సేవాకార్యక్రమాలకే వెచ్చిస్తాను. అంతమాత్రాన ఇదంతా నా గొప్పతనం మాత్రమే కాదు... ఎందరిదో సహాయం తోడ్పడుతోంది’’ అనే కిషన్... ‘‘కొత్తలో స్కూలు, చదువులు అంటూ బలవంతపెడుతున్నానని, బాలకార్మికులను పని మాన్పిస్తున్నానని మా ఇంటి మీదకి గొడవలకు కూడా వచ్చేవారు. అయితే అలాంటివారంతా ఇప్పుడు నాతో పాటు నేను చేసే కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నారు’’ అని సంతోషం వ్యక్తం చేస్తారు. మనం ఒక మంచిపనిని మనస్ఫూర్తిగా తలపెడితే... ప్రపంచం తప్పనిసరిగా మనకు తోడవుతుంది. తలవంచుతుంది. మారుమూల ప్రాంతాలకు సనాపట్ కిషన్ లాంటి టీచర్లు... కేవలం చదువు చెప్పే గురువులు మాత్రమే కాదు చేయూతగా మారే స్ఫూర్తిప్రదాతలు కూడా. - ఎస్.సత్యబాబు పురస్కారాలెన్నో... 2000 సంవత్సరంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అక్షర దీపం ఉత్తమ వాలంటీర్గా కిషన్ అవార్డు తీసుకున్నారు. 1995లో వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి ఉత్తమ వికలాంగ సేవా అవార్డు పొందాడు. మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2004), జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును వరుసగా (2010 -13) మూడేళ్ల పాటు.. అందుకున్నారు. ఐటిడిఎ బెస్ట్ టీచర్ అవార్డునూ సొంతం చేసుకున్నారు. చదువు కేవలం విద్య, ఉద్యోగాలకు మాత్రమే కాదు లోకజ్ఞానానికి కూడా. చదువులేక, పోషకాహారం మీద అవగాహన లేక... నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ సరైన ఆహారం తీసుకోలేదు. దాని ఫలితంగానే నా జీవితం ఇలా చక్రాల కుర్చీకి పరిమితమైంది. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు. సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే అన్ని సమస్యలకూ పరిష్కారం అనే నమ్మకంతో నేను ముందడుగు వేస్తున్నాను. మా ఊరిని నడిపిస్తున్నాను. - సనాపట్ కిషన్, ఉపాధ్యాయుడు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement