-
చదువులమ్మలు
సాక్షి, హైదరాబాద్ : బోధన రంగంలో మహిళల వాటా పెరుగుతోంది. ఉన్నత విద్యలో ముందంజలో ఉంటున్న మహిళలు బోధన రంగంలోనూ తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు. నాలుగేళ్ల కిందట బోధన రంగంలో మహిళల సంఖ్య 39 శాతం ఉండగా, తాజాగా అది 42 శాతానికి పెరిగింది. 2014–15లో ఉన్నత విద్యా సంస్థల్లో 61 శాతం మంది అధ్యాపకులు పురుషులు ఉంటే 39 శాతం మంది మహిళలు ఉన్నారు. 2017–18లో బోధన రంగంలో 58 శాతం పురుషులు ఉండగా, 42 శాతం మహిళలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం లెక్కలు తేల్చింది. తొలిసారిగా సమగ్ర వివరాలు సేకరణ దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమగ్ర వివరాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) సేకరించింది. గతంలో విద్యా సంస్థల వారీగా ఎంత మంది అధ్యాపకులు ఉన్నారు, అందులో మహిళలు ఎంత మంది, పురుషులు ఎంత మంది, తదితర వివరాలను మాత్రమే సేకరించిన కేంద్రం.. ఈసారి సమగ్ర వివరాలను తీసుకుంది. విద్యా సంస్థల వారీగా ఆయా విద్యా సంస్థల్లో చేరిన తేదీ, వారు ఆ వృత్తిలో అడుగుపెట్టిన ఏడాది, వారికున్న విద్యార్హతలు, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ, ఆధార్ నంబర్లతో సహా పక్కా వివరాలను తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుతం దేశంలో 12,84,755 మంది అధ్యాపకులు ఉన్నట్లు తేల్చింది. అందులో 12,68,597 మందిఅధ్యాపకుల సమగ్ర వివరాలను సేకరించినట్లు వెల్లడించింది. వారిలో పురుషులు 7,45,158 మంది ఉండగా, మహిళలు 5,39,597 మంది ఉన్నట్లు తెలిపింది. 1.88 లక్షల మంది తగ్గుదల సంఖ్యా పరంగా చూస్తే దేశవ్యాప్తంగా అధ్యాపకుల సంఖ్య నాలుగేళ్లలో భారీగా తగ్గిపోయింది. 2014–15లో దేశవ్యాప్తంగా 14,73,255 మంది ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 12,84,755కు పడిపోయింది. ఆ మేరకు 1,88,500 మంది తగ్గిపోయారు. అప్పట్లో అధ్యాపకుల్లో పురుషులు 8,98,686 మంది ఉండగా, మహిళలు 5,74,569 మంది ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు తేల్చింది. ఓవైపు విద్యా సంస్థలు పెరుగుతుంటే అధ్యాపకుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గుముఖం పడుతుండటంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పేపర్లపై అధ్యాపకుల సంఖ్యను ఎక్కువ చేసి చూపించిన యాజమాన్యాలు ఇపుడు పక్కా సమాచారం ఇవ్వాలని అడుగుతుండటంతో అలాంటి తప్పిదాలకు పాల్పడం లేదని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకు తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలే ఓ ప్రత్యక్ష ఉదాహరణ అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఇష్టానుసారం లెక్కలు ఇవ్వకుండా పక్కా సమాచారాన్నే ఇస్తున్నాయని, అందువల్లే సంఖ్య తగ్గుదల కనిపిస్తోందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ అధ్యాపకుల్లో మూడో స్థానంలో తెలంగాణ దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు ఎక్కువ మంది ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ (13.48 శాతం ఎస్సీలు, 1.6 శాతం ఎస్టీలు) ఉండగా, మహారాష్ట్ర (11.04 శాతం ఎస్సీలు, 0.41 శాతం ఎస్టీలు) రెండో స్థానంలో నిలిచింది. 10.77 శాతం ఎస్సీ అధ్యాపకులు, 3.4 శాతం ఎస్టీ అధ్యాపకులతో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. జనరల్ కేటగిరీ వారే ఎక్కువ బోధన రంగంలో రిజర్వేషన్ కాకుండా జనరల్ కేటగిరీ అధ్యాపకులే అత్యధికంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం లెక్కలు తేల్చింది. చదువుకునే విద్యార్థుల్లో ఎక్కువ మంది బీసీ, ఎస్సీలు, ఎస్టీలే ఉండగా, బోధించే అధ్యాపకులు మాత్రం ఇతర కేటగిరీల వారే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అందులో 56 శాతం జనరల్ కేటగిరీ అధ్యాపకులు ఉండగా, 32.3 శాతం బీసీలు, 8.6 శాతం ఎస్సీలు, 2.27 శాతం ఎస్టీలు ఉన్నట్లు తేల్చింది. ‘ప్రైవేటు’లో తెలంగాణ, ఏపీ టాప్ దేశవ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. దేశంలో సగటున 78 శాతం కాలేజీలు ప్రైవేటు రంగంలో ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 82 శాతం కాలేజీలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. ఆ తర్వాత 76.2 శాతంతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. అయితే అసోంలో మాత్రం కేవలం 12 శాతం, చండీగఢ్లో 8 శాతమే ప్రైవేటు విద్యా సంస్థలు ఉండటం గమనార్హం. పురుషుల కంటే మహిళా అధ్యాపకులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు కేరళ, పంజాబ్, హరియాణా, చండీగఢ్, మేఘాలయ, నాగాలాండ్, ఢిల్లీ, గోవా -
పీయూకు ఖాళీల సెగ!
♦ పాలమూరు యూనివర్సిటీలోని బోధన విభాగంలో ఖాళీలు ♦ మన యూనివర్సిటీలు పీయూకు పోస్టుల మంజూరు.. ♦ 17 ప్రొఫెసర్లు 34అసోసియేట్ ప్రొఫెసర్లు ♦ 68అసిస్టెంట్ ప్రొఫెసర్లు 16ప్రొఫెసర్లు ♦ 30అసోసియేట్ ప్రొఫెసర్లు 50అసిస్టెంట్ ప్రొఫెసర్లు ♦ 96మొత్తం ఖాళీలు.. మహబూబ్నగర్ నుంచి గంగాపురం ప్రతాప్రెడ్డి : వెనుకబడిన పాలమూరు జిల్లాలో విద్యార్థులకు నాణ్య మైన విద్యను అందించేందుకు ఉన్న ఏకైక విశ్వవిద్యాలయంపై నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. ఏళ్లుగా విద్యాలయాన్ని అధ్యాపకుల కొరత వేధిస్తున్నా.. పట్టించుకునేవారు లేరు. యూనివర్సిటీ ప్రారంభించి తొమ్మిదేళ్లయినా రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో సీబీసీఎస్ (చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్) అమలు చేయడం సవాలుగా మారింది. ‘న్యాక్’ దూరం నిబంధనల ప్రకారం అధ్యాపకుల భర్తీ లేకపోవడంతో న్యాక్ గుర్తింపు రాలేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు అందక యూనివర్సిటీ అభివృద్ధి కుంటుపడింది. అంతంతే సిబ్బంది.. ప్రస్తుతం 125 మంది కాంట్రాక్టు అధ్యాపకులు అకాడమిక్ కన్సల్టెంట్లుగా పనిచేస్తున్నారు. సాధారణంగా అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫె సర్లు నిర్దేశించిన విధంగా తక్కువ తరగతులు బోధిస్తారు. కానీ ఇక్కడ ఎక్కువ తరగతులు బోధిస్తున్నారు. యూనివర్సిటీ ప్రారంభం నాటి నుంచి అధికారులు ప్రభుత్వానికి ఏటా అధ్యాపకుల కొరత విషయమై ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం 125 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 23 మంది రెగ్యులర్ అ«ధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ అధ్యాపకుల్లో ఒక ప్రొఫెసర్, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 18 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఇక గద్వాల పీజీ సెంటర్లో ఇద్దరు, కొల్లాపూర్ పీజీ సెంటర్లో ఒకరు, యూనివర్సిటీ కళాశాలలో 20 మంది మాత్రమే రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు. మిగతా వారంతా కాంట్రాక్టు సిబ్బందే. 23 నియామకాలే.. ఒక యూనివర్సిటీలో పీజీతో పాటు పలు పరిశోధన కోర్సు లు ప్రవేశపెడితే కచ్చితంగా ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసి యేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫె సర్లతో ఒక రీడర్ అవసరం. ఇలా ఒక డిపార్ట్ మెంట్కు దాదాపు ఏడుగురు అధ్యాపకులు అవసరం ఉంటారు. అయితే ఇక్కడి పరిస్థితు లు భిన్నంగా ఉన్నాయి. పీయూ ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు కేవలం 23 మంది రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలే జరి గాయి. యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెంటర్ల యిన గద్వాల, కొల్లాపూర్, నాగర్కర్నూల్లలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఫార్మసీ, ఎంఈడీ విభాగాల్లోనూ.. పీయూకు అనుబంధంగా ఫార్మసీ, ఎంఈడీ కళాశాలలు న్నాయి. యూనివర్సిటీ పరిధి లో 119 రెగ్యులర్ పోస్టులతో పాటు ఫార్మసీ, ఎంఈడీ విభాగాలను కలుపు కుంటే 172 మంది అధ్యాపకులు అవసరం. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ వంటి 17 విభాగాల్లో పీయూ కళాశాలలో 700 మంది విద్యార్థినులు ఉండగా, దాదాపు 1000 మందికిపైగా విద్యార్థులు ఉంటారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement