-
దీక్షల భూమయ్య ఇకలేరు
అనారోగ్యంతో మృతి తెలంగాణ కోసం 300 రోజులు దీక్ష చేసిన వృద్ధుడు జెండా పండగ నాడే కన్నుమూత నంగునూరు: ‘ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం చేస్తున్న దీక్షలు మాకోసం కాదు.. మాపిల్లల బాగు కోసం..’అంటూ నినదించిన వృద్ధుడు స్వాతంత్ర్య దినోత్సవం రోజునే తుది శ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుధీర్ఘ కాలం పాటు రిలే నిరాహారదీక్షలు చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్న నర్మేట గ్రామానికి చెందిన భూమయ్య సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన నార్లపురం భూమయ్య (85) తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు. టీఆర్ఎస్ పార్టీ చేసిన నిరసన కార్యక్రమాలు, సభల్లో పాల్గొంటూ యువకులకు స్ఫూర్తిగా నిలిచాడు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పాలమాకులలో జేఏసీ ఆద్వర్యంలో 1,444 రోజుల పాటు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో 300 రోజులకు పైగా దీక్షల్లో కూర్చొని ఉద్యమ స్ఫూర్తిని చాటారు. అందులో సంవత్సరం పాటు మహిళలు దీక్షల్లో పాల్గొనగా పండగ రోజు వారికి బదులుగా నర్మేట గ్రామానికి చెందిన మిత్రులు రామలింగం, రాజయ్య, ఎల్లయ్య, రాఘవరెడ్డి, శింగరయ్య, వెంకటయ్య, మల్లయ్యలతో పాటు తాను దీక్షల్లో కూర్చోని అందరికి ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ వచ్చేదాక దీక్షలు ఆపేదిలేదంటూ ప్రత్యేక రాష్ట్రం వచ్చేదాక పిడికిలి బిగించి ఉద్యమించారు. భూమయ్య చూపిన ఉద్యమ స్ఫూర్తికి ముగ్ధుడైన అప్పటి ఎమ్మెల్యే హరీశ్రావు అతన్ని ప్రత్యేకంగా అభినందించారు. సంవత్సరం కిందట జారి పడడంతో చేయి విరగిన భూమయ్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాదపడుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మంత్రి హరీశ్రావు ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించి, నంగునూరు ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి ద్వారా రూ 5వేలు అందజేశారు. భూమయ్య అంత్యక్రియలు మంగళవారం నర్మేటలో నిర్వహించగా మండల నాయకులు, మిత్రులు, గ్రామస్తులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. -
తెలంగాణ పోరాట యోధుడు-పల్వెల
‘....గంజ్లో పలానాయన ఉన్నాడు. మీరక్కడ ఉంటారా?’ అని అడిగాడు జైలరు. సంతోషంగా, ఆయన పక్కనైతే గంజ్లో ఏమొచ్చె, నరకంలోనైనా ఉంటాననుకున్నాను మనసులో’ (సహచరులు- మనుషులు-1989 జూలై పే.77) ఆయనే పల్వెల రామిరెడ్డి. ఈ (2, అక్టోబర్) ఉదయమే ఆయన కొడుకు ఫోన్ చేసి ‘బాపు చనిపోయాడు. నేను కూడా దుబాయ్ నుంచి వార్త తెలిసే వచ్చాను. ఫలానారోజు సంస్మరణ. రండి’ అని చెప్పాడు. 92 ఏళ్ల యువకుడు రామిరెడ్డి. ఆయన గురించి ‘సహచరులు’లో ఇట్లా రాసుకున్నాను. ‘తెలంగాణ రైతాంగ పోరాటకాలం నుంచి, అంటే 1946 నుంచి 86 దాకా నలభై ఏళ్లుగా జైలుకు వస్తూపోతూ ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన మిత్రుడు అందులో ఒక సెల్లో ఉన్నాడు. కార్మిక రంగంలో పనిచేస్తూ, నక్సలైట్ ముద్రతోనే అరెస్ట యిన మరొక యువకుడున్నాడు. ఆయనతో నాకు ఈ జైల్లోనే పరిచయం. ఆ నల్లగొండ మిత్రునితో మాత్రం ఎమర్జెన్సీలో వరంగల్ జైల్లో పరిచయ మైంది. ఈ ఇద్దరితో మొదటి రెండు నెలలు ఒకటి కాలప్రవాహం వలె, రెండవది యవ్వన ప్రవాహం వలె గడిచిపోయాయి. ఆ నల్లగొండ మిత్రుడు విస్తృతంగా దేశం తిరిగాడు. విస్తృతంగా చదివాడు. ఆచరణ నుంచి జ్ఞానం వస్తుందనడానికి ఆయన సజీవ సాక్ష్యం. ఎన్ని అనుభవాలు చెప్పేవాడో. లాకప్ అయ్యేదాకా ఆ అవరణలో ముగ్గురమూ కలసి అటూ ఇటూ పచార్లు చేస్తూ ఆయన మాటలు వింటుండేవాళ్లం. తిరుగుతూనే పుస్తకాలు చదవడం ఆయనకలవాటు...’ వాళ్లిద్దరూ టాడా కింద అరెస్టయి వచ్చారు. రామిరెడ్డిగారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధుడు. నక్సల్బరీ, శ్రీకాకు ళం రైతాంగ పోరాట విస్ఫోటనతో తెలంగాణలో తిరిగి ప్రారంభ మైన విప్లవోద్యమంలో ఆయన మొదట దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలో పనిచేశాడు. ఎమర్జెన్సీ ప్రకటించిన రోజే బండ్రు నరసింహులు (ఆలేరు)గారిని అరెస్టు చేసి నేనున్న గదిలోనే పెట్టారు. అప్పుడు రామిరెడ్డిగారితో గాఢా నుబంధం ఏర్పడలేదు. ఎన్కె వంటి విప్లవ కవి, చెరుకూరి రాజకుమార్ వంటి రాడికల్ విద్యార్థి నా గదిలోనే ఉండడంవల్ల మా లోకం మాదిగా ఉండేది. రామిరెడ్డిగారు మిగిలినవారి వలె ఏ ప్రజాసం ఘంలోనూ పనిచేసినట్లు లేరు. ఇంగ్లిష్, ఉర్దూ భాష లలో ప్రావీణ్యం వల్ల సీపీ నాయకత్వంలోని పార్టీ ఆయనను బయటి రాష్ట్రాలలో టెక్నికల్ సహాయా లకు వినియోగించుకున్నట్లుంది. ఇంగ్లిష్ నవలలు గురించి, ముఖ్యంగా చార్లెస్ డికెన్స్ ‘రెండు మహా నగరాలు’, నెపోలియన్ జీవితచరిత్రల గురించి మాట్లాడేటప్పుడు యుద్ధనీతి, ఆయుధాల గురించి చెప్పే విషయాలు అందులో ఆయనకు లోతైన జ్ఞానం ఉన్నదని అనిపించేది. బక్క పలచటి మనిషి. ఆరడుగుల పొడవు, ధోతీ, తెల్లటి అంగీ. ఎప్పుడూ పెదవులపై చిరునవ్వు. సంభాషణాప్రియుడు. మా ఇద్దరి అభిరుచి సాహిత్యం, విప్లవ రాజకీయాలు. మా స్నేహం నేను నల్లగొండ చౌరస్తాలో 2014 జూలై దాకా ఉన్నంతవరకు కొనసాగింది. ఆయన దిల్సు ఖ్నగర్లో ఉండేవారు. చివరిరోజుల్లో చేతికి కర్ర, చెవుడు వచ్చినట్టున్నాయి. కానీ అదే ఉత్సాహం. జర్నలిస్టుగా ఉన్న ఆయన మేనల్లుడు అనుకుం టాను, ఆయన జీవితచరిత్ర, మిత్రుల జ్ఞాపకాలు రాయించే ప్రయత్నం రెండేళ్ల క్రితం చేసినట్టున్నాడు. నా దగ్గరకి కూడా వచ్చారు. చెప్తానన్నాను. కానీ జీవన వ్యాపకాలలో పడిపోయాం. అంతేనా- ముగి సిపోని, కొనసాగుతున్న తెలంగాణ పోరాట చరిత్ర కనుక, ఇంకా నిర్మాణంలోనే ఉన్న అసంపూర్ణ ప్రజా స్వామ్య పోరాట చరిత్ర కనుక అప్పుడు చరిత్ర రచ నకు సమయం చిక్కడం లేదా? లేదా ఇంకా ఎందరో పోరాటయోధులు రక్తంతో చరిత్ర రచన కొనసాగు తున్నదా? బండ్రు నర్సింహులు నూరేళ్ల పండుగ నూటొక్క పాటల సంబురంలో పి.చంద్ రాసిన ‘సాయుధ పోరాటయోధుని కథ’ ఆవిష్కరించుకు న్నాం. రామిరెడ్డిగారంటే, బండ్రు నర్సింహులు వలెనే ఇంచుమించు నూరేళ్ల తెలంగాణ చరిత్ర. ఏడు దశాబ్దాలకు పైగా పోరాట చరిత్ర. జీవితమంతా ప్రజా పోరాటాలతో పరుచుకున్న చరిత్ర. - వరవరరావు, విరసం వ్యవస్థాపక సభ్యులు మొబైల్: 96765 41715 -
'తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తున్న ఢిల్లీ'
న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని ఏ ప్రాతిపదికన విభజన చేస్తున్నారని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ప్రశ్నించారు. భాషాప్రయుక్త రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. చచ్చిపోయిన తెలంగాణ ఉద్యమానికి చిదంబరం ప్రకటనతో మళ్లీ జీవం వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఢిల్లీ నుంచే ప్రాణం పోస్తున్నారని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో బాగా వెనుకబడ్డాం కాబట్టి తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తెలంగాణవాదులు తర్వాత మాట మార్చారని చెప్పారు. 1956 తర్వాత తెలంగాణలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని శ్రీకృష్ణ కమిటీ తేల్చడంతో.. స్వయం పాలన, మనోభావాలంటూ విభజన కోరుతున్నట్టు ప్రకటించారని వివరించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే విప్లవాత్మక మార్పులు వస్తాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కావూరి విమర్శించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
పుష్ప-2 మరో అప్డేట్ వచ్చేసింది.. అదేంటంటే?
రామేశ్వరం కేఫ్ పేలుడు.. పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు
ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)
అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్
HYD: ఏసీపీ నివాసంలో సోదాలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్కు ఫ్యూజ్లు ఔట్
భారీగా పెరిగిన ఫ్లిప్కార్ట్ గ్రోసరీ బిజినెస్
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement