-
హద్దులు తేలకున్నా..
నిజామాబాద్ : తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల మ«ధ్య ప్రవహిస్తున్న మంజీర నదిలో సరిహద్దు వివాదం చాలా కాలంగా అపరిష్కృతంగా ఉంది. గతంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఈ సరిహద్దులను తేల్చేందుకు సంయుక్త సర్వేలు జరిపినా వివాదం కొలిక్కి రాలేదు. తాజాగా మంజీర నదిలో మహారాష్ట్ర సర్కారు ఇసుక క్వారీలకు టెండర్లు పిలిచింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని బోధన్, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల సరిహద్దుల్లోని మండలాలకు ఆనుకుని ఈ నది ప్రవహిస్తోంది. మన జిల్లాలకు అవతలివైపు ఉన్న 12 ఇసుక క్వారీలకు ఈ సారి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం టెండరు నోటిఫికేషన్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇలాగే మహారాష్ట్ర క్వారీల పేరిట నదిలో జిల్లా భూభాగంలోకి చొరబడి ఇసుక తవ్వకాలు జరిగాయి. దీంతో జిల్లా భూభాగంలోని ఇసుక తరలిపోగా.. ఈ ఇసుకపై రూ.కోట్లలో ఆదాయం మహారాష్ట్ర సర్కారుకు వెళ్లింది. సరిహద్దు వివాదం పరిష్కారమైతేనే మహారాష్ట్ర కాంట్రాక్టర్ల ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడుతోందని సరిహద్దు రైతాంగం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదం మూడేళ్ల క్రితం రెండు రాష్ట్రాల మధ్య కొంత ఉద్రిక్తతకు దారితీసింది. తాజాగా నాందేడ్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఈ క్వారీలకు గత నెల 5న నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 20 నుంచి ఈ–ఆక్షన్ నిర్వహిస్తోంది. మంజీరలో 12 క్వారీలకు ‘మహా’ ప్లాన్ నాందేడ్ జిల్లా దెగ్లూర్, బిలోలి, ధర్మాబాద్ తాలూకాల పరిధిలో మంజీర నదిలో 12 ఇసుక క్వారీల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. శెల్గాం, శావ్లా, శాఖాపూర్, గంజ్గాం, హున్గుందా, కార్లా (బీకే), బొలేగాం, మచ్నూర్, సగ్రోలి, హెస్గీ, నాగిని, సంగం క్వారీలకు అనుమతులు మంజూరు చేసింది. అలాగే జుక్కల్ నియోజకవర్గం పరిధిలో ప్రవహించే లెండి నదిలో సంగ్వి ఉమార్, సంగడి, తంతార్, మెదన్కలూర్, హవార్గా క్వారీలకు కూడా అక్కడి కలెక్టరేట్ అనుమతులు మంజూరు చేసింది. ప్రతిసారి నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఇసుక క్వారీలకు వేలం పాటలు నిర్వహించి అనుమతి ఇస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా కొనసాగించింది. ఈ రెండు నదులతో పాటు పెన్గంగా, గోదావరి, రవాంగన్నాలాలపై కూడా ఇసుక క్వారీలకు మహారాష్ట్ర సర్కారు తెరలేపింది. కాగా, మహారాష్ట్ర అనుమతుల పేరిట ఇసుకాసురులు మంజీర నదిలోని మన ప్రాంత ఇసుకను య«థేచ్ఛగా తరలించారు. ఈ క్రమంలో నకిలీ వేబిల్లులు కూడా సృష్టించి తెలంగాణ సర్కారుకు కుచ్చుటోపీ పెట్టారు. మహారాష్ట్ర క్వారీల ఇసుక రవాణా సాలూర అంతర్రాష్ట్ర చెక్పోస్టు మీదుగా రాష్ట్రంలోకి తరలించి సొమ్ము చేసుకున్నారు. నకిలీ వే బిల్లులతో ఇసుక రవాణాకు పాల్పడిన పలువురు కాంట్రాక్టర్లపై జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. కొందరిని అరెస్టు చేశారు. అప్పట్లో రైతుల ఆందోళనలు నదిలో మహారాష్ట్ర క్వారీలకు ఇవతల వైపు కోటగిరి, బోధన్ మండలాల గ్రామాలు సుంకిని, మందర్న, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గెల్లి, కల్దుర్కి, సిద్దాపూర్, ఖండ్గాం, బిక్నెల్లి గ్రామాలున్నాయి. మహారాష్ట్ర అనుమతుల పేరిట నదిలో ఇష్టానుసారంగా తవ్వకాలు జరపడంతో నది జలాల ఆధారంగా ఉన్న పలు ఎత్తిపోతల పథకాలు గతంలో వట్టిపోయాయి. ఆయా మండలాల వాసుల తాగునీటి అవసరాలు తీర్చే ఈ పథకాలు పని చేయలేదు. దీనికి తోడు ఈ సరిహద్దు గ్రామాల్లో వందల సంఖ్యలో బోరుబావులు అడుగంటిపోయాయని అప్పట్లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఇసుక క్వారీలకు అనుమతిస్తే ఇంకేన్ని దుష్ఫలితాలు అనుభవించాల్సి ఉంటుందోనని రైతుల్లో కలవరం మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఉధృతంగా పెన్గంగ
సిర్పూర్(టి) : నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్గంగా నది ఉప్పొంగుతోంది. సిర్పూర్(టి) మండలంతోపాటు సమీపంలోని మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతోపాటు మహారాష్ట్రలోని వార్దా నదిపై ఉన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పెన్గంగ ఉప్పొంగి ప్రవహిస్తోంది. మంగళవారం పెన్గంగ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మండల ప్రజలతోపాటు సమీపంలోని మహారాష్ట్ర గ్రామాల ప్రజ లు భయాందోళనలకు గురయ్యారు. పెన్గంగ వంతెన పైకప్పుకు ఆనుకుని వరదనీరు ప్రవహిస్తుండటంతో ఏ క్షణమైనా రాకపోకలు స్తంభిస్తాయని సమీప గ్రామాల ప్రజలు తమ తమ గ్రామాలకు చేరుకుంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement