-
చాంబర్ కోసం మంత్రుల మధ్య పేచీ..!
ఒకే చాంబర్ కోసం పట్టుబడుతున్న ఇద్దరు కార్యాలయం చూస్తామని తాళంచెవి తీసుకున్న మంత్రి బంధువులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ‘డీ’ బ్లాక్లోని ఒక చాంబర్ కోసం ఇద్దరు మంత్రులు పోటీపడుతున్నారు. ఈ వ్యవహారం అధికారులకు తలనొప్పి కలిగిస్తోంది. చాంబర్ల కేటాయింపు అధికారం ముఖ్యమంత్రిదే అయినా, ఒక మంత్రి అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చాంబర్ చూడడం కోసం తాళాలు తీసుకున్న మంత్రి సంబంధీకులు ఆ తాళాలు ఇవ్వడానికి ససేమిరా అన్నారు. దీంతో కార్యాలయం అధికారికంగా కేటాయించకుండా అందులో కూర్చోవడానికి వీల్లేదని, అలా చేయడం సరికాదని ఆ అధికారి స్పష్టం చేయడంతో సదరుమంత్రి సంబంధీకులు ఆ తాళం చెవులు తిరిగి ఇచ్చినా..అర్ధరాత్రి సమయంలో ఫోన్చేసి నానా గొడవ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ మంత్రులకు సచివాలయంలోని‘డీ’ బ్లాక్లో చాంబర్లను కేటాయిస్తున్నారు. ఈనెల 16 న జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆరుగురు మంత్రులుగా పదవీస్వీకార ప్రమాణం చేసిన సంగతి విదితమే. అయితే ఇందులో ఇద్దరు మంత్రులు ‘డీ’ బ్లాక్లోని రెండో అంతస్తులోని రూమ్ నంబర్ 260ని తమకు కేటాయించాలంటూ పట్టుబడుతున్నారు. గిరిజన సంక్షేమం, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే చాంబర్ను కోరుతున్నట్టు తెలిసింది. కాగా, ఈ చాంబర్ను పరిశీలిస్తామంటూ గిరిజన సంక్షేమశాఖ మంత్రి బంధువులు తాళం చెవులు తీసుకుని వెళ్లారు. ఆ చాంబర్ను తమకే కేటాయించాలంటూ పట్టుబట్టడంతో సదరు అధికారి.. చాంబర్ల కేటాయింపు తమ పరిధిలో లేదని, ముఖ్యమంత్రే ఆమోద ముద్రవేయాల్సి ఉంటుందని, ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు కావాల్సిన చాంబర్ తీసుకోవచ్చని సూచించినప్పటికీ వినకుండా సదరు మంత్రి కుమారుడు శుక్రవారం రాత్రి ఫోన్లోనే తిట్లదండకం అందుకున్నట్టు తెలిసింది. ‘నీవు తుమ్మలకు తొత్తుగా వ్యవహరిస్తున్నావు.. ఏమనుకున్నావో సస్పెండ్ చేయిస్తా...మీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం’ అంటూ హెచ్చరించినట్టు తెలిసింది. కుమారునితోపాటు మంత్రి కూడా ఆ అధికారిపై మండిపడ్డట్టు తెలిసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినట్టు తెలిసింది. చాంబర్ కోరింది వాస్తవం: చందూలాల్ సచివాలయం ‘డీ’ బ్లాక్లోని చాంబర్ నంబర్ 260ను కోరిన మాట వాస్తవమేనని గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ చెప్పారు. అనువుగా ఉంటుందని ఆ చాంబర్ కోరానని, తనతోపాటు మరో ముగ్గురు మంత్రులు కూడా అదే చాంబర్ కోరినట్టు ఆయన తెలిపారు. అయితే దీనిపై ఎలాంటి వివాదం చేయలేదని ఆయన పేర్కొన్నారు. -
సచివాలయానికి కొత్త మంత్రుల కళ
కొత్త మంత్రులను కలవడానికి తరలివస్తున్న అభిమానులు భద్రత పెంచిన పోలీసులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం పండగ వాతావరణం కనిపించింది. నూతనంగా మంత్రివర్గంలో స్థానం సంపాదించిన మంత్రుల బాధ్యతల స్వీకార కార్యక్రమాలతో కోలాహలంగా మారింది. మంత్రుల అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సచివాలయ పరిసరాలు సందడిగా మారాయి. కొత్తగా మంత్రి పదవులు పొందిన జూపల్లి కృష్ణారావు, చర్లకోల లక్ష్మారెడ్డి గురువారం మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. డి బ్లాకులోని కింది అంతస్తులో విద్యుత్ మంత్రి లక్ష్మారెడ్డికి, మొదటి అంతస్తులో పరిశ్రమల మంత్రి జూపల్లికి చాంబర్లు కేటాయించారు. మరో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారికంగా బాధ్యతలు చేపట్టకున్నా గురువారం సచివాలయంలోని తన చాంబర్కు వచ్చారు. తనకు కేటాయించిన గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖల ఉన్నతాధికారులతో ఆయన దాదాపు రెండు గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన శనివారం అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలిసింది. కాగా, అనుచరులు, కార్యకర్తలు కొత్త మంత్రులను కలిసేందుకు పోటీ పడుతుండడంతో కొద్దిరోజులు సచివాలయానికి సందర్శుకుల తాకిడి ఎక్కువగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రవేశం, భద్రత చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. కాగా, వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గిరిజన సంక్షేమం, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్లు ఇంకా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. వారికి సచివాలయంలో ఇంకా చాంబర్లు ఖరారు కాలేదు. పార్కింగ్ చిక్కులు... తెలంగాణ సచివాలయంలో వాహనాల పార్కింగ్ ఇబ్బందికరంగా మారింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో పార్కింగ్ ప్రదేశాలు కిటకిటలాడుతున్నాయి. స్థలం సరిపోక వాటిని బయటకు తీయడం సమస్యగా మారుతోంది. ముఖ్యంగా కార్ల పార్కింగ్ వద్ద ఈ సమస్య కనిపిస్తోంది. మంత్రులు ఉండే డీ బ్లాక్కు అధికారులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో కార్లలో వస్తున్నారు. వీరంతా డి బ్లాక్ ఎదురుగా వాహనాలు నిలుపుతున్నారు. దీంతో స్థలం సరిపోక ఏ ఒక్క వాహనం బయటకు తీయాలన్నా మిగతా వాహనాలన్నింటినీ కదిలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వాస్తవానికి సచివాలయంలోని హెలీప్యాడ్ ప్రాంతంలో కార్ల పార్కింగ్ కోసం ప్రభుత్వం అనుమతించింది. అయితే మంత్రుల చాంబర్లకు హెలీప్యాడ్ దూరంగా ఉందనే కారణంతో సందర్శకులంతా కార్లను నేరుగా డీ బ్లాక్ వరకూ తెస్తుండడమే సమస్యకు అసలు కారణమని అధికారులు చెపుతున్నారు. ప్రతి ఒక్కరికీ గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: ఇంద్రకరణ్రెడ్డి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇంటి సదుపాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణశాఖ నూతన మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. ఇందిరమ్మ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 8.21 లక్షల ఇళ్ల నిర్మాణం పెండింగ్లో ఉందని వీటన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. గురువారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, సీఐడీ విచారణ అనంతరం నివేదిక అందాక ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంలో అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
T20 WC 2024 IND VS PAK: రోహిత్ శర్మ సూపర్ సిక్సర్.. వైరల్ వీడియో
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుడ్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
Advertisement