-
సెప్టెంబరు నుంచి ఎయిర్సెల్ 4జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ ఎయిర్సెల్ సెప్టెంబరు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 4జీ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం హైదరాబాద్లో పైలట్ కింద కేవలం ఎంటర్ప్రైస్ కస్టమర్లకు ఈ సేవలను అందిస్తోంది. రెండు రాష్ట్రాల్లోని 120 పట్టణాల్లో మూడు నెలల్లో పూర్తి స్థాయి 4జీ అందుబాటులోకి తేనున్నట్టు ఎయిర్సెల్ సర్కిల్ బిజినెస్ హెడ్ హర్దీప్ జోహర్ తెలిపారు. బుధవారమిక్కడ ‘అయిదు రాష్ట్రాలు-ఒకే ధర’ పేరుతో ఉచిత రోమింగ్ పథకాన్ని ప్రకటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ రోమింగ్ పథకాన్ని ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల కు పరిమితం చేసినా, వచ్చే ఫలితాలనుబట్టి దేశవ్యాప్తంగా విస్తరిస్తామని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా ఉన్న మొబైల్ మనీ సేవలను సైతం సర్కిల్లో డిసెంబరుకల్లా వాణిజ్యపరంగా తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. అయిదు రాష్ట్రాలు-ఒకే ధర..: కొత్త పథకంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళలో ఉన్న ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లందరికీ ఈ అయిదు రాష్ట్రాల్లో ఉచిత రోమింగ్ సౌకర్యం ఉంటుంది. అదనంగా చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇన్కమింగ్ కాల్స్ ఉచితం. అన్ని ఔట్గోయింగ్ కాల్స్కు ఒక సెకనుకు ఒక పైసా చార్జీ చేస్తారు. రాష్ట్రం మారగానే ఈ పథకం దానంతట అదే వర్తిస్తుంది. ఎస్ఎంఎస్, పాకెట్ ఇంటర్నెట్ ప్యాక్లలో ఎటువంటి మార్పు ఉండదు. యదాతథంగా వాడుకోవచ్చు. కొత్త రోమింగ్ పథకం రాకతో కస్టమర్ల సంఖ్యలో 10% వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. -
సెల్కాన్తో ఎయిర్సెల్ జట్టు
హైదరాబాద్: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్కాన్తో టెలికం కంపెనీ ఎయిర్సెల్ చేతులు కలిపింది. క్యాంపస్ ఏ356 స్మార్ట్ఫోన్ కొనుగోలుపై సీ329 ఫీచర్ ఫోన్ను సెల్కాన్ ఉచితంగా అందిస్తోంది. ఈ రెండు ఫోన్లకు ఎయిర్సెల్ 1.5 జీబీ వరకు 3జీ డాటాను ఉచితంగా ఇవ్వనుంది. కిట్క్యాట్, డ్యూయల్ సిమ్, 1 గిగాహెట్జ్ ప్రాసెసర్, 3.5 అంగుళాల తెర, 2 ఎంపీ రియర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, 3జీ వీడియో కాలింగ్, 32 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ వంటివి ఏ356 విశిష్టతలు. 1.8 అంగుళాల స్క్రీన్తో డ్యూయల్ సిమ్ కలిగి ఉన్న సెల్కాన్ సీ329లో ఆడియో, వీడియో ప్లేయర్లతోపాటు ఆటోకాల్ రికార్డింగ్, ఎఫ్ఎం, బ్లూటూత్, జీపీఆర్ఎస్, 8 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయి. స్థానిక భాషలను సపోర్ట్ చేస్తుంది. ప్యాక్ ధర రూ.3,333. ఈ ఒప్పందం ఇరు కంపెనీలకు కలిసి వస్తుందని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని ఈ సందర్భంగా తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement