-
అనుపమ-నేహా శెట్టి ఎవరు బెస్ట్?
-
'బాబు నెం.1 బుల్ షిట్ గయ్' సినిమా రివ్యూ
బిగ్బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్, బజ్జీల పాపగా ఫేమస్ అయిన కుషిత కల్లపు జంటగా నటించిన సినిమా 'బాబు నెం.1 బుల్ షిట్ గయ్'. లక్ష్మణ్ వర్మ దర్శకుడు. డీడీ క్రియేషన్స్ బ్యానర్పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. శివరాత్రి కానుకగా ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. మరి ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: 'ప్రేమలు' సినిమా రివ్యూ) కథేంటి? కార్తీక్ బాబు(అర్జున్ కల్యాణ్) అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగొచ్చిన ఓ డబ్బున్న కుర్రాడు. కరోనా టైంలో స్వదేశానికి వస్తాడు. దీంతో హైదరాబాద్ శివారులో ఉన్న తమ విల్లాలో కొడుకుని ఉండమని తండ్రి (రవి వర్మ) చెబుతాడు. దీంతో కార్తీక్... తన ప్రేయసి కుషిత(కుషిత కల్లపు)తో కలిసి విల్లాలో ఉండాలని ఫిక్స్ అవుతారు. ఆర్నెళ్లకు సరిపడా వస్తువులన్నీ తెచ్చుకుంటారు. ఇంతలో ప్లంబర్ సోంబాబు(డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ) వీరిద్దరిని కిడ్నాప్ చేసి, విల్లాలో బంధించి అక్కడే సెటిల్ అయిపోతారు. ఇంతకీ సోంబాబు ఎందుకలా చేశాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఎలా ఉందంటే? 'బాబు నం.1 బుల్ షిట్ గాయ్' మూవీ యాక్షన్ కామెడీ డ్రామా స్టోరీతో తీశారు. ఓ అందమైన జంటను గదిలో బంధించి... అదే బంగ్లాలో తన కుటుంబంతో కలిసి దర్జాగా జీవించే ఓ తాపీ మేస్త్రీ సోంబాబు కథే ఈ సినిమా. కిడ్నాపర్కి కూడా నైతిక విలువలు వుంటాయని చివర్లో చూపించారు. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) కోట్ల విలువ చేసేవి ఎదురుగానే ఉన్నా తనకు వచ్చిన కష్టకాలంలో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికే ఆ బంగ్లాలో ఉండాల్సి వచ్చిందని సింపుల్గా వెళ్లిపోయే సోంబాబు జీవిత పాఠం బాగుంది. ఫస్టాప్లో కామెడీ ట్రాక్తో మొదలై, సోంబాబు లవ్, తన ప్రేయసి సోనాలి పాణిగ్రాహితో వివాహం తదితర అంశాలతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశారు. సెకెండాఫ్లో కొంత ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ సీన్స్ తదితర అంశాలతో ఆకట్టుకున్నారు. ఎవరెలా చేశారు? అర్జున్ కల్యాణ్, కుషిత జంట బాగుంది. అర్జున్ ఉన్నంతలో బాగానే చేశాడు. హీరోయిన్ కుషిత క్యూట్ ఫెర్ఫార్మెన్తో అలరించింది. డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ కూడా హీరోకి సమంగా ఉండే పాత్రలో కనిపించారు. ఇతనికి జంటగా సోనాలి పాణిగ్రాహి చేసింది. కమెడియన్ భద్రం కాసేపు అక్కడక్కడ నవ్వించాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకుడు లక్ష్మణ్ వర్మ రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే బాగున్నాయి. అన్నివర్గాల ప్రేక్షకులు చూసేయొచ్చు. మణికర్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్ సంగీతం ఓకే. నిర్మాణ విలువులు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
ఆర్కే నాయుడు హీరోగా 'ద 100' సినిమా.. త్వరలో థియేటర్లలో రిలీజ్
'మొగలిరేకులు' సీరియల్లో ఆర్కే నాయుడు పాత్రలో నటించి చాలా ఫేమస్ అయిన నటుడు సాగర్.. హీరోగా మరో సినిమా రెడీ చేశాడు. గతంలో 'సిద్ధార్థ' చిత్రంతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 'షాదీ ముబారక్' సినిమా చేశాడు. ఇప్పుడు క్రేజీ యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. 'ద 100' అనే డిఫరెంట్ టైటిల్ నిర్ణయించారు. అలానే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) రాఘవ్ ఓంకార్ శశిధర్.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ మూవీలో విక్రాంత్ అనే ఐపీఎస్ అధికారిగా ఆర్కే సాగర్ కనిపించబోతున్నాడు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో ఆకట్టుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్.. ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
సంక్రాంతి అంటే సినిమా ఉండాల్సిందేనా? అసలు ఈ కల్చర్ ఎప్పుడు మొదలైంది?
అసలు సంక్రాంతి అంటే ఏంటి? బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిపోయిన కొడుకులు, అల్లుళ్లు, కూతుళ్లు, మనవళ్లు.. అందరూ సొంతూరికి చేరుకుని ఉన్న మూడు రోజులు సరదాగా గడపడమే అసలైన పండగ. అయితే ఈ పండగ హడావుడిలో కోళ్ల పందెలు, పిండి వంటలు చాలా కామన్. వీటితో పాటు సినిమాలు చూడటం అనేది మనకు బాగా అలవాటైపోయిన పని. అసలు సంక్రాంతి అంటే సినిమా కచ్చితంగా చూడాలా? ఇంతకీ ఈ కల్చర్ ఎప్పుడు మొదలైంది? సంక్రాంతి సీజన్ సాధారణంగా సినిమాల్ని ప్రతి శుక్రవారం రిలీజ్ చేస్తుంటారు. ఎందుకంటే శని, ఆదివారాలు కలిసొస్తాయి. సెలవు రోజులు కాబట్టి కుర్రాళ్ల దగ్గర నుంచి ఫ్యామిలీస్ వరకు థియేటర్లకు వస్తారు. ఇక సంక్రాంతి లాంటి సీజన్ వచ్చిందంటే దాదాపు వారం పదిరోజులు అందరికీ సెలవులే. కుటుంబ సభ్యులందరూ ఒక్కచోటే ఉంటారు. కాబట్టి వీళ్లందరికీ వినోదం కావాలి. అప్పుడు అందరికీ గుర్తొచ్చేది సినిమా. అలా తెలుగు చిత్రాలకు సంక్రాంతి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సీజన్ అయిపోయింది. (ఇదీ చదవండి: మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఈ విషయం గమనించారా? ) ఎప్పుడు మొదలైంది? 1932లో తొలి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద' రాకముందు వీధి నాటకాలు, బుర్రకథలు లాంటి వాటితో ప్రజలు ఎంటర్టైన్ అయ్యేవారు. ఎప్పుడైతే సినిమా కల్చర్ మొదలైందో.. బుర్రకథలు, నాటకాలు లాంటివి జనాలకు మెల్లమెల్లగా బోర్ కొట్టేశాయి. తొలుత బ్లాక్ అండ్ వైట్లో వచ్చిన సినిమాలు.. కాలానుగుణంగా కలర్లోకి మారాయి. అలా 70-80 దశకంలో నిర్మాతల ఆలోచన కూడా మారింది. సంక్రాంతి సీజన్ని క్యాష్ చేసుకోవడంతో పాటు సినీ ప్రేమికుల్ని అలరించొచ్చని తెలుసుకుని.. పండక్కి సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. గ్యారంటీగా వచ్చే స్టార్ హీరోలు అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ దగ్గర నుంచి మొదలుపెడితే ప్రస్తుతం మహేశ్, ప్రభాస్ లాంటి హీరోల వరకు సంక్రాంతి సీజన్ అనేది వీళ్లకు సెంటిమెంట్ అయిపోయింది. ఇప్పుడంటే హీరోలు రెండేళ్లకొక సినిమా చేస్తున్నారు గానీ కొన్నాళ్ల ముందు వరకు సంక్రాంతికి ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలైనా కచ్చితంగా ఒక్క మూవీ అయినా రిలీజ్ చేసేవాళ్లు. అలా ప్రతిసారి పండక్కి స్టార్ హీరోల మధ్య మంచి పోటీ ఉండేది. కాకపోతే అప్పట్లో ఆరోగ్యకర వాతావరణం ఉండేది. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది! (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) ఇప్పుడంతా దందా ఒకప్పుడు సంక్రాంతి సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. నిర్మాతలు కూడా మంచి సినిమాని రిలీజ్ చేయాలనే తాపత్రయం మాత్రమే ఉండేది. ప్రేక్షకులకు నచ్చిందా లేదా అని మాత్రమే చూసేవాళ్లు. కానీ ఇప్పుడు అంతా మారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే సంక్రాంతికి సినిమా అనగానే.. పండగ పేరు చెప్పి టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. సగటు ప్రేక్షకుడిని దోచుకుందామని ఫిక్స్ అయిపోతున్నారు. అభిమానులకు అంటే మరో దారి ఉండదు కాబట్టి ఆయా స్టార్ హీరోల సినిమాలకు వెళ్తారు. మరి సామాన్యుడి సంగతేంటి? నిర్మాతలని వీళ్లని పట్టించుకోరు. ఎందుకంటే సంక్రాంతికి ఊరెళ్లినా వాళ్లు.. పండక్కి సరదా కోసం ఒక్క సినిమా అయినా చూడకపోతే ఏం బాగుంటుందిలే అని థియేటర్లకు వెళ్తారు. ఇష్టం లేకపోయినా సరే ఒక్కసారే కదా అని టికెట్ రేట్లు ఎక్కువున్నా సరే డబ్బులు ఖర్చు పెట్టి తప్పక సినిమా చూస్తున్నారు. కొన్నిసార్లు ఫుల్గా ఎంజాయ్ చేస్తే.. కొన్నిసార్లు మాత్రం డిసప్పాయింట్మెంట్ తప్పట్లేదు! అలాంటి సరుకు కూడా అన్నిసార్లు అని చెప్పలేం గానీ కొన్నిసార్లు సంక్రాంతికి వచ్చే సినిమాలని గమనిస్తే.. నార్మల్ టైంలో వస్తే ఇవి ఆడుతాయా? కోట్లకు కోట్లు వసూలు చేస్తాయా అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే గతంలో అంతంత మాత్రంగానే ఉన్న కొన్ని సినిమాలు.. సంక్రాంతి టైంలో వచ్చి హిట్టో లేదా యావరేజ్ అయిపోయిన సందర్భాలు బోలెడు. ఎందుకంటే పండగ హడావుడిలో సినిమా చూస్తున్నామనే ఆనందం తప్పితే అది ఎలాంటి మూవీ అనేది సగటు ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోరు. అలా పండగ బరిలో పాసైపోయిన సినిమాలెన్నో? (ఇదీ చదవండి: విజయ్-రష్మిక రిలేషన్పై మళ్లీ రూమర్స్.. అంతా ఆ ఫొటోల వల్లే?) -
'మాధవే మధుసూదన' అలాంటి సినిమా: దర్శకుడు రామచంద్రరావు
తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే జంటగా నటించిన సినిమా 'మాధవే మధుసూదన'. ఈ చిత్రానికి బొమ్మదేవర రామచంద్రరావు.. దర్శకత్వం వహిస్తూ నిర్మించారు. ఈ నెల 24న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర సంగతులు చెప్పారు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!) మేకప్మ్యాన్ టూ డైరెక్టర్ 'మన్మథుడు' టైంలో నాగార్జునతో నేను దర్శకుడిని కావాలని అనుకుంటున్నట్టు చెప్పాను. నీ మెంటాల్టీకి దర్శకుడు అంటే కష్టం కానీ నిర్మాతగా ట్రై చేయ్ అని సలహా ఇచ్చారు. 'సూపర్' సినిమా టైంలో అనుష్కకు మేకప్ వేస్తూ.. మీరు పెద్ద హీరోయిన్ అవుతారు.. అప్పుడు నాకు డేట్స్ ఇవ్వాలని అన్నాను. అలా చాలామందిని అడిగాను. కానీ అనుష్క మాట నిలబెట్టుకున్నారు. 'ఆజాద్' సినిమా టైంలో నాగార్జున కోసం కాచిగూడ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాను. ఆయన వచ్చారని ఎవరో అంటే పరిగెత్తుకుంటూ వెళ్లి చూశాను. కానీ ఆయన రాలేదు. అలా ఓ మనిషి కోసం వెయిట్ చేస్తుంటే, వాళ్లు రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందనే ఆలోచనలోంచే ఈ కథ పుట్టింది. వెయిట్ చేసి వెయిట్ చేసి రాకపోవడం, 25 ఏళ్ల తరువాత ఆ మనిషి వస్తే పరిస్థితి ఏంటి? అన్నది ఈ సినిమాలో చూపించాం. అలానే నాగార్జున ముందు నుంచీ నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నాగ చైతన్య, అఖిల్, మంచు విష్ణు, బ్రహ్మానందం ఇలా ఎంతోమంది సహాయం చేయడం వల్లే సినిమా ఇక్కడి వరకు వచ్చింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement