-
కొత్త సీరియల్ సివంగి.. ఎప్పటినుంచి ప్రారంభమంటే?
సీరియల్స్ అంటే ఆడవాళ్లకు ఎంతో ఇష్టం. అందుకే వారికి నచ్చేలా, వారు మెచ్చేలా ఎన్నో రకాల సీరియల్స్ తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో జెమిని టివి "సివంగి” అనే సరికొత్త సీరియల్ తీసుకొస్తోంది. దీన్ని మార్చ్ 25 నుంచి ప్రసారం చేయనుంది. కథేంటంటే.. ఒక పల్లెటూరిలో పేద కుటుంబంలో పుట్టి, ఊరిలోని ఆడవాళ్ళ డ్రెస్సులు కుడుతూ అమ్మానాన్నలకు ఆర్థికంగా సహాయపడుతూ , స్నేహితులతో సరదాగా జీవితాన్ని గడిపే అమ్మాయి ఆనంది. ఊళ్లో ఎవరికీ ఏ కష్టం వచ్చినా సొంత మనిషిలా వెళ్లి సహాయపడుతుంది. అక్క పెళ్లిలో ఏర్పడిన అనుకోని పరిస్థితుల వల్ల ఒక కొడుకులా ఇంటి బాధ్యతలు భుజాన వేసుకొని, అవి నెరవేర్చడానికి సిటీకి ప్రయాణమవుతుంది. సిటీకి వెళ్లిన ఆనంది ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? తన అక్క పెళ్లి చేయగలిగిందా? తిరిగి తన ఊరు వెళ్లగలిగిందా? అనేది తెలియాలంటే సివంగి సీరియల్ చూడాల్సిందే! ఈ ధారావాహిక మార్చి 25న ప్రారంభమవుతోంది. ప్రతిరోజు సాయంత్రం 7.30 గంటలకు ప్రసారం కానుంది. "సివంగి” సీరియల్లో ప్రతిమ, రేణుక, నటకుమారి, చంద్రశేఖర్, శ్రీ ప్రియ తదితర నటీనటులు నటించారు. -
ఫ్యాన్స్తో కలిసి 'నువ్వు నేను ప్రేమ' సీరియల్ టీమ్ బజ్జీల ఛాలెంజ్
హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 'నువ్వు నేను ప్రేమ' సీరియల్ నటులు టీమ్.. తమ అభిమానులతో కలిసి మిర్చి బజ్జి కాంటెస్ట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గ్రాండ్ జరుపుకుంది. మున్సిపల్ గ్రౌండ్ గణేష్ సర్కిల్ దగ్గర జరిగిన ఈ వేడుక.. ఎంతో సరదాగా జరిగింది. ఇకపోతే అభిమానులు.. 'నువ్వు నేను ప్రేమ' యాక్టర్స్తో సెల్ఫీలు తీసుకుని ఫుల్గా ఎంజాయ్ చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) ఈ అద్భుతమైన ఈవెంట్లో తమ ఆత్మీయ ఆదరణ మరియు భాగస్వామ్యానికి ఖైరతాబాద్ ప్రజలకు సదరు ఛానెల్ యాజమాన్యం కృతజ్ఞతలు చెప్పింది. వీక్షకులను వారి ఇష్టమైన షోలకు మరింత చేరువ చేసే ప్రత్యేకమైన మరియు ఆకర్షణీయమైన అనుభవాలను సృష్టించేందుకు ఛానెల్ కట్టుబడి ఉందని పేర్కొంది. (ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?) -
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే?
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మొన్నీమధ్య మెగాహీరో వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్నాడు. బిగ్బాస్ ఫేమ్ మానస్ పెళ్లి కూడా జరగనుంది. ఇప్పుడు ఓ తెలుగు సీరియల్ హీరోయిన్ కూడా పెళ్లి చేసేసుకుంది. కొన్నాళ్ల ముందు నిశ్చితార్థం చేసుకుని, కాబోయే భర్తని పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు అతడితో ఏడడుగులు వేసింది. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఎవరిని పెళ్లి చేసుకుంది? (ఇదీ చదవండి: కాస్ట్లీ కారులో మెగాహీరో రామ్ చరణ్.. దీని ధరెంతో తెలుసా?) తెలుగు సీరియల్స్కి సినిమాలకున్నంత క్రేజ్ ఉందని చెప్పొచ్చు. అలా 'కృష్ణ ముకుందా మరారీ' సీరియల్తో తెలుగమ్మాయి ప్రేరణ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈమె పుట్టింది హైదరాబాద్ లోనే అయినప్పటికీ.. పెరిగిందంతా బెంగళూరులో. యాక్టింగ్పై ఇష్టంతో పలు కన్నడ సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగులో ఈ సీరియల్తో హీరోయిన్ అయిపోయింది. క్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు శ్రీపాద అనే క్రురాడిన పెళ్లి చేసుకుంది. అక్టోబరు చివరలో నిశ్చితార్థం చేసుకున్న నటి ప్రేరణ.. ఇప్పుడు కన్నడ సంప్రదాయం ప్రకారం శ్రీపాదని పెళ్లి చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె నటి, కానీ భర్తకి మాత్రం ఇండస్ట్రీతో సంబంధం లేనట్లు ఉంది. కాకపోతే అతడి హీరోలానే హ్యాండ్సమ్గా ఉన్నాడు. దీంతో సీరియల్ అభిమానులు.. కొత్త జంటని ఆశీర్వదిస్తున్నారు. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ కొడుక్కి ఎంగేజ్మెంట్.. ఫొటోలు వైరల్!) -
తల్లికి దూరమైన కుమారుడు ఏమయ్యాడు?.. ఆసక్తి పెంచుతోన్న సీరియల్!
అమ్మ అంటే దైవం. అమ్మ మన కళ్లు ముందు తిరిగే దేవత. అలాంటి అమ్మకి దూరమైన ఓ కొడుకు ఏమవుతాడు? అసలు ఎందుకు దూరమయ్యాడు? ఇదే "గుండె నిండా గుడిగంటలు" సీరియల్ కథ. విలక్షణమైన కథలతో ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ అందిస్తున్న స్టార్ మా ఈ సారి అమ్మ కథతో అలరించబోతోంది. తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న స్టార్ మా ఇప్పుడు మరిన్ని భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. అనుబంధం ఎంత గొప్పదో ఈ కథ చెబుతుంది. కన్నీరు ఎంతగా తోడు నిలబడుతుందో ఈ పాత్రలు చెబుతాయి. ప్రేమను పంచడం అంటే ఎలా ఉంటుందో ఈ సీరియల్ సన్నివేశాలు చెబుతాయి. కఠినమైన మనసుని కరిగించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంటుందని ఈ కథనం వివరిస్తుంది. అక్టోబర్ 2 నుంచి రాత్రి 9 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం కాబోతోంది. దారి తప్పిన జీవితాన్ని ఒక గాడిలో పెట్టాలనుకునే అమ్మాయి ప్రయత్నం.. ఆ తల్లికి, కుమారుడికి మధ్య దూరాన్ని తగ్గించాలనుకునే తాపత్రయం, తల్లీ, కొడుకుల మధ్య అనూహ్యమైన సంఘటనలతో ఈ సీరియల్ పూర్తిగా కొత్త భావోద్వేగాల్ని అందించబోతోంది. ఒక పసివాడు తల్లి కోసం ఎంత ఆరాట పడతాడో.. తల్లి ఒకసారి కనిపిస్తే బాగుండు అని ఎంతగా కోరుకున్నాడో.. అతని తరవాతి జీవితం ఎలా గడిచిందో తెలియాలంటే "గుండె నిండా గుడి గంటలు" చూడాల్సిందే. -
'కార్తీకదీపం 2'పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్బాబు!
తెలుగు ప్రేక్షకులది విశాల హృదయం. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీసులు, డాక్యుమెంటరీ, ఓటీటీల్లో ఇతర భాషా చిత్రాలు.. ఇలా ఒకటేమిటి నచ్చాలే గానీ ప్రతిదీ గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన సీరియల్స్ లో 'కార్తీకదీపం' ఎప్పుడూ టాప్ లో ఉంటుంది. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడీ సీరియల్ కు సీక్వెల్ ఉంటుందా లేదా అనేది డాక్టర్ బాబు క్లారిటీ ఇచ్చేశాడు. తెలుగులో ఇప్పటివరకు చాలా సీరియల్స్ వచ్చాయి. ఏళ్లకు ఏళ్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవీ ఉన్నాయి. మిగతా వాటి సంగతేమో గానీ 'కార్తీకదీపం' మాత్రం అటు ప్రేక్షకుల్ని అలరిస్తూ, టీఆర్పీ రేటింగ్స్ సంపాదించడంలోనూ దాదాపు నాలుగైదేళ్లు సక్సెస్ అయింది. అలాంటిది గతేడాది ఫిబ్రవరిలో దీనికి ఎండ్ కార్డ్ వేశారు. దీంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. కొన్నాళ్లకు తిరిగి మొదలుపెట్టడంతో సంతోషించారు. (ఇదీ చదవండి: దళపతి విజయ్పై పోలీస్ కేసు.. అలా చేసినందుకు!) కానీ కొత్తగా మొదలుపెట్టింది పెద్దగా సక్సెస్ కాకపోవడంతో దర్శకనిర్మాతలు దాన్ని ఆపేశారు. సీరియల్ ని అయితే నిలిపేశారు గానీ అందులో ప్రధాన పాత్రలు పోషించిన వంటలక్క, డాక్టర్ బాబు గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రస్తుతం 'రాధకు నీవేరా' సీరియల్ చేస్తున్న డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'కార్తీకదీపం 2'పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. 'ఇప్పటికీ ఎక్కడకి వెళ్లినా 'కార్తీకదీపం', వంటలక్క గురించి ఎక్కువగా అడుగుతుంటారు. నా పేరు మర్చిపోయి డాక్టర్ బాబు అనే పిలుస్తుంటారు. నా విశ్లేషణ ప్రకారం.. ప్రతిఒక్కరి జీవితాల్లో గొడవలుంటాయి. అందుకే 'కార్తీకదీపం' సీరియల్ అందరికీ కనెక్ట్ అయింది. నా భార్యతో బయటకెళ్లినా వంటలక్క గురించే అడుగుతుంటారు. ఆమెకి(మంజుల) పరిస్థితి తెలుసు కాబట్టి నవ్వి ఊరుకుంటుంది' ఈ ఇంటర్వ్యూలోనే 'కార్తీకదీపం 2' ఉంటుందా అనే ప్రశ్న డాక్టర్ బాబుకి ఎదురైంది. దీంతో.. 'నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్ కథ దొరకాలి. అన్నీ కుదిరితే సీజన్ 2 చేయాలి. లేకపోతే టచ్ చేయకపోతేనే బెటరేమో. కానీ మా ఇద్దరి కాంబోలో మరో సీరియల్ చేయొచ్చు' అని సీరియల్ నటుడు నిరూపమ్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement