-
పది మిలియన్ ఫాలోవర్స్ క్లబ్లో కాజోల్
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తన సినిమా విషయాలు, భర్త అజయ్ దేవగన్తో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా కాజోల్ ఇన్స్టాగ్రామ్లో పది మిలియన్ల ఫాలోవర్స్ మార్క్ చేరుకున్నారు. ఇక దీనిపై స్పందించిన కాజోల్.. ‘వెండితెరపై, సోషల్మీడియాలో అభిమానులు చూపిన ప్రేమకు కృతజ్ఞతలు’ అని కామెంట్ చేశారు. అదే విధంగా 2001లో తను నటించిన ‘కభీ ఖుషీ కభీ గమ్’ చిత్రానికి సంబంధించిన బాంగ్రా డాన్స్ వీడియోను కాజోల్ జత చేశారు. ఆ చిత్రంలో అంజలీ అనే పాత్రలో కాజోల్ నటించిన విషయం తెలిసిందే. చత్రపతి శివాజీ సైన్యాన్ని ముందుండి నడిపించిన మరాఠా వీరుడు తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’. ఈ మూవీలో మరాఠా యోధుడిగా నటించిన అజయ్ దేవ్గన్కి సతీమణి పాత్రలో కాజోల్ నటించారు. -
‘కోటి’ జాగ్రత్తలు అవసరం
మేడారం (తాడ్వాయి), న్కూస్లైన్ : కోటి మంది వచ్చే మేడారం జాతరకు కోటి జాగ్రత్తలు తీసుకోవాలని.. ఈ మేరకు అభివృద్ధి పనులకు ముందస్తుగా ప్రతిపాదనలు సిద్ధం చేయూలని అధికారులను కలెక్టర్ కిషన్ ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో జాతరలో సౌకర్యాలు మెరుగుపరిచి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అమ్మవార్ల ఆశీస్సులతో అందరం కలిసి జాతరను విజయవంతం చేయూలని పిలుపునిచ్చారు. వచ్చే సంవత్సరం ఫి బ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో కలెక్టర్ శనివారం వివిధ శాఖల అధికారులతో కలిసి మేడారంలో క్షేత్రస్థారుులో పర్యటించారు. అనంతరం మేడారంలోని ఐటీడీఏ అతిథి గృహంలో రూరల్ ఎస్పీ పా లరాజు, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, ఐటీడీఏ, ఆర్డబ్ల్యూఎస్, ఎంఐ, ఐబీ, పంచాయతీరాజ్, ట్రాన్స్కో, ఎండోమెంట్, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య, ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు. గత జాతరలోని భక్తుల ఇబ్బందులను శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. గత జాతరకు 80 లక్షల మంది భక్తులు వచ్చారని... ఈసారి కోటి మంది భక్తులు వచ్చే అవకాశమున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రధానంగా జాతరలో తాగు నీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సమస్య లు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూ పొందించాలని ఆయూ శాఖల అధికారులకు కలెక్టర్ కిషన్ సూ చించారు. అదేవిధంగా ఐటీడీఐ ఆధ్వర్యంలో లింక్ రోడ్ల అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు తయారు చేయూ లన్నారు. పస్రా నుంచి మేడారం... తాడ్వాయి నుంచి మేడారం వరకు గల తారు రోడ్లు అభివృద్ధి చేయాలని ఆర్ఆండ్బీ, ఎన్హె చ్ అధికారులను ఆదేశించారు. జాతరలో అస్వస్థతకు గురైన భక్తులకు వైద్య పరీక్షలందించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చే యాలన్నారు. గద్దెల ప్రాంతంలోనే కాకుండా జాతర పది కిలోమీటర్ల మేర విద్యుత్ సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులకు చెప్పారు. బృందాల వారీగా అధికారులు సమన్వయంతో పని చేసి జాతర విజయవంతం చేయూలన్నారు. జంపన్నవాగు స్నానఘాట్టాల వద్ద భక్తులు తలనీలాలు సమర్పించేందుకు 50 మీటర్లకు ఒకటి చొప్పున ఎక్కువ సంఖ్యలో కేశఖండన కేంద్రాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు దేవతలను దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యే క క్యూ లైన్లు ఏర్పాటు చేయూలన్నారు. జాతరపై ఇది తొలి సమావేశమేనని.. ఇలాంటివి ఎన్నో ఉంటాయని కలెక్టర్ చెప్పారు. భారీ భద్రత చర్యలు : రూరల్ ఎస్పీ పాలరాజు మేడారం జాతరలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ భద్రత చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్పీ పాలరాజు తెలిపారు. గత జాతరలో భక్తుల ఎదుర్కొన్న ఇబ్బందులపై... అప్పుడు విధులు నిర్వర్తించిన ఎస్పీ జాబితా తయారు చేశారని చెప్పారు. ఈ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ సమస్యతోపాటు క్యూలో తోపులాట చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. వీఐపీ, ప్రైవేట్ వాహనాల పార్కింగ్ కోసం అదనపు స్థలాలు ఏర్పాటు కోసం చర్యలు చేపట్టనున్నట్లు పాలరాజు వివరించారు. దేవాదాయ సిబ్బంది తీరుపై అసంతృప్తి తాడ్వాయి : దేవాదాయశాఖ అధికారుల తీరుపై కలెక్టర్ కిషన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎండ తీవ్రతకు దేవతల గద్దెల ప్రాగణంలోని నాపరాయి వేడిక్కింది. దీంతో అధికారులు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్ద దేవాదాయ సిబ్బంది బస్తా సంచులు వేశారు. అధికారులు వాటిపై నిలబడి దేవతలను దర్శించుకున్నారు. మేడారంలో పర్యటన ఉందని తెలిసి కూడా గద్దెల ప్రాంగణంలో నీడ ఏర్పాటు ఎందుకు చేయలేదని దేవాదాయశాఖ అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేయొద్దని వారికి సూచించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
వాల్మీకులు కాంగ్రెస్ వెంటే..
మోసపూరిత హామీలు నమ్మొద్దు
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
రామాయణ కారిడార్ అనుసంధానం చేయాలి
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
కాంగ్రెస్ గూటికి మున్సిపల్ వైస్ చైర్మన్
రఘురాముడు గెలిస్తే అభివృద్ధి..
బెయిల్ ఇస్తే ఫైళ్లపై సంతకాలు చేయొద్దు
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement