-
యూఎస్ ఓపెన్లో పెను సంచలనం.. 87 ఏళ్ల రికార్డు బద్దలు
చైనాకు చెందిన టెన్నిస్ ఆటగాడు యూ వైబింగ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో చరిత్ర సృష్టించాడు. 63 ఏళ్ల తర్వాత ఒక గ్రాండ్స్లామ్లో చైనా నుంచి సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో విజయం సాధించిన రెండో ఆటగాడిగా యూ వైబింగ్ రికార్డులకెక్కాడు. విషయంలోకి వెళితే.. 174వ ర్యాంకర్ అయిన యూ వైబింగ్.. తొలి రౌండ్లో జార్జేరియాకు చెందిన 31వ సీడ్ నికోలోజ్ బాసిలాష్విలిని 6-3,6-4,6-0తో వరున సెట్లలో కంగుతినిపించాడు. కాగా 22 ఏళ్ల యూ వైబింగ్ మ్యాచ్లో తొమ్మిది ఏస్లు.. 31 విన్నర్లు సంధించాడు. టెన్నిస్లో మేజర్ గ్రాండ్స్లామ్లు చూసుకుంటే 1959 తర్వాత చైనా నుంచి ఒక ఆటగాడు సింగిల్స్ మ్యాచ్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 1959లో వింబుల్డన్లో మెఫు-చి మాత్రమే మేజర్ విజయాలు సాధించాడు. ఇక 1935లో చైనాకు చెందిన చెంగ్ గయ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో తొలి రౌండ్ మ్యాచ్ గెలిచాడు. అప్పటినుంచి చూసుకుంటే మళ్లీ ఒక్క చైనీస్ ఆటగాడు యూఎస్ ఓపెన్లో తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయారు. తాజాగా యూ వైబింగ్ మాత్రమే యూఎస్ ఓపెన్లో తొలి రౌండ్ను విజయవంతంగా అధిగమించాడు. కాగా 2017లో జూనియర్ చాంపియన్గా నిలిచిన యూ వైబింగ్ ఆ తర్వాత ప్రొఫెషనల్ కెరీర్లో రాణించలేకపోయాడు. వరుస గాయాలు అతన్ని ఇబ్బందిపెట్టాయి. మార్చి 2019 నుంచి జనవరి 2022 వరకు యూ వైబింగ్ టెన్నిస్కు మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత గాయం నుంచి కోలుకొని మార్చిలో బరిలోకి దిగిన యూ వైబింగ్ ర్యాంక్ 1869. అయితే వరుసగా 14 మ్యాచ్లు(తాజా దానితో కలిపి) విజయాలు సాధించి ఏకంగా 174వ ర్యాంక్కు చేరుకున్నాడు. ఇక యూ వైబింగ్ తన తర్వాతి మ్యాచ్ పోర్చుగీస్కు చెందిన నునో బోర్జెస్తో ఆడనున్నాడు. Wu Yibing has become the first man from China to win a men's Grand Slam match in 63 years after he beat Nikoloz Basilashvili 6-3 6-4 6-0. Trailblazer 🔥 #USOpen pic.twitter.com/zlZm9Tnd2u — Eurosport (@eurosport) August 29, 2022 చదవండి: US Open 2022: రెండో రౌండ్కు దూసుకెళ్లిన సెరెనా -
ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్స్లామ్స్లో కీలక మార్పు.. ఇకపై
టెన్నిస్లో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రాండ్స్లామ్ టోర్నీల్లో కొత్త రూల్ను ప్రవేశపెట్టారు. గ్రాండ్స్లామ్ టోర్నీ మ్యాచ్ల్లో ఇకపై ఆఖరి సెట్లో స్కోరు 6-6తో సమంగా ఉన్నప్పుడు 10 పాయింట్ టై బ్రేక్ ఆడేలా కొత్త రూల్ తీసుకొచ్చినట్లు బుధవారం గ్రాండ్స్లామ్ బోర్డు ఉమ్మడి అధికారిక ప్రకటన చేసింది. ఈ నిబంధన రానున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచే అమలు చేయనున్నట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ''ఆస్ట్రేలియన్ ఓపెన్, రోలాండ్-గారోస్(ఫ్రెంచ్ ఓపెన్), వింబుల్డన్, యుఎస్ ఓపెన్ లాంటి మేజర్ గ్రాండ్ స్లామ్ టోర్నీలలో 10-పాయింట్ టై-బ్రేక్ ఆడాలనే ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఆఖరి సెట్లో స్కోరు ఆరుకు చేరుకున్నప్పుడు ఈ 10 పాయింట్ టై బ్రేక్ ఆడాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో సుధీర్ఘ మ్యాచ్లు జరిగాయి. వాటివల్ల ఆటగాళ్లు మానసికంగా అలిసిపోతున్నారు.బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం ఆట నియమాలలో మరింత స్థిరత్వాన్ని సృష్టించనుంది. తద్వారా ఆటగాళ్ల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇక డబ్ల్యూటీఏ, ఏటీపీ, ఐటీఎఫ్ లాంటి టోర్నీల్లోనూ త్వరలోనే దీనిని అమలు చేయనున్నాం. ఇందుకోసం సదరు కమ్యూనిటీ అధికారులతో విస్తృతమైన సంప్రదింపులు జరుపుతున్నాం. ముందుగా ఫ్రెంచ్ ఓపెన్లో 10 పాయింట్ టై బ్రేక్ను ట్రయల్ నిర్వహించనున్నాం. ఆ తర్వాత మెల్లిగా అన్నింటికి వర్తించనున్నాం'' అని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక 10 పాయింట్ టై బ్రేక్ అనేది అన్ని గ్రాండ్స్లామ్ల్లో.. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో క్వాలిఫయింగ్ నుంచి ఫైనల్కు వరకు ఆఖరి సెట్లో ఇది వర్తించనుంది. సీనియర్తో పాటు జూనియర్ సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, వీల్చైర్ డబుల్స్లో కూడా ఈ సిస్టమ్ను ఏర్పాటు చేయనున్నారు. చదవండి: Maria Sharapova-Michael Schumacher: షరపోవా, షుమాకర్లపై చీటింగ్, క్రిమినల్ కేసులు PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్ -
US Open: సంచలనాల మోత
న్యూయార్క్: కెరీర్లో ఏడో గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడుతున్న కెనడాకు చెందిన 19 ఏళ్ల లేలా ఫెర్నాండెజ్ తన జీవితంలోనే గొప్ప విజయాన్ని సాధించింది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోరీ్నలో మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్)పై లేలా జయభేరి మోగించింది. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో లేలా 5–7, 7–6 (7/2), 6–4తో ఒసాకాను ఓడించి కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోరీ్నలో ప్రిక్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. తొలి సెట్ సొంతం చేసుకొని, రెండో సెట్ లో 6–5తో ఆధిక్యంలో ఉండి విజయం కోసం సర్వీస్ చేసిన ఒసాకా తన సర్వీస్ను నిలబెట్టుకోలేకపోయింది. ఒసాకా సర్వీస్ను బ్రేక్ చేసిన లేలా స్కోరును 6–6తో సమం చేసి... టైబ్రేక్లోనూ పైచేయి సాధించి మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోని తొలి గేమ్లోనే ఒసాకా సరీ్వస్ను బ్రేక్ చేసి తన సర్వీస్ను కాపాడుకొని లేలా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత లేలా తన సరీ్వస్లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో లేలా ఆరు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. నెట్ వద్దకు ఆరుసార్లు దూసుకొచ్చి ఐదుసార్లు పాయింట్లు సాధించింది. మరోవైపు 2018, 2020లలో యూఎస్ ఓపెన్ చాంపియన్గా నిలిచిన ఒసాకా 15 ఏస్లు సంధించినా 36 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరో మూడో రౌండ్ మ్యాచ్లో పదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 3–6తో మరియా సాకరి (గ్రీస్) చేతిలో ఓడిపోయింది. ప్రిక్వార్టర్స్లో స్వితోలినా, సబలెంకా ఇతర మూడో రౌండ్ మ్యాచ్ల్లో ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–2తో కసత్కినా (రష్యా)పై, రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–3తో కొలిన్స్ (అమెరికా)పై, ఎనిమిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–4, 6–2తో రఖిమోవా (రష్యా)పై, తొమ్మిదో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–4, 3–6, 6–2తో మాజీ నంబర్వన్ అజరెంకా (బెలారస్)పై గెలిచారు. మెద్వెదేవ్ ముందంజ... పురుషుల సింగిల్స్లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) మూడో రౌండ్లోనే ని్రష్కమించగా... రెండో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మెద్వెదేవ్ 6–0, 6–4, 6–3తో పాబ్లో అందుహార్ (స్పెయిన్)పై నెగ్గాడు. మరోవైపు స్పెయిన్కు చెందిన 18 ఏళ్ల కార్లోస్ అల్కారజ్ 4 గంటల 7 నిమిషాల్లో 6–3, 4–6, 7–6 (7/2), 0–6, 7–6 (7/5)తో సిట్సిపాస్ను ఓడించగా... 23 ఏళ్ల అమెరికా యువతార టియాఫో 3 గంటల 45 నిమిషాల్లో 4–6, 6–3, 7–6 (8/6), 4–6, 6–1తో రుబ్లెవ్పై గెలిచాడు. తాజా విజయంతో అల్కారజ్ 1989లో పీట్ సంప్రాస్ (అమెరికా), మైకేల్ చాంగ్ (అమెరికా) తర్వాత యూఎస్ ఓపెన్లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. సిట్సిపాస్తో జరిగిన మ్యాచ్లో అల్కారజ్ కళ్లు చెదిరే ఫోర్హ్యాండ్ షాట్లతో హడలెత్తించాడు. సిట్సిపాస్ ఐదు డబుల్ ఫాల్ట్లు, 38 అనవసర తప్పిదాలు చేశాడు. రుబ్లెవ్తో జరిగిన మ్యాచ్లో టియాఫో 24 ఏస్లు సంధించడం విశేషం. టెన్నిస్ నుంచి నిరవధిక విరామం తీసుకోవాలనుకుంటున్నా. ఇటీవల కాలంలో నేను గెలిస్తే సంతోషం కలిగేది కాదు. ఊరట లభించినట్టు అనిపించేది. ఇక ఓడిపోతే తీవ్రంగా నిరాశ కలిగేది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే స్థితిలో లేను. నిజాయితీగా చెప్పాలంటే మళ్లీ నేను ఎప్పుడు రాకెట్ పట్టి కోర్టులోకి దిగుతానో నాకే తెలియదు. –ఒసాకా మిక్స్డ్లోనూ సానియా ఓటమి యూఎస్ ఓపెన్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్లో తొలి రౌండ్లోనే ఓడిపోయిన సానియా... మిక్స్డ్ డబుల్స్లోనూ తొలి రౌండ్ను దాటలేకపోయింది. భారత సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ రాజీవ్ రామ్ కలిసి సానియా మిక్స్డ్ డబుల్స్లో బరిలోకి దిగింది. తొలి రౌండ్లో సానియా–రాజీవ్ రామ్ ద్వయం 3–6, 6–7 (7/10)తో మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా)–డయానా యా్రస్టెమ్స్కా (ఉక్రెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేíÙయా) జంట 3–6, 6–3, 7–6 (7/1)తో డక్వర్త్–థాంప్సన్ (ఆ్రస్టేలియా) ద్వయంపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. -
రోజూ 30 వేల మంది ప్రేక్షకులకు అనుమతి
ఈ ఏడాది జరిగే టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్లకు అనుమతించే ప్రేక్షకుల సంఖ్యపై విక్టోరియా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మార్టిన్ పకులా శనివారం కీలక ప్రకటన చేశారు. టోర్నీ చివరి ఐదు రోజులు మినహా మిగిలిన తొమ్మిది రోజుల్లో రోజుకు 30 వేల మంది ప్రేక్షకులను మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే టోర్నీ చివరి ఐదు రోజుల్లో మ్యాచ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో అప్పుడు 25 వేల మంది వరకు మాత్రమే మ్యాచ్లను చూసేందుకు అనుమితిస్తామని మార్టిన్ పకులా తెలిపారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్ వేదికగా ఫిబ్రవరి 8 నుంచి 21 వరకు జరగనుంది. -
ఫ్రెంచ్ ఓపెన్కు ప్రేక్షకుల అనుమతి
పారిస్ : ఈ నెల 27 నుంచి అక్టోబర్ 11 వరకు జరిగే టెన్నిస్ గ్రాండ్స్లామ్ ఈవెంట్ ఫ్రెంచ్ ఓపెన్లో మ్యాచ్లను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు బెర్నార్డ్ సోమవారం స్పష్టం చేశారు. దాంతో కరోనా విరామం అనంతరం ప్రేక్షకులతో జరగనున్న తొలి మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్గా ఫ్రెంచ్ ఓపెన్ నిలవనుంది. తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం పారిస్ వంటి నగరాల్లో 5 వేల మందితో కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ఇది సాధ్యమైంది. (తన కోపమే తన శత్రువు) ఫ్రెంచ్ ఓపెన్ పూర్తి సామర్థ్యంలో 50 నుంచి 60 శాతం వీక్షకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంటే ఇంచుమించుగా టోర్నీ జరుగుతున్న రోజుల్లో రోజుకు 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టోర్నీకి వేదికయ్యే ప్రదేశాన్ని మూడు జోన్లుగా విభజించారు. మ్యాచ్ను చూడటానికి వచ్చిన ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులను ధరించాలి. టోర్నీలో ఆడేందుకు వచ్చిన ప్లేయర్లకు 72 గంటల వ్యవధిలో రెండు సార్లు కరోనా పరీక్షలు చేస్తామని రెండు సార్లు నెగెటివ్ అని వస్తేనే వారిని టోర్నీలో ఆడేందుకు అనుమతిస్తామని టోర్నీ డైరెక్టర్ గయ్ ఫోర్జె తెలిపారు. (ఒలింపిక్స్ జరగడం ఖాయం: ఐఓసీ)
Pagination
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
తప్పక చదవండి
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement