-
‘పతాక’ స్థాయిలో పొరపాట్లు! జెండాల పంపిణీలో ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘనలు
సాక్షి, హైదరాబాద్: మూడు వర్ణాల్లో ఒక్కో వర్ణానిది ఒక్కో సైజు.. రంగులు సరిగ్గా అద్దక మధ్యలో తెల్లటి చారలు.. తెలుపు వర్ణం మధ్యలో ఉండాల్సిన అశోక చక్రం పక్కకు జరగడం.. జెండాలపై చేతి రాతలు.. వెరసి జాతీయ పతాక నియమావళి (ఫ్లాగ్ కోడ్) ఉల్లంఘనలు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15న ప్రతీ ఇంటిపై ఎగురవేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా జాతీయ జెండాలను పంపిణీ చేస్తుండగా.. చాలామంది ఇలాంటి నాసిరకం జెండాలు అందుకుని విస్మయానికి గురయ్యారు. కొన్నిచోట్ల ఫ్లాగ్ కోడ్కు విరుద్ధంగా జెండాలపై స్టాకు వివరాలను రాయడం గమనార్హం. ఫ్లాగ్ కోడ్లో నిర్దేశించిన పరిమాణం, రంగులు, డిజైన్ను కచ్చితంగా అనుసరిస్తూ జెండాలను తయారు చేయాలి. జాతీయ జెండా తప్పనిసరిగా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. నిలువు, అడ్డం మధ్య నిష్పత్తి 2:3 ఉండాలి. నిర్దేశిత 9 రకాల సైజుల్లో మాత్రమే జెండాలుండాలి. కాషాయ, తెలుపు, ఆకుపచ్చ వర్ణాలు సమవైశాల్యంలో ఉండాలి. తెలుపు రంగు పట్టీ మధ్యలో అశోకచక్రం ఉండాలి. జెండాపై ఎలాంటి ఇతర రాతలు ఉండొద్దు. కానీ, కొన్ని జెండాల విషయంలో ఈ నిబంధనలన్నింటికీ తూట్లు పొడిచినట్టు ఉంటోంది. నాణ్యత లేని జెండాలు అందుకున్నట్టు సామాజిక మాధ్యమాల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా శ్రద్ధ చూపడంలేదని విమర్శిస్తున్నారు. సిరిసిల్ల నుంచి కొనుగోళ్లు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఉచితంగా జాతీయ జెండాలను పంపిణీ చేసేందుకు టెస్కో ఆధ్వర్యంలో 1.2 కోట్ల జెండాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఒక్కో జెండాకు రూ.23 ధరను ఖరారు చేసింది. సిరిసిల్ల చేనేత కార్మికుల నుంచి జెండాల తయారీకి కావాల్సిన 98 శాతం వస్త్రాన్ని కొనుగోలు చేసింది. 60 లక్షల జెండాలను కుట్టే ఆర్డర్ను సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇవ్వగా, హైదరాబాద్లోని ఎస్హెచ్జీ గ్రూపులకు మరో 30 లక్షలు; ఖమ్మం, మిర్యాలగూడలోని ఎస్హెచ్జీ గ్రూపులకు మిగిలిన జెండాలను కుట్టే ఆర్డర్ను టెస్కో ఇచ్చింది. ఒక్కో జెండాను కుట్టడానికి రూ.5 ధరను నిర్ణయించింది. జెండాలను కుట్టే వాళ్లే వస్త్రాన్ని నిర్దేశిత సైజులో కత్తిరించి చేయాల్సి ఉండగా, అడ్డగోలుగా కత్తిరించి కుట్టుతుండటంతోనే సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 37 లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేశారు. గ్రామాల్లో 30 లక్షలు, పట్టణాల్లో 7 లక్షల జెండాలు పంపిణీ చేశారు. మిగిలినవి ఆగస్టు 15కల్లా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు జెండాల పంపిణీని పర్యవేక్షిస్తున్నాయి. వాటిని పంపిణీ చేయొద్దని ఆదేశించాం భారీ ఎత్తున జాతీయ జెండాల తయారీ సందర్భంగా కొన్ని జెండాలు లోపాలతో వస్తున్నాయి. తయారీ, కుట్టడం, పంపిణీ దశల్లోనే అలాంటి జెండాలను గుర్తించి తొలగిస్తున్నాం. అలాంటి జెండాలను పంపిణీ చేయొద్దని కలెక్టర్లను ఆదేశించాం. –జ్యోతిబుద్ధప్రసాద్, కమిషనర్, టెస్కో -
నేతన్నలకు ‘జెండా’ పండుగ
పవర్లూమ్స్పై పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్న ఇతని పేరు మామిడాల సమ్మయ్య. సిరిసిల్లలోని విద్యానగర్కు చెందిన సమ్మయ్య నిత్యం 12 సాంచాలపై పనిచేస్తూ పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. సమ్మయ్యకు వారానికి రూ.2,500 కూలి వస్తుంది. ఇలా ఒక్క సమ్మయ్యనే కాదు.. సిరిసిల్లలో 5 వేల మంది కార్మికులు శ్రమిస్తున్నారు. జాతీయ జెండాల తయారీపని చేస్తున్న వీరు సిరిసిల్లకు చెందిన మహిళలు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు అవసరమైన జెండాలను సిరిసిల్లలో సిద్ధం చేస్తున్నారు. సిరిసిల్లలో జెండాలు తయారుచేసే పది మంది వ్యాపారులు ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాలకు జెండాలను సరఫరా చేస్తున్నారు. సిరిసిల్ల: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రజల్లో దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా.. మహనీయు ల త్యాగాలు.. పోరాటఫలాలు నేటి తరానికి తెలిసేలా ప్రతి ఇంటిపై జాతీయజెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15కి ముందు వారం, తరువాత మరో వారం రోజులు భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణవ్యాప్తంగా 1.20 కోట్ల జాతీయ జెండాలు అవసరం ఉండగా.. పాలిస్టర్ వస్త్రాన్ని టెస్కోద్వారా కొ నుగోలుచేసి, ఆ వస్త్రాన్ని ప్రాసెసింగ్ చేసి, మూడు రంగుల జెండాలను తయారుచే యాలని నిర్ణయించారు. ఈ మేరకు సిరిసిల్ల నేతన్నల వద్ద 30 లక్షల మీటర్ల వస్త్రాన్ని కొ నేందుకు టెస్కో ఆర్డర్లు ఇచ్చింది. సిరిసిల్లలో 30 లక్షల మీటర్ల వస్త్రం కొనుగోలు.. తెలంగాణవ్యాప్తంగా 38,588 పవర్లూమ్స్ ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 28,494 పవర్లూమ్స్ ఉన్నాయి. 4,116 సాంచాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. అతి తక్కువ సాంచాలతో (18) సంగారెడ్డి జిల్లా చివరిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, వరంగల్, భువనగిరి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న పాలిస్టర్ వస్త్రాన్ని టెస్కో కొనుగోలు చేస్తోంది. సిరిసిల్లలోనే 30 లక్షల మీటర్లు కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వస్త్ర నాణ్యత, పొడవు, వెడల్పును బట్టి రూ.13 నుంచి రూ.16 వరకు ఒక్కో మీటరుకు చెల్లించాలని నిర్ణయించారు. సిద్ధమవుతున్న జెండాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సిరిసిల్లకు ఆర్డర్లు వచ్చాయి. దీంతో జెండాలు తయారుచేసే వ్యాపారులు బిజీగా మారా రు. ఇక్కడి పది మంది వ్యాపారులకు 50 లక్షల జెండాల తయారీ ఆర్డర్లు వచ్చాయి. వీటి ద్వారా 1,200 మంది మహిళలు జెండాలు కుడుతూ ఉపాధి పొందుతున్నారు. ఇది అనుకోని ఆర్డర్ టెస్కో ద్వారా పాలిస్టర్ వస్త్రాన్ని కొనుగోలు చేస్తారని తెలియదు. ఇది అనుకోని ఆర్డర్. నాకు 52 సాంచాలు ఉన్నాయి. నా వద్ద నిల్వ ఉన్న 50 వేల మీటర్ల వస్త్రాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నా. టెస్కో కొనుగోలు చేయడం ఆనందంగా ఉంది. – కోడం విజయ్, వస్త్రోత్పత్తిదారుడు, సిరిసిల్ల ఢిల్లీకి 5 లక్షల జెండాలు ఇస్తున్నా.. నాకు ఢిల్లీ నుంచి జూలై 10న ఐదు లక్షల జెండాల ఆర్డర్లు వచ్చాయి. కొంచెం ముందుగా ఆర్డర్లు వస్తే ఇంకా బాగుండేది. ఇప్పుడు చాలా రాష్ట్రాల ఆర్డర్లు వస్తున్నాయి. కానీ సమయం సరిపోదు. నా వద్ద ఓ 50 మంది ఉపాధి పొందుతున్నారు. – ద్యావనపల్లి మురళి, వ్యాపారి, సిరిసిల్ల నెలకు రూ.6 వేలు సంపాదిస్తున్న నేను బీడీలు చేసిన. ఆ పని కష్టంగా ఉండటంతో జెండాలు కుట్టడం, ప్యాకింగ్ చేయడం చేస్తున్న. నెలకు రూ.6వేలు సంపాదిస్తున్న. మా ఆయన సాంబశివ సాంచాలు నడుపుతారు. మాకు ఇద్దరు పిల్లలు. ఈ పని బాగుంది. నాలాగే చాలా మంది ఈ పని చేస్తున్నారు. – వెల్దండి శైలజ, సిరిసిల్ల -
‘టెస్కో’ పాలకమండలి రద్దు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) ప్రస్తుత పాలక మండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్ జీవో నెంబర్19ను జారీ చేశారు. రాష్ట్ర హస్తకళల అభివృధ్ధి సంస్థ ఎండీని టెస్కో పర్సన్ ఇన్చార్జిగా నియమించారు. 2018 మార్చి వరకు ప్రస్తుత పాలక మండలి సభ్యుల పదవీ కాలం ఉంది. అయితే పాలక మండలి సభ్యులు, చైర్మన్ నియామకం రాజకీయాలతో ముడిపడి ఉండటంతో.. రద్దు ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఈ ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర వేయడంతో శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం (ఆప్కో) విభజన ప్రణాళికకు గత ఏడాది ఆగస్టులో షీలా బిడే కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో 2015 అక్టోబర్ 31 న ఆవిర్భవించిన తెలంగాణ చేనేత సహకార సంఘం (టెస్కో) సొంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆప్కో పాలక మండలిలో 24 మంది డెరైక్టర్లుగా ఉండగా.. విభజన ప్రణాళిక మేరకు తెలంగాణకు 11, ఆంధ్రప్రదేశ్కు 13 మంది డెరైక్టర్లను కేటాయించారు. వీరందరూ ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఫిబ్రవరిలో నియమితులు కాగా.. 16 మార్చి 2018 వరకు పదవీ కాలం ఉంది. కాగా, పాలక మండలి విభజన జరిగిన నేపథ్యంలో ప్రస్తుతమున్న పాలక మండలిని రద్దు చేసి.. నూతన పాలక మండలిని నియమించాలంటూ ప్రభుత్వంపై కొందరు డెరైక్టర్లు ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కొత్త పాలకమండలి నియామకంపై అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్నారు. అక్కడి నుంచి సమ్మతి రావడంతో తాజా ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. -
టెస్కో పాలక మండలి రద్దా? కొనసాగింపా?
► సీఎం నిర్ణయం మేరకు నడుచుకోవాలని భావిస్తున్న అధికారులు ► విభజన ప్రణాళిక మేరకు రాష్ట్రానికి 11 మంది డెరైక్టర్లు ► 2018 మార్చితో ముగియనున్న సభ్యుల పదవీకాలం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) ప్రస్తుత పాలక మండలి సభ్యుల కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. 2018 మార్చితో ప్రస్తుత పాలక మండలి సభ్యుల పదవీ కాల పరిమితి ముగియనుంది. అయితే పాలక మండలి సభ్యులు, చైర్మన్ నియామకం రాజకీయాలతో ముడిపడి ఉండటంతో రద్దు ప్రతిపాదన తెర పైకి వస్తోంది. పాలక మండలి కొనసాగించాలా.. లేక రద్దు చేయాలా అనే అంశంపై అధికార పార్టీ ముఖ్య నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్గనిర్దేశనం మేరకు పాలక మండలి కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని చేనేత, జౌళి శాఖ అధికారులు భావిస్తున్నారు. పెరుగుతున్న ఒత్తిళ్లు ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం (ఆప్కో) విభజన ప్రణాళికకు గతేడాది ఆగస్టులో షీలాబిడే కమిటీ ఆమోదం తెలిపింది. 2015 అక్టోబర్ 31 నుంచి తెలంగాణ చేనేత సహకార సంఘం (టెస్కో) సొంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆప్కో పాలక మండలిలో 24 మంది ైడె రెక్టర్లుగా ఉండగా.. విభజన ప్రణాళిక మేరకు తెలంగాణకు 11, ఆంధ్రప్రదేశ్కు 13 మంది డెరైక్టర్లను కేటాయించారు. వీరందరూ ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఫిబ్రవరిలో నియమితులు కాగా.. 2018 మార్చి 16కల్లా వీరి పదవీకాలం ముగియనుంది. పాలక మండలి విభజన జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం 11 మంది సభ్యుల్లో ఒకరిని చైర్మన్ గా ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని.. కొందరు డెరైక్టర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వీరి ప్రతిపాదనకు టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు కీలక మంత్రులు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. గతంలో ఆప్కో చైర్మన్గా పనిచేసిన నేత ఒకరు.. ప్రస్తుత పాలక మండలిని రద్దు చేసి కొత్తగా నియమించాలంటూ లాబీయింగ్ చేస్తున్నారు. ఇరువైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. సీఎం మార్గనిర్దేశనం మేరకు నడుచుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిపై దిశానిర్దేశం చేయాలంటూ సీఎంకు మంత్రి లేఖ రాసినట్లు సమాచారం. ఆప్కో విభజన ప్రణాళికకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తుది ఆమోదం తెలిపితే తప్ప.. నూతన పాలక మండలిని నియమించే అవకాశం లేదని చేనేత శాఖ వర్గాలు వెల్లడించాయి. -
టెస్కో, వొడాఫోన్లకు ఎఫ్ఐపీబీ ఓకే
న్యూఢిల్లీ: దేశీయ మల్టీబ్రాండ్ రిటైలింగ్లో ప్రవేశించేందుకు యూకే రిటైలింగ్ దిగ్గజం టెస్కోకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతి లభించింది. దీంతోపాటు దేశీయ మొబైల్ దిగ్గజంలో మైనారిటీ వాటాదారుల వాటాను కొనుగోలు చేసేందుకు వొడాఫోన్కు కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల పరిమితిని పెంచే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతిపాదనపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆర్థికశాఖ వర్గాలు ఈ విషయాలను వెల్లడించాయి. తొలి దశలో భాగంగా టెస్కో 11 కోట్ల డాలర్లను(రూ. 7,500 కోట్లు) ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు వేసింది. తద్వారా టాటా గ్రూప్నకు చెందిన ట్రెంట్ హైపర్మార్కెట్స్లో 50% వాటాను కొనుగోలు చేయనుంది. ఇక మరోవైపు వొడాఫోన్ ఇండియాలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనల్జిత్ సింగ్కు గల 24.65% వాటాతోపాటు అజయ్ పిరమల్కు చెందిన 10.97% వాటాను బ్రిటిష్ సంస్థ వొడాఫోన్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు రూ. 10,141 కోట్లను వెచ్చించనున్నట్లు అంచనా.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement