-
చెన్నైకి చిరుత.. వయా థాయిలాండ్
సాక్షి, చెన్నై: చిరుతపులి కూనను దొంగచాటుగా తెచ్చిన ఓ వ్యక్తిని చెన్నై విమానాశ్రయం అధికారులు అరెస్ట్చేశారు. చెన్నైకి చెందిన మొహిద్దీన్(28) శనివారం వేకువజామున బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్లైన్స్ విమానంలో చెన్నైకి చేరుకున్నాడు. చేతిలో చిన్న వెదురుబుట్టతో విమానాశ్రయంలో సంచరిస్తున్న మొహిద్దీన్ను కస్టమ్స్ అధికారులు అనుమానించారు. వెదురు బుట్టలో ఏముందని ప్రశ్నించగా కుక్కపిల్ల ఉందని బదులిచ్చాడు. పొంతనలేని సమాధానాలివ్వడంతో జంతు సంరక్షణ విభాగం వారిని అధికారులు పిలిపించారు. అది చిరుత కూన అని ఆ అధికారులు తేల్చారు. కూనను తిరిగి బ్యాంకాక్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిని ఇక్కడి ఓ సర్కస్ కంపెనీ కోసం తీసుకొచ్చినట్లు మొహిద్దీన్ చెప్పాడు. -
రోజంతా ఎగిరేది ఎప్పుడో?!
సాక్షి, విశాఖపట్నం: శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న విశాఖ విమానాశ్రయం నుంచి 24 గంటల సేవలకు విఘాతాలు కొనసాగుతూనే ఉన్నా యి. ప్రయాణికుల డిమాండ్, కార్గో అవకాశాలు పుష్కలంగా ఉ న్నా, పలు విదేశీ విమానయాన సంస్థలు సర్వీసులందించేం దుకు ముందుకు వస్తున్నా ముహూర్తం కుదర డం లేదు. నేవీ అధికారుల తీరు ప్రధాన అడ్డంకిగా మారిం ది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత విశాఖ నుంచి ఏటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. డిమాండ్ పెరగడంతో పలు ప్రైవేటు విమానయాన సంస్థలు ఇక్కడ నుంచి సర్వీసులు ప్రారంభించాయి. మరికొన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దడానికి మాత్రం నేవీ తీరు అడ్డంకిగా మారింది. విమానాశ్రయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా తూర్పు నావికాదళం (నేవీ) అనుమతి తప్పనిసరి. నేవీ అధికారులు సహకరిస్తేనే పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయన్నది సత్యం. కానీ వారి స్పందనే సంతృప్తికరంగా లేదు. అన్నీ ఉన్నా... ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం నుంచి రోజుకి దాదాపు 32 సర్వీసులు కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఒడిశా, చత్తీస్గడ్ రాష్ట్రాల్లోని పలుప్రాంతాలకు చెందిన 3 కోట్ల జనాభాకు ఈ విమానాశ్రయమే ఆధారం. విమానాశ్రయం పరిసరాల్లో దాదాపు 20 మంది ట్రావెల్ ఏజెంట్లున్నారు. వీరి ద్వారా 50 శాతం టికెట్లు బుక్ అవుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయంగా (అప్గ్రేడ్) అభ్యున్నతి సాధించాక ప్రయాణికుల సంఘాల ఒత్తిడి, కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఇక్కడ నుంచి 24 గంటల సేవలకు అనుమతించింది. తొలుత నేవీ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఎయిడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది సంఖ్య 350కి పెంచారు. వారికి విడతల వారీగా శిక్షణ ఇప్పించేందుకు కూడా నేవీ అంగీకరించింది. ఒప్పందం కుదిరి 9 నెలలు దాటుతున్నా ఇప్పటికీ 24 గంటల సేవలు అందుబాటులోకి రాకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆసక్తి చూపుతున్నా... విశాఖ నుంచి విదేశాలకు నేరుగా సర్వీస్లందించేందుకు పలు విమానయాన సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే సింగపూర్కు వారంలో మూడు రోజులు (బుధ, శుక్ర, ఆది) సర్వీస్లు నడుస్తున్నాయి. వచ్చేనెల 23 నుంచి వారానికి నాలుగు రోజులు సింగపూర్ విమానం నడుపుతామని సిల్క్యిర్వేస్ ప్రకటించింది. దుబాయ్కి రోజూ విమానం ఉంది. విశాఖ నుంచి సేవలందించేందుకు తాము సిద్ధమేనని థాయ్ ఎయిర్వేస్ ఇటీవల ప్రకటించింది. ఇందుకు అవసరమైన సర్వే కూడా ఆ సంస్థ చేపట్టింది. ఇటీవల కాలంలో విమానాశ్రయం నుంచి కార్గో రవాణా కూడా అధికమైంది. విదేశీ సంస్థలు ఆసక్తికి ఇది కూడా కొంత కారణం. మరోవైపు హైదరాబాద్ వరకు లేట్నైట్ సర్వీస్లు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పైస్జెట్, ఇండిగో సంస్థలు ముందుకు వచ్చాయి. రాజధాని నుంచి రాత్రి బయల్దేరిన విమానం విశాఖకు అర్ధరాత్రి చేరుకుని తిరిగి తెల్లవారు జామున ఇక్కడ నుంచి బయలుదేరేలా చర్యలు తీసుకుంటే ఎంతోమంది ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుందని ప్రయాణికుల సంఘం ఎప్పటి నుంచో చెబుతున్నాయి. ఇందుకు విమాన సంస్థలు సిద్ధంగా ఉన్నా పరిస్థితులే అనుకూలించడం లేదు. 24 గంటల సేవలకు రాతపత్రాలు సిద్ధమైనా ఇందుకు అనుకూలంగా నేవీ అధికారులు స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెరిగిన రద్దీకి అనుగుణంగా తామూ స్పందిస్తామని గతంలో మాటిచ్చిన నేవీ కేంద్రం అనుమతిచ్చినా తాను మాత్రం మోకాలడ్డుతోంది. ఇప్పటికైనా నేవీ అధికారులు లేట్నైట్ సర్వీసులు, కార్గోరవాణా, వివిధ దేశాల కనెక్టివిటీకి సంబంధించి ఏటీసీ సిబ్బందిని పెంచడం, 24 గంటల సేవలకు అనుమతి వంటి విషయాల్లో తక్షణం స్పందించాలని విశాఖ ఐటీ సెజ్ ఉపాధ్యక్షుడు ఓ.నరేష్కుమార్ కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement