-
అసలు నువ్వు పోలీసువేనా..? నాకెందుకో డౌటు..!
ఆదిలాబాద్: పోలీసు డ్రెస్ వేసుకుని దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు ఓ కేటుగాడు. మండలంలోని కొండుకూర్ గ్రామంలోని హెచ్పీ పెట్రోల్ బంక్లో ఆదివారం అర్ధరాత్రి సెల్ఫోన్ దొంగతనం చేసి, పక్కనే ఉన్న దాబాలో కౌంటర్ వద్దకు వెళ్లాడు. డబ్బుల కోసం వెతుకుతుండగా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వ్యక్తి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లికి చెందిన ఎల్సని రాజు అని గుర్తించారు. ఇరిగేషన్ శాఖలో లస్కర్గా విధులు నిర్వర్తిస్తున్న ఇతను కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గతంలో కరీంనగర్లో స్వామిజీ వేషధారణలో సెల్ఫోన్ చోరీ చేసి, నేనే చేశానని రైల్వే పోలీసులకు లొంగిపోయాడని వివరించారు. కేసు నమోదు చేసుకుని రాజును రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. ఇవి చదవండి: హోలీ పండుగ మిగిల్చిన విషాదం! -
వామ్మో..! చెడ్డీ గ్యాంగ్..! జర జాగ్రత్త..!!
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగల ముఠా సంచారం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చెడ్డీ గ్యాంగ్ను తలపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులు హెచ్చరించారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డిలోని కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాలకు కూత వేటు దూరంలో ఉన్న జయశంకర్ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీధి కుక్కలు అరవడం మొదలు పెట్టాయి. కొందరు కాలనీవాసులు బయటకు వచ్చి చూసినా ఎవరూ కనిపించకపోవడంతో ఇళ్లలోకి వెళ్లిపోయారు. అనుమానంతో ఉదయాన్నే ఇండ్లలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా ఉదయం 3 నుంచి 3.30 ప్రాంతంలో కాలనీలోని శివాలయం, చుట్టూ పక్కల గల్లీలలో ఏడుగురు సభ్యులు గల ఓ దొంగల ముఠా సంచరించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ, రూరల్ పోలీసులు కాలనీవాసులతో మాట్లాడారు. పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని, ఆయా కాలనీల్లో గస్తీ దళాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఏవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వాట్సప్ గ్రూపుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా జయశంకర్ కాలనీకి సమీపంలోని ఓం శాంతి మందిర ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో అదే సమయంలో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని దేవయ్య ఇటీవలే కుటుంబంతో కలిసి ముంబాయికి వెళ్లాడు. దొంగలు తాళం పగులగొట్టి ఇళ్లంతా చిందరవందర చేశారు. ఇంటిని పోలీసులు పరిశీలించారు. కుటుంబం ఇక్కడ లేకపోవడంతో ఎలాంటి వస్తువులు చోరీకి గురియ్యాయో తెలియరాలేదు. ఈ చోరీకి పాల్పడింది కూడా చెడ్డీ గ్యాంగే అని భావిస్తున్నారు. జయశంకర్కాలనీ ప్రాంతంలో సీసీ కెమెరాలు చాలా చోట్ల లేవు. ఉన్న కెమెరాలు సైతం సక్రమంగా పనిచేయడం లేదని, ఏవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుని భద్రత కల్పించాలని కోరుతున్నారు. -
పగలు పూజారి.. రాత్రి పూట చోరీ
పగటి పూట ఆయన పక్కా ఆధ్యాత్మికంగా కనిపిస్తాడు. పెళ్లిళ్లు చేస్తాడు, పెళ్లి సంబంధాలు చూసే పేరయ్యగా వ్యవహరిస్తాడు, అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. రాత్రిళ్లు మాత్రం ఒక్కసారిగా చేతులు దురద పుడతాయి. అంతే, ముసుగు ధరిస్తాడు.. చేతివాటం చూపిస్తాడు. ఇదేదో సినిమా కథలా ఉందనుకుంటున్నారా? కాదు.. మహారాష్ట్రలోని పుణె నగరానికి చెందిన అజయ్ మధుకర్ గైక్వాడ్ నిజజీవిత గాధ. ఇప్పటివరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 25 దోపిడీలు చేసినందుకు అతడిని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. గైక్వాడ్ బుద్ధవిహార్ ప్రాంతంలో కేర్టేకర్గా ఉంటూ మంచి జీవితం గడిపేవాడు. అయితే చెడు సావాసాలు అతడిని చెడగొట్టాయి. పెళ్లిళ్లు చేసేవాడని, చాలామందికి సంబంధాలు కుదిర్చి మంచి పెళ్లిళ్ల పేరయ్యగా కూడా ఉండేవాడని సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుష్మా చవాన్ తెలిపారు. కొంత కాలానికి అతడికి మహ్మద్ ఇక్బాల్ షేక్, మదన్ విరాన్ స్వామి అనే ఇద్దరితో స్నేహం కుదిరింది. వాళ్లిద్దరి మీద ముంబై, థానె పోలీసు కమిషనరేట్లలో పలు కేసులున్నాయి. వాళ్లతో చేరిన గైక్వాడ్.. పగలు తన పని మామూలుగానే చేసుకుంటూ రాత్రిపూట మాత్రం వీళ్లిద్దరితో కలిసి దోపిడీలు చేసేవాడు. పూజారిగా ఉంటూ.. జనానికి పలు సామాజిక, ఆధ్యాత్మిక అంశాలలో సలహాలు కూడా ఇచ్చేవాడు. దాంతో ఎవరికీ అనుమానం రాలేదు. నాలుగైదేళ్ల పాటు ఈ రెండు వ్యవహారాలు ఎంచక్కా జరిగిపోయాయి. సుమారు ఏడాది క్రితం గైక్వాడ్ ఈ దోపిడీలు మానేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర కమీషన్ పద్ధతి మీద ఏజెంటుగా పని చేయడం మొదలుపెట్టాడు. అప్పటినుంచి రైల్వే క్వార్టర్స్ దగ్గర కుటుంబంతో ఉండేవాడు. సుమారు నెలరోజుల క్రితంవేరే దొంగతనం కేసులో పట్టుబడిన షేక్.. ఇతడి పేరును కూడా చెప్పడంతో పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు మొత్తం విషయం బయటపడింది.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జగన్ ప్రభుత్వంలోనే బ్రాహ్మణులకు గుర్తింపు
ముస్లింలపై కూటమి కుట్ర
ఆ ఇంటికి నవరత్నాలే జీవనాధారం
నేడు పిఠాపురానికి సీఎం జగన్
కూటమిలో కుమ్ములాట
ఆర్ట్స్ కళాశాలలో సర్టిఫికెట్ కోర్సులు
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి
ఓటమి భయంతో దాడులకు తెగబడుతున్న టీడీపీ
గాండ్ల, తెలుకుల, దేవతెలుకులకు సముచిత స్థానం
మద్యం అక్రమ రవాణాపై కేసులు
తప్పక చదవండి
- పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
- తూ.గో.లో వ్యాన్ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు
- కుప్పంలో టీడీపీ గూండాయిజం
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- రూ.300 పింఛన్ను రూ.400 చేస్తా
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement