-
తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఫొటోలు
-
శ్రీవారి ఆలయంలో శాస్రోక్తంగా తిరుమంజనం
► సుగంధ పరిమళంతో వైదికంగా శుద్ధి ► గుబాళిస్తున్న శ్రీవారి ఆలయం తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్రోక్తంగా నిర్వహించారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. రేపటి బుధవారం ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఈ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం నిలిపివేశారు. ఆ తర్వాత ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని వైదికంగా ప్రారంభించారు. మహద్వారం మొదలు, ప్రాకారాలు, గోడలు, పైకప్పు, పూజలకు వాడే రాగి, వెండి, బంగారం, ఉత్సవాలకు వాడే వాహనాలు, ఇతర వైదికపరమైన అన్ని వస్తువులు శుద్ధి చేశారు. గర్భాలయంలోని మూలమూర్తి (మూలవిరాట్టు)పై దుమ్ము, దూళి పడకుండా మలైగుడారం ( ప్రత్యేక శ్వేత పట్టు వస్త్రం) కప్పారు. శుద్ధి పూరైన తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంథం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర మిశ్రమ తిరుమంజనాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు శ్రీవారికి కొత్త పరదాలు సమర్పించారు. చివరగా అర్చకులు గర్భాలయ మూలమూర్తిపై కప్పిన వస్త్రాన్ని తొలగించి ఆగమోక్తంగా పూజలు, నైవేద్య కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత ఉదయం 11 గంటల నుంచి భక్తులను శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన ప్రత్యేక వారపు సేవను రద్దు చేశారు. -
అక్టోబర్ 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల : అక్టోబర్ 3వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27వ తేదీన తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే అక్టోబర్ 2వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తున్నట్లు వివరించారు. అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఉన్నతాధికారులు వివరించారు. -
తిరుమల ఆలయంలో తిరుమంజనం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement