-
హోటల్లో నాగుపాము హల్చల్.. భయంతో కస్టమర్ల పరుగులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఓ పాము హల్చల్ చేసింది. తిరుత్తణి బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లోని వంట గదిలోకి 5 అడుగుల పొడవైన పాము ప్రవేశించింది. నాగుపామును గుర్తించిన సిబ్బంది, కస్టమర్లు భయంతో హోటల్ నుంచి బయటకు పరుగులు తీశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హాటల్లోని వంటగదిలో దాక్కున్న పామును పట్టుకున్నారు. అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. చదవండి: వాట్ ఏ గట్స్ బాస్! నీ ఆత్మవిశ్వాసానికి సెల్యూట్! -
పిల్లర్ల మధ్య చిక్కుకున్న చిన్నారి
చెన్నై ,తిరుత్తణి: రెండు స్తంభాల మధ్యలో తల చిక్కుకున్న చిన్నారిని ప్రయాణికులు రక్షించారు. ఈ సంఘటన తిరుత్తణిలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. తిరుత్తణి సమీపంలోని కృష్ణసముద్రం గ్రామానికి చెందిన వేలు కార్మికుడు. అతని భార్య మాలతి, ఐదేళ్ల పాప కృత్తిక సహా గురువారం సాయంత్రం తిరుత్తణి రైల్వే స్టేషన్ చేరుకున్నారు. చెన్నైకు రైల్లో వెళ్లేందుకు రెండవ ప్లాట్ఫాంలో వేచి ఉన్నారు. అక్కడ చిన్నారి ఆడుకుంటోంది. హఠాత్తుగా చిన్నారి తల ఇనుప పిల్లర్ల మధ్యలో చిక్కుకుంది. దీంతో చిన్నారి కేకలు వేసింది. ప్రయాణికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గడ్డపారతో రెండు స్తంభాలను చీల్చి చిన్నారిని క్షేమంగా వెలుపలికి తీశారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు ఊపరి పీల్చుకున్నారు. -
వేధిస్తున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు
పళ్లిపట్టు: నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయాలని వేధిస్తున్నట్లు తొయిదావూర్ దళితులు తిరుత్తణి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తిరుత్తణి తాలూకాలోని తిరువాలాంగాడు మండలం తొయిదావూర్ దళితవాడలో దాదాపు 150 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 300 సంవత్సరాల పురాతన ఆదికుమరేశ్వరర్ ఆలయం దుస్థితికి చేరుకుని శిథిలావస్థలో ఉండేది. ఆ ఆలయాన్ని కొంత మంది మరమ్మతులు చేపట్టి దీపం వెలిగించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ ఆలయంలో విలువైన ఆభరణాలు ఉన్నందునే కొందరు పథకం ప్రకారం ఆలయాన్ని తమ చేతుల మీదకు తీసుకుని ఆలయానికి సమీపంలోని వున్న దళితుల ఇళ్లు కూల్చేందుకు కుట్ర పన్ని వేధిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తిరుత్తణిలోని ఆర్డీవో కార్యాలయం చేరుకున్న దళిత కుటుంబాలవారు తమ నివాస ప్రాంతాలను తొలగించేందుకు కొందరు ఆలయం పేరిట కుట్ర చేస్తున్నట్లు ఆలయంలోని విలువైన ఆభరణాలు దోపిడీ చేసేందుకు వీలుగా కుట్ర చేస్తున్నట్లు ఆరోపిస్తూ ఆర్డీవో విమల్రాజ్కు ఫిర్యాదు చేశారు. దళితుల ఫిర్యాదు స్వీకరించిన ఆర్డీవో తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
తిరుత్తణి స్వామివారికి టీటీడీ సారె
– ఈవో, తిరుమల జేఈవో దంపతులచే సమర్పణ తిరుపతి అర్బన్: ఆడికృత్తిక ఉత్సవాలను పురస్కరించుకుని తమిళనాడులోని తిరుత్తణి పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ వళ్లీ–దేవసేన సమేత సుబ్రమణ్య స్వామివారికి టీటీడీ తరఫున సారె సమర్పించారు. ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు దంపతులు, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు దంపతులు గురువారం తిరుపతి నుంచి బయల్దేరి పట్టు వస్త్రాలు, సారెతో తిరుత్తణికి చేరుకున్నారు. తిరుత్తణి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. టీటీడీ పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ సుబ్రమణ్య స్వామివారికి సమర్పించారు. తిరుత్తణి ఆలయ అర్చకులు టీటీడీ పట్టు వస్త్రాలు, సారెను స్వామివార్లకు అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో సాంబశివరావు మాట్లాడుతూ ఆడికృత్తిక సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీ సుబ్రమణ్య స్వామివారి ఆలయానికి టీటీడీ నుంచి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తమిళనాడుకు చెందిన భక్తులే కాకుండా, సరిహద్దు జిల్లాల భక్తులు కూడా కావడులతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారని పేర్కొన్నారు. -
తిరుత్తణిలో వికలాంగుల దినోత్సవం
తిరుత్తణి, న్యూస్లైన్: తిరుత్తణిలోని మురుగప్ప నగర్లో ఉన్న రాస్ స్వచ్ఛంద సంస్థ మానసిక వికలాంగుల స్పెషల్ స్కూల్లో ప్రపంచ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. తిరుత్తణి గోల్డన్ టవర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ హరికుమార్ శర్మ అధ్యక్షతలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ వెంకట సుబ్బు పాల్గొని వికలాంగ విద్యార్థులకు కౌన్సిలింగ్ జరిపారు. తర్వాత విద్యార్థులకు లయన్స్ క్లబ్ తరపున సిల్వర్ ప్లేట్లు, బిస్కెట్లు, పెన్సిల్ బాక్సులు, చాపలు అందించారు.లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు ఉదయశంకర్, జిల్లా మాజీ విద్యాశాఖ ప్రధాన అధికారి వెంకటశేషు, లయ న్స్ క్లబ్ కార్యదర్శి విశ్వనాథన్, ఉపాధ్యక్షులు గౌతంచంద్, టీడీ రంగనాథన్, ఉప కార్యదర్శి గిరిష్కుమార్, డెరైక్టర్లు మనోహర పాండ్యన్, మునికృష్ణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ మునస్వామి నాయుడు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement