-
స్వామి సేవలో పెరుమాళ్ పల్లె
‘పెరుమాళ్’ అంటే తమిళంలో శ్రీవేంకటేశ్వర స్వామి అని అర్థం. దిగవూరుకు చెందిన వందలాది కుటుంబాలు మహంతుల కాలం నుంచి తిరుమల ఆలయంలో సేవ చేశాయి. నిరంతరం పెరుమాళ్ సేవలో తరించిన దిగవూరు గ్రామం కాలానుగుణంగా ‘పెరుమాళ్’ పల్లెగా రూపాంతరం చెందింది. తిరుపతి నుంచి చంద్రగిరి మార్గంలో10 కి .మీ. దూరంలో తిరుమల శేషాచల కొండ కింద ఈ పల్లె ఉంది. 1843 నుంచి 1933 వరకు ఆలయ పాలనను ఉత్తరాదికి చెందిన హథీరాం మఠం మహంతులే పర్యవేక్షించారు. అప్పట్లో ఆయా పర్వదినాల్లో నిత్యపూజలు, ఆలయ ఆదాయపు లెక్కలు, పండుగలు ఎప్పుడు వస్తాయి, ఉత్సవాలు ఎప్పుడు నిర్వహించాలి, ఎంతమంది సేవకులు, పనివాళ్లు అవసరం... అన్న విషయాలను మఠం పాలనాధికారులే నిర్ణయించేవారు. నాటి దిగవూరు నేటి ‘పెరుమాళ్’పల్లె తిరుమలలో మౌలిక వసతులు ఏమీ లేనప్పటికీ మహంతుల పిలుపు మేరకు తిరుపతి, దిగవూరు లాంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తొలిజాములోనే కాలినడకన తిరుమలకు చేరి, ఆలయ పనుల్లో భాగస్వాములయ్యేవారు. వీరిలో దిగవూరు గ్రామస్థులే కీలకంగా మారారు. వారితో మహంతులకు అవినాభావ సంబంధం ఏర్పడింది. వారి స్వామి సేవకు చిహ్నంగా దిగవూరును పెరుమాళ్పల్లెగా మార్పు చేశారు మహంతులు. మహంతులు ఏర్పడిన 1843 నుంచి 1933లో టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడేవరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. నాటి నుంచి అనేక రకాలు సేవలు చేసిన వీరు కాలక్రమంలో ఆలయ ఉద్యోగులుగా మారారు. పెరుమాళ్పల్లెకు కూతవేటు దూరంలోని తొండవాడకు చెందిన ఐఏఎస్ అధికారి ఎం.చంద్రమౌళిరెడ్డి 1969లో టీటీడీ ఈవోగా నియమితులయ్యారు. అప్పటి వరకు రోజువారి కూలీలుగా పనిచేసే పెరుమాళ్ వాసులకు అవగాహన కల్పించి ఉద్యోగులుగా చేరాలని సూచన చేయటంతో వారు దేవస్థానం ఉద్యోగులుగా మారారు. నాటి నుంచి నేటికీ వందల కుటుంబాలు ఆలయ ఉత్సవాలను మోసే వాహన బేరర్లు, ఇతర విభాగాల సిబ్బందిగా పనిచేస్తున్నారు. నాడు దమ్మిడీ, అణాలు, రూకలు సంపాదించేవీరు ప్రస్తుత టీటీడీ ఉద్యోగులుగా రూ.30 వేల వరకు జీత భత్యాలు పొందే స్థాయిలో ఉన్నారు. పెరుమాళ్పల్లె వాసులతో ప్రత్యేక సైన్యం వెంకటగిరి సంస్థానం, శ్రీకాళహస్తి పాలెగాళ్లకు హథీరాంజీ మఠం పాలకులు అప్పటి సామాజిక పరిస్థితుల్లో కప్పంగా అనధికార చెల్లింపులు చేసేవారు. గత రికార్డుల ప్రకారం హథీరాం మఠం పాలకులు పాలెగాళ్లకు వందల రూకలు, స్వర్ణనాణాలు అప్పుగానూ, అనధికారికంగానూ చెల్లింపులు చేసినట్టు తెలుస్తోంది. పాలెగాళ్ల దర్పం తగ్గుతున్న సమయంలో హథీరాం మఠం పాలకులు సొంతంగా పెరుమాళ్లపల్లె వాసులు, చుట్టూ గ్రామాలకు చెందిన జనంతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సైన్యానికి మఠంలోని బైరాగులే నాయకత్వం వహించినట్టు రికార్డులు చెబుతున్నాయి. తిరుమలలో చిరు వ్యాపారాలు ఇక, పెరుమాళ్లపల్లెతోపాటు నరసింగాపురం, మిట్టపాళెం, చంద్రగిరి, నాగపట్ల రిజర్వుప్రాంతంలోని గ్రామాల ప్రజలు పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, మజ్జిగ, కూరగాయలు, పప్పుదినుసులు, తినుబండారాలు, రాగి, సజ్జ,జొన్నరొట్టెలు, చెక్కల బెల్లంగా పిలిచే నల్లబెల్లంతో తయారు చేసిన శెనక్కాయ తీపి పదార్థాలను తిరుమలకు తీసుకొచ్చి వ్యాపారాలు సాగించే వారు. స్వామివారితో వీరి అనుబంధం నేటికీ అలానే కొనసాగుతోంది. మా భుజాలపై స్వామి వాహనాలను మోసే భాగ్యం... దేవదేవుడైన స్వామినే భుజాలపై మోసే భాగ్యం దక్కటం మా పూర్వజన్మ సుకృతం. తిరుమలకు ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల నుంచే మా గ్రామస్తులు స్వామి సేవ చేశారు. మా పెద్దల ఉద్యోగ విరమణతో ఇతర విభాగాల దేవస్థానం ఉద్యోగులు మాతోపాటు స్వామి సేవలో భాగస్వాము లయ్యారు. 1991లో ఆలయంలో రంగనాయక మండపం నుంచి అద్దాల మండపం వరకు బరువులు మోయడంతో స్వామి వాహన సేవలు మోసే వాహన బేరర్గా మారాను. అప్పటి నుంచి స్వామి సేవలో ఉంటున్నాను. అందుకు ఆనందంగా ఉంది. - మధుసూధన్రెడ్డి, పెరుమాళ్పల్లె -
తిరుమలకు తప్పిన నీటిగండం
బ్రహ్మోత్సవాలకు సమస్య లేనట్టే సాక్షి, తిరుమల: వచ్చే నెలాఖరులో నిర్వహించనున్న తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు నీటి సమస్య తొలగింది. వారం రోజులుగా తిరుమల శేషాచల అడవుల్లో కురిసిన వర్షాల వల్ల జలాశయాల్లోకి నీరు చేరుతోంది. తెలుగు గంగనుంచి వచ్చే సరఫరా, బోర్లలో లభించే నీరు దీనికి అదనం. ప్రస్తుతం లభ్యమయ్యే నీరు వంద రోజులకు సరిపోతుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. మొన్నటి వరకూ నీటి లభ్యతపై ఆందోళనగా ఉన్న టీటీడీకి ప్రస్తుత వర్షాలు ఊరటనిచ్చాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నీటి గండం ఎలా అధిగమించాలో తెలియక టీటీడీ అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వరుణుడు కరుణించడంతో వారం రోజులుగా తిరుమల శేషాచల అడవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జలాశయాల్లోకి వర్షపు నీరు చేరింది. గోగర్భం డ్యాంలో 151 లక్షల గ్యాలన్లు, పాపవినాశనంలో 790 లక్షల గ్యాలన్లు, కుమారధారలో 580 లక్షల గ్యాలన్లు, పసుపుధారలో 232 లక్షల గ్యాలన్ల నీరు చేరింది. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తులు కిటకిటలాడారు. సాయంత్రం 6 గంటల వరకు 29,382 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండి ఉన్నారు. వెలుపల కిలోమీటరు వరకు వేచిఉన్నారు. వీరికి 24 గంటల తర్వాత దర్శనం లభించనుంది. కాలిబాట భక్తులకు 16 గంటలు, రూ. 300 టికెట్ల దర్శన భక్తులకు 8 గంటల తర్వాత దర్శనం లభించనుంది. రద్దీ పెరగటంతో గదుల కోసం భక్తులు పడిగాపులు కాచారు. నాలుగు గంటల పాటు వేచిఉన్నా తలనీలాలు తీయడం ఆలస్యం కావడంతో జీఎన్సీ వద్దున్న కల్యాణకట్టలో భక్తులు ఆగ్రహంతో గేటు విరిచారు. హుండీలో గురువారం భక్తులు సమర్పించిన కానుకల్ని శుక్రవారం లెక్కించగా రూ. 3.23 కోట్లు లభించింది. -
అరుదైన జీవజాలం అంతరిస్తోంది!
- ఎర్రచందనం స్మగ్లర్లతో నేలకూలుతున్న వృక్షాలు - పోలీసుల దారి మళ్లించేందుకు అడవికి నిప్పు - శేషాచలంలో దెబ్బతింటున్న జీవ వైవిధ్యం సాక్షి, తిరుమల : ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలతో తిరుమల శేషాచల అడవిలోని అరుదైన వృక్ష, జంతు, జీవజాలం కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నిత్యం వందలాది మంది ఎర్రచందనం కూలీలు అడవుల్లో చొరబడుతూ చెట్లను ఇష్టానుసారంగా నరికేస్తూ జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నారు. శేషాచల ఏడుకొండలు తూర్పు కనుమల్లో భాగమై చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో 4756 చ.కి.మీ విస్తీర్ణంలో వ్యాపించాయి. ఈ అడవులు తిరుమల కొండల్లో మొదలై కర్నూలు జిల్లాలోని కుందేరు నది వరకు ఉన్నాయి. జీవ వైవిధ్యం ఎక్కువగా ఉండడంతో జాతీయ స్థాయిలో 1989లో శేషాచలాన్ని శ్రీవేంకటేశ్వర అభయారణ్యంగా ప్రకటించారు. అనంతరం 2010 సెప్టెంబర్ 20వ తేదీన అంతర్జాతీయ స్థాయిలో ‘శేషాచల బయోస్పియర్ రిజర్వు’గా భారత పర్యావరణ మరియు అటవీ శాఖ ప్రకటించింది. అప్పటి నుంచి ఇక్కడి అరుదైన భౌగోళిక, ఆధ్యాత్మిక, ప్రకృతి సంపదను పరిరక్షిస్తోంది. తిరుపతిలో బయోస్పియర్ ల్యాబ్ స్థాపించి జీవ వైవిధ్య పరిశోధనలకు శ్రీకారం చుట్టింది.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..
కుందనపు బొమ్మలా ప్రియాంకా జైన్ ఫొటోలు
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
పిఠాపురం: సీఎం జగన్ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
చీరలో ప్రేమలు బ్యూటీ హుయలు
వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
జగన్ కి ఓటు వేస్తే ఇంటింటి అభివృద్ధి, కూటమికి ఓటు వేస్తే పథకాలు ముగింపు
గ్లామర్తోనే 'హార్ట్ ఎటాక్' ! అదా శర్మ' అరుదైన ఫోటోలు
మదర్స్ డే స్పెషల్: మీ అమ్మని ఇలా సర్ ప్రైజ్ చేయండి..!
తప్పక చదవండి
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- ‘ఫోర్లు, సిక్స్లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement