-
47 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని కోరాం: టీఎన్జీవో
హైదరాబాద్: ఉద్యోగులకు 47 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు టీఎన్జీవో తెలిపింది. అలాగే ఏపీఎన్జీవోలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మధ్యంతర భృతిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సబ్ కమిటీ చెప్పినట్టు పేర్కొంది. అయితే ఏపీఎన్జీవో, టీఎన్జీవోలను విడివిడిగా చర్చలకు పిలవమని టీఎన్జీవో సూచించింది. కాగా, మధ్యంతర భృతిపై చర్చించేందుకు... ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. మంత్రి మండలి ఉప సంఘం ఈ సాయంత్రం సచివాలయంలో సమావేశమైంది. -
దసరాకు 45% ఐఆర్: టీఎన్జీవోల సంఘం
సాక్షి, హైదరాబాద్: పదో వేతన సంఘం(పీఆర్సీ) నివేదిక రావడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో.. ఈ ఏడాది జూలై 1 నుంచి అమలయ్యే విధంగా దసరాకు కనీసం 45 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) పి.కె.మహంతిని కలిసి వినతిపత్రం సమర్పించింది. ప్రతినిధి బృందంలో వేణుగోపాల్, ఉపేందర్రెడ్డి, జగదీశ్వర్, బుచ్చిరెడ్డి, రేచల్, విజయలక్ష్మి, సత్తెమ్మ, వనజ, శైలజ, రంగరాజు, హీమీద్ తదితరులు ఉన్నారు. అనంతరం దేవీప్రసాద్, రవీందర్రెడ్డి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సంవత్సరం జూలై 1 నుంచి పదో పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ నివేదికే అందలేదన్నారు. ఈ జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం 45 శాతం ఐఆర్ను వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేశామని, అందుకు సీఎస్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్లో ఉద్యమించక తప్పదని వారు హెచ్చరించారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని వారు కోరారు. అంతకుముందు టీఎన్జీవో భవన్లో టీఎన్జీవో కార్యవర్గ సమావేశం జరిగింది. టీఎన్జీవో కార్యవర్గ సమావేశం తీర్మానాలివీ.. కేంద్ర ప్రభుత్వం వెంటనే హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలి. శీతాకాల సమావేశాలకు ముందుగానే పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచి బిల్లుకు ఆమోదముద్ర వేయించాలి. ఈ నెల 30న హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ స్వాభిమాన సదస్సు జయప్రదానికి కృషి చేయాలి. ఉద్యోగులు పెద్దఎత్తున కదిలిరావాలి. సదస్సును విజయవంతం చేయడానికి వీలుగా అన్ని జిల్లాల్లో టీఎన్జీవో సదస్సులు నిర్వహించాలి. ప్రత్యేక రాష్ట్రం వల్ల ఒనగూడే ప్రయోజనాలను వివరించాలి. సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించాలి. ఉద్యోగుల మీద బనాయించిన కేసులను ఎత్తివేయాలి. సమైక్యాంధ్ర సమ్మె సందర్భంగా తెలంగాణ అధికారులు, ఉద్యోగులపై దాడులు చేయడం అమానుషం. వారికి పూర్తి భద్రత కల్పించాలి. సమ్మె కొనసాగినంత కాలం వారిని హైదరాబాద్కు బదిలీ చేయాలి. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఏపీఎన్జీవోలు ప్రస్తావించిన సమస్యలన్నీ పరిష్కరించదగినవే. ఏపీఎన్జీవోలు సమ్మె విరమించి విభజనకు సహకరించాలి. సభ సందర్భంగా తెలంగాణవాదులు, విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. జూలై 30 తర్వాత పలు శాఖల్లో టీ-అధికారుల్ని వివక్షకు గురిచేస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయాల్ని పునఃపరిశీలించాలి. హైదరాబాద్ను యూటీగా ప్రకటించాలని కొందరు చేస్తున్న కుట్రకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Viral Video: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్పై ప్రిన్సిపాల్ దాడి
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
తప్పక చదవండి
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
Advertisement