-
సాయంత్రం వరకే..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంటు ఎన్నికల్లో కీలకమైన ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార కార్యక్రమానికి తెరపడినట్టే. పోలింగ్కు 48 గంటల ముందు నుంచి సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్న ఎన్నికల కమిషన్ నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి. స్థానికేతరులు ఎవరూ నియోజకవర్గంలో సంచరించకూడదు. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు, బల్క్ ఎస్ఎంఎస్లు పంపకూడదు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఐదుగురు వ్యక్తులకు మించి పోలీస్స్టేషన్ల పరిధిలో సంచరించకూడదని ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రచార ఘట్టం దాదాపుగా ముగిసినట్టే. కరీంనగర్ ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రావీణ్య, పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి శ్రీదేవసేన ఆయా నియోజకవర్గాలకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశమై ఈ మేరకు ఎన్నికల సంఘం నిబంధనలను వివరించారు. ఎన్నికల కమిషనర్ రజత్కుమార్ సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. విస్తృతంగా సాగిన టీఆర్ఎస్ ప్రచారం గత నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, ఆరోజు నుంచే మొదలైన నామినేషన్ల ప్రకియ 25వ తేదీ వరకు సాగింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచారం ఉధృతంగా సాగింది. అధికార టీఆర్ఎస్ అభ్యర్థులుగా కరీంనగర్లో బోయినిపల్లి వినోద్కుమార్, పెద్దపల్లిలో బోర్లకుంట వెంకటేశ్ నేతకాని పదిహేను రోజులపాటు విస్తృత ప్రచారం సాగించారు. వీరికి మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ ఇన్చార్జిలుగా సంపూర్ణ సహకారం అందించగా, ఎమ్మెల్యేలు అంతా తామై వ్యవహరించారు. అభ్యర్థి హాజరు కాకపోయినా, పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రతిరోజు రాత్రి వరకు ప్రచారం సాగేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఎమ్మెల్యేలు కవర్ చేయగా, అభ్యర్థులు ఎంపిక చేసిన ప్రాంతాలలో ప్రచార సభల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రెండు స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేసీఆర్ రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొనగా, కేటీఆర్ కరీంనగర్, సిరిసిల్లలో రెండురోజులు పర్యటించారు. పనిలో పనిగా కాంగ్రెస్, బీజేపీల నుంచి ముఖ్యమైన నాయకులను పార్టీలో చేర్పించే కార్యక్రమాన్ని విస్తృతంగా సాగించారు. పెద్దపల్లికి చెందిన బీజేపీ సీనియర్ నేత మీస అర్జున రావు, ఆపార్టీ ముఖ్య నాయకులు సోమవారం కాంగ్రెస్లో చేరడం గమనార్హం. ఒడిదొడుకుల్లోనూ... కాంగ్రెస్, బీజేపీ పోరాటం టీఆర్ఎస్ దెబ్బకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కుదేలైపోయిన కాంగ్రెస్, బీజేపీ తమకున్న పార్టీ యంత్రాంగంతో ప్రచార పర్వంలో ఉనికిని చాటుకున్నాయి. కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను చుట్టి వచ్చారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సహకారంతో ఆయన తనకున్న పాత పరిచయాలతో పార్లమెంటు స్థానం పరిధిలో విస్తృత ప్రచారం సాగించారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ హిందుత్వ ఎజెండాను ప్రధాన ఆయుధంగా మార్చుకొని యువత, విద్యార్థులు టార్గెట్గా ప్రచారం నిర్వహించారు. కరీంనగర్లో నిర్వహించిన భారీ బహిరంగసభ విజయవంతం కావడం ఆయనకు ఊపిరినిచ్చింది. కరీంనగర్ మినహా మిగతా ఆరు అసెంబ్లీల్లో ఓటుబ్యాంకును పెంచుకునే లక్ష్యంతో ఆయన ప్రచారం సాగించారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థి ఎ.చంద్రశేఖర్కు పార్టీలోనే తగిన సహకారం రాలేదు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు మినహా ఆయనకు పూర్తిస్థాయిలో సహకరించిన నాయకులే కనిపించలేదు. విజయశాంతి, కోదండరాం తదితరులు వచ్చినా రాహుల్గాంధీ వంటి హేమాహేమీలు రాకపోవడం లోటుగా నిలిచింది. బీజేపీ అభ్యర్థి ఎస్.కుమార్ తనకున్న సంబంధాలతో ప్రచారం సాగించారు. మద్యం దుకాణాలు మూసివేత లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ జరిగే 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అంటే 48 గంటలపాటు యధావిధిగా మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. జిల్లాలో ఆల్కాహాల్ సంబంధమైన పానీయాలను విక్రయించే రిటైల్ మద్యం దుకాణాలతోపాటు బార్లు కూడా మూసివేయాల్సిందే. మద్యం నిల్వ ఉంచుకుంటే సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. -
నేటితో ముగియనున్న పీజీఈసెట్ కౌన్సెలింగ్
జేఎన్టీయూ: ఎంటెక్ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీపీజీఈసెట్–2017 సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారంతో ముగియనుంది. గేట్లో అర్హత సాధించిన విద్యార్థులకు శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తారు. ఇప్పటిదాకా జేఎన్టీయూ(అనంతపురం) హెల్ప్లైన్ సెంటర్లో 2,034 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ ప్రొఫెసర్ విజయ్కుమార్ తెలిపారు. -
రెండు రోజులేనా?
సుభాష్నగర్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫసల్బీమా యోజన గడువు నేటితో ముగియనుంది. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూలై 31తోనే గడువు ముగిసింది. అయితే, లక్ష్యం 50 శాతం కూడా పూర్తి కాకపోవడంతో గడువు పొడిగించాల్సి వచ్చింది. ఆగస్టు 2 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండ్రోజుల పెంపుతో పెద్దగా లాభం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రుణమాఫీ నిధులు మంజూరు కాక, రుణాల రీషెడ్యూల్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రెండ్రోజుల గడువు పొడిగింపు సరిపోదని, మరింత గడువు పొడిగించాలని అన్నదాతులు కోరుతున్నారు. రైతుకు దన్నుగా నిలవాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను ప్రవేశపెటటింది. పంట బీమాతో పాటు రైతుల వ్యక్తిగత, కుటుంబసభ్యులతో పాటు వ్యవసాయ యంత్రాలకు బీమా సౌకర్యం కల్పించింది. పైలట్ ప్రాజెక్ట్గా జిల్లాను ఎంపిక చేసింది. అయితే, ఈ పథకంపై రైతులకు అవగాహన లేకపోవడం, బీమా కంపెనీల అలసత్వం, వ్యవసాయ శాఖ అధికారుల అలసత్వం, బ్యాంకర్ల నిర్లక్ష్యం వల్ల పథకం నీరుగారుతోంది. జిల్లాలో సుమారు 4.25 లక్షల మంది రైతులు ఉన్నారు. అందులో దాదాపు 3.79 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందారు. ఇప్పటివరకు 1.90 లక్షల మంది రైతులకు చెందిన రూ.900 కోట్ల పంట రుణాలను రెన్యూవల్ చేసినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్కు రూ.1950 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించింది. దాదాపు 50 శాతం పంట రుణాలు రెన్యూవల్ అయ్యాయని లీడ్బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు చెప్పారు. అయితే, పంట రుణాలు 50 శాతం వరకు రెన్యూవల్ అయినా, ఫసల్ బీమా పథకంలో మాత్రం చేరేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. గత నెల చివరి వారంలో కలెక్టర్ యోగితారాణా బ్యాంకర్లతో సమీక్షించగా, అప్పటివరకు కేవలం 1,441 మందికి మాత్రమే ఫసల్ బీమా పథకంలో అవకాశం కల్పించినట్లు చెప్పారు. తాజాగా అది 50 శాతం వరకు చేరిందని చెబుతుండడం గమనార్హం. ఫసల్ బీమా యోజన అమలులో కొంత ఇబ్బంది నెలకొందని లీడ్బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఒక్కో రైతు పేరిట డీడీలు తీయడం వల్ల ఇబ్బంది తలెత్తుతుందన్నారు. గ్రామం లేదా బ్యాంక్ యూనిట్గా రైతులు బీమా చేయించుకుంటే వారందరిని కలిపి ఒకే డీడీ తీస్తున్నామని, దాని వల్ల రైతుల వివరాలు తెలియాలంటే ఇంకా కొంత సమయం పడుతుందన్నారు. బ్యాంకర్లు రైతులకు వీలైనన్ని రుణాలిచ్చి పంటల బీమాకు ప్రీమియం చెల్లించాలని ఆయన సూచించారు. రెండు నెలల కాలంలో రైతులను బీమా పథకంలో చేర్చని అధికారులు, బ్యాంకర్లు.. రెండ్రోజుల గడువులో ఏం చేస్తారని రైతులు పేర్కొంటున్నారు. మరింత గడువు పెంచడంతో పాటు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తేనే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement