-
బంద్ విజయవంతం చేయండి
అనంతపురం : ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రుల ప్రకటనలు, ముఖ్యమంత్రి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈనెల 10న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్రబంద్ను జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి విజయవంతం చేయాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయి రెండున్నరేళ్లవుతున్నా నేటికీ చంద్రబాబు ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిన్నటి రోజున కేంద్ర మంత్రుల ప్రకటనలతో చంద్రబాబు మాటలన్నీ ఉత్తివేనని తేలిపోయిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని నిన్నటి వరకు ఆశలు పెట్టుకున్న కోట్లాది ప్రజల గుండెల్లో గుణపాలు చెక్కేలా కేంద్రం ప్రకటన చేసిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఈరోజు నీటిమూటలు చేశారని ధ్వజమెత్తారు. వెంకయ్యనాయుడు బొంకయ్యనాయుడులా మారారని ఎద్దేవా చేశారు. రాజ్యసభలో పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని చెప్పిన ఆయన ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తేకుండా కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బయట పడేందుకు కేంద్రం వద్ద సాగిలపడ్డారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్సీపీ ముందు నుంచీ పోరాడుతోందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంతవరకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పోరాటాలు చేస్తామన్నారు. బంద్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
రేపటి బంద్ను జయప్రదం చేయాలి
ప్రతి ఒక్కరూ సహకరించాలి ప్రత్యేక హోదాపై దగాకు నిరసన తెలపాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు పిలుపు కాకినాడలో పార్టీ జిల్లా కమిటీ అత్యవసర సమావేశం కాకినాడ : ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను మరోసారి దగా చేసిన తెలుగుదేశం, బీజేపీల తీరుకు నిరసనగా.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 2వ తేదీన నిర్వహించనున్న రాష్ట్రబంద్ను.. జిల్లాలో విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. బంద్ను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ సహా వామపక్షాలను కలుపుకుని వెళ్తామని చెప్పారు. బంద్ పిలుపు నేపథ్యంలో స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆదివారం జరిగిన వైఎస్సార్ సీపీ జిల్లా అత్యవసర సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, సీజీసీ సభ్యులు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. బంద్ విజయవంతం చేసే అంశంపై సమీక్షించారు. అమలాపురం, రాజమండ్రి, కాకినాడతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా పార్టీ నాయకులు ఎక్కడికక్కడ కాంగ్రెస్, వామపక్ష నేతలతో మాట్లాడి వారి మద్దతుతో బంద్ను విజయవంతం చేయాలని తీర్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కన్నబాబు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వద్ద తన పరపతిని కాపాడుకోవడానికి, కేసుల నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ప్రత్యేక హోదాపై తెలుగుదేశం, బీజేపీలు ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని పార్లమెంటులో బీజేపీ తాజాగా చెప్పినా.. గట్టిగా అడగలేని స్థితిలో రాష్ట్ర సర్కారు ఉందని మండిపడ్డారు. ఒకప్పుడు ప్రత్యేక హోదా కోసం ప్రగల్భాలు పలికిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు మాట తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒకవైపు టీడీపీ నేతలు బీజేపీపై నిందలు వేస్తూ కేంద్రంలో కొనసాగుతున్నారని.. రాష్ట్రంలో టీడీపీని తిడుతూ బీజేపీ మంత్రి పదవులు అనుభవిస్తోందని, ఇదంతా ఎవరిని మభ్యపెట్టడానికి కన్నబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారానే రెవెన్యూ లోటు భర్తీతో పాటు ప్రత్యేక గ్రాంట్లు, పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ, గుంటూరుల్లో దీక్షలతోపాటు అనేక ఉద్యమాలు చేశారన్నారు. రాజకీయ అవసరాల కోసం కాకుండా తెలుగు జాతి భవిష్యత్తు కోసం, ఐదు కోట్ల ఆంధ్రుల కోసం తమ పార్టీ ఉద్యమానికి సన్నద్ధమవుతోందన్నారు. బంద్ను అణచివేసేందుకు టీడీపీ సర్కారు ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామన్నారు. అరెస్టులు, నిర్బంధాలకు భయపడేది లేదన్నారు. సోమవారం అన్ని పట్టణ, మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. మంగళవారం బంద్ పాటిస్తామన్నారు. కలిసివచ్చే అందరినీ కలుపుకొని.. మంగళవారంనాటి బంద్కు అన్ని వర్గాలూ సహకరించాలని కన్నబాబు విజ్ఞప్తి చేశారు. ఉద్యమానికి కలిసివచ్చే రాజకీయ పార్టీలు, వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థలు, ఉద్యోగ సంఘాలు సహా అందరినీ భాగస్వాముల్ని చేసి ఉద్యమిస్తామన్నారు. ఆర్టీసీ బస్సులను కూడా నిలుపు చేస్తామన్నారు. అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఇస్తామని చెప్పారు. వైఎస్ విగ్రహం తొలగింపు కుట్రపూరితం విజయవాడలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని చంద్రబాబు సర్కారు కుట్రపూరితంగా తొలగించిందని సమావేశంలో పార్టీ నేతలు మండిపడ్డారు. విగ్రహం తొలగింపును సమావేశం తీవ్రంగా ఖండించింది. విగ్రహాలను తొలగించగలరు కానీ ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్సార్ను చెరపలేరని బోస్, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు అన్నారు. చంద్రబాబు సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని అందుకే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, వేగుళ్ల లీలాకృష్ణ, తోట సుబ్బారావునాయుడు, పితాని బాలకృష్ణ, గిరజాల బాబు, ముత్యాల శ్రీనివాస్, పర్వత ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, వట్టికూటి సూర్యచంద్ర రాజశేఖర్, కర్రి నారాయణరావు, గుత్తుల సాయి, రావు చిన్నారావు, లింగం రవి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగిన సింహాద్రి, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్వీజేఆర్ కుమార్, యువజన విభాగం, మైనార్టీ సెల్, రైతు, బీసీ, విద్యార్థి సంఘాల అధ్యక్షులు అనంత ఉదయ భాస్కర్, అబ్దుల్ బషీరుద్దీన్, జిన్నూరి వెంకటేశ్వరరావు, మట్టపర్తి మురళీకృష్ణ, జక్కంపూడి కిరణ్, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అత్తిలి సీతారామస్వామి, సఖినేటిపల్లి, మామిడికుదురు కన్వీనర్లు జిల్లేళ్ల బిన్ని సుధాకర్, బొరిశెట్టి భగవాన్, పార్టీ నాయకులు ఎండీ ఆరీఫ్, గొలిశెట్టి భగవాన్ పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా కోసం రేపు ప్రజాబంద్
కాకినాడ సిటీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం, రాష్ట్రంలోని పాలక పార్టీలు బీజేపి, టీడీపిలు అవలంబిస్తున్న ధోరణిని నిరసిస్తూ మంగళవారం ప్రజాబంద్కు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. స్థానిక సుందరయ్యభవన్లో ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషబాబ్జి సంయుక్తంగా ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 2వ తేదీన జరిగే రాష్ట్ర బంద్కు జిల్లాలో ఉన్న అన్ని వాణిజ్య, వ్యాపార వర్గాలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ, కార్మిక, కర్షకులు, ప్రజలు, ప్రజాసంఘాలు సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలోనూ, తరువాత ఇచ్చిన హామీలను పక్కనపెట్టి పాలకపార్టీలు రాష్ట్ర ప్రజలను దగా చేశారని విమర్శించారు. గతంలో నేరుగా కేబినేట్ తీర్మానంతో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారని, ఎక్కడా చట్టం చేయలేదని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు వచ్చేసరికి కుంటిసాకులు చెబుతున్నారన్నారు. ఆవిషయం విభజన చట్టంలో పొందుపరచ లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ తెలుగుదేశం, బీజేపీ దొంగనాటకాలు ఆడుతున్నాయన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమానికి కలిసిరావాలని, అన్ని పక్షాలను కలుపుకుని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి కేంద్రంపై తీవ్ర వత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సీపీఎం కాకినాడ నగర కార్యదర్శి పలివెల వీరబాబు, సీపీఐ కాకినాడ నగర, రూరల్ కార్యదర్శులు తోకల ప్రసాద్, నక్కా కిషోర్ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement