-
టూరుగల్లు
జాలువారే జలపాతాలు.. అబ్బుర పరిచే శిల్పకళా సంపద.. పచ్చని అటవీ ప్రాంతం.. ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు.. కాకతీయుల కాలం నాటి చారిత్రక కట్టడాలు ఉమ్మడి ఓరుగల్లు సొంతం. చారిత్రక, వారసత్వ నేపథ్యం ఉన్న వరంగల్ జిల్లా పర్యాటక ప్రాంతంగా శోభిల్లుతోంది. ఇక్కడి పర్యాటక ప్రాంతాలు దేశీయులనే కాదు.. విదేశీయులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని అలరారుతున్నాయి. ఆహ్లాదాన్ని, అనందాన్ని పంచుతున్న సుందరమైన దృశ్యాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లాలో వేయిస్తంభాల దేవా యలం, భద్రకాళి ఆలయం, వరంగల్ కోట, వనవిజ్ఞా న్, కాజీపేట దర్గా, ఫాతిమా, మడికొండలోని మెట్టుగుట్ట, ఐనవోలు మల్లన్న దేవాలయం పర్యాటకులు ఆకట్టుకుంటున్నాయి. వేయిస్తంభాల దేవాలయం శిల్పకళా తోరణాలు అత్యద్భుతం. వరంగల్ కోటలోని తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో పాకాల సరస్సు ప్రకృతి రమణీయతను పంచుతోంది. అన్నారం షరీఫ్ దర్గాను కుల మతాలకు అతీతంగా దర్శిస్తున్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యాటక ప్రాంతంగా అలారారుతోంది. గణపురం కోటగుళ్లు, కాకతీయుల కాలంలో చక్కని కళా సంపదతో నిర్మించిన రామప్ప దేవాల యం, పాండవుల గుట్టలు, మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలు, తాడ్వాయి, ఏటూరునాగారం, మహాదేవ్పూర్ అటవీ అందాలు, దామెరవాయి ఆది మానవుల గుహలు, బొగత జలపాతం, మల్లూరు దేవా లయం, మైలారం గుహలు పర్యాటకులు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పాండవుల గుట్టల్లో రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్కు అనుకూలంగా ఉన్నాయి. లక్నవరంలోని వేలాడే వంతెన ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. మహబూబాబాద్ జిల్లాలో కురవి, అనంతారంలోని దేవాలయాలు, మాటేడు ఆలయాలు, భీమునిపాదం వద్ద జలపాతం, బయ్యారం చెరువు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. జనగామ జిల్లాలో ఖిలాషాపురంలోని సర్వాయి పాపన్న కోట, జఫర్గఢ్ కోట, పాలకుర్తిలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పర్యాటకులను ఆకరిస్తున్నాయి. కోటి మొక్కులు... మేడారం జాతర పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఒక్క మేడారం జాతర కారణంగానే పర్యాటక రంగంలో ఉమ్మడి వరంగల్ జిల్లా హైదరాబాద్ను మించిపోతోంది. రెండేళ్లకోసారి జరిగే జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే సగటున ప్రతి జాతరకూ కోటి మంది వస్తున్నారు. ఇలా వచ్చి పోయే భక్తులు మార్గమధ్యలో లక్నవరం, రామప్ప, ఖిలావరంగల్ వంటి చారిత్రక ప్రాంతాలను పర్యటిస్తున్నారు. జాతర జరిగే ఏడాది పర్యాటకుల సంఖ్య రెండు కోట్లకు చేరుతోంది. జాతర లేని ఏడాదిలో ఈ సంఖ్య పదిహేను లక్షల దగ్గర ఉంటోంది. దీంతో పాటు కాళేశ్వరం జయశంకర్ జిల్లాలో కలవడంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు పెరిగారు. అంకెల్లో... ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని పర్యాటకులను అకర్షిస్తోంది. వరంగల్ ఫోర్ట్, వేయిస్తంభాలు, భద్రకాళి ఆలయాలు, రామప్ప, లక్నవరం సరస్సు, బొగత జలపాతం, పాం డవులగుట్ట, కోటగుళ్లు, మేడారం సమ్మక్క–సారలమ్మ వన దేవతలను సందర్శించేందుకు దేశ, విదేశీయులు భారీ సంఖ్యలో వస్తున్నారు. మేడారం జాతర జరిగే ఏడాది పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2015లో దేశీయ పర్యాటకులు 98,09,162 మంది రాగా, విదేశీ పర్యాటకులు 1,794 మంది వచ్చారు. 2016లో 2,62,31,497 మంది దేశీయ పర్యాటకులు రాగా, 1,987 మంది విదేశీ పర్యాటకులు వచ్చారు. ఇందులో కోటి మంది వరకు మేడా రం జాతరకు వచ్చిన వారుంటారు. 2017 నవంబర్ మాసం వరకు 23,45,460 మంది దేశీయ పర్యాటకులు రాగా, 1,237 మంది విదేశీ పర్యాటకులు వచ్చారు. వంతెనలతో.. కాళేశ్వరం, ఏటూరునాగారం వద్ద గోదావరిపై కొత్తగా వంతెనలు నిర్మాణం జరగడంతో పర్యాటక రంగం పుంజుకుంది. వరంగల్, హైదరాబాద్ వాసులకు దగ్గరి దారి అందుబాటులోకి వచ్చినట్లయింది. ఫలితంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు బొగత, లక్నవరం వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఇటీవల మల్లూరుకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా వెంకటాపురం మండలంలో మరో జలపాతం, పాండవులగుట్ట రాక్ క్లైంబింగ్, తాడ్వాయి అడ్వెంచర్ టూర్, ఏకో టూరిజంను పర్యాటక శాఖ ప్రమోట్ చేస్తోంది. -
అమరావతికి పర్యాటక శోభ
విజయవాడ: అమరావతి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోనుంది. నూతన రాజధానికి అమరావతి పేరు పెట్టిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నారు. బౌద్ధుల పుణ్యక్షేత్రంగా పేరున్నా, ప్రాచీన అమరేశ్వరాలయం ఉన్నా ఇప్పటివరకూ గ్రామం అభివృద్ధి చెందలేదు. బౌద్ధమత చరిత్ర, అమరేశ్వరాలయం ప్రాశస్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల కేంద్ర ప్రభుత్వం దీనికి పర్యాటక ప్రాధాన్యత కల్పించింది. అందులో భాగంగా రెండు కేంద్ర ప్రభుత్వ పథకాలకు అమరావతిని ఎంపిక చేసింది. వీటి ద్వారా సుమారు రూ.70 కోట్లను గ్రామాభివృద్ధికి వినియోగించనున్నారు. హ్రిదయ్ (హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన) పథకం కింద దేశంలోని 12 హెరిటేజ్ నగరాల్లో ఒకటిగా కేంద్రం అమరావతిని కొద్దిరోజుల క్రితం ఎంపిక చేసింది. గ్రామ ప్రాచీనతను కాపాడేందుకు, మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఈ పథకం కింద కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూ.22.26 కోట్లు కేటాయించింది. కేంద్ర పర్యాటక శాఖ అమలు చేస్తున్న ప్రసాద్ (పిలిగ్రిమేజ్ రిజువెనేషన్ అండ్ స్ప్రిట్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్) పథకానికీ అమరావతి ఎంపికైంది. దీని కింద రూ.47 కోట్లు మంజూరయ్యే అవకాశం ఉంది. హ్రిదయ్’ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇందుకు ప్రతిపాదనలు రూపొందించింది. గ్రామంలోని పర్యాటక ప్రదేశాలైన అమరేశ్వరాలయం నుంచి ధ్యాన బుద్ధ ప్రాజెక్టుల వరకు సులభంగా వెళ్లేందుకు కరకట్టను విస్తరించి రోడ్డు వేసేందుకు ప్రతిపాదించారు. భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు, ప్రధాన రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. బుద్ధిస్టు మ్యూజియం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు, మహాచైత్యం (స్థూపం) ప్రాంతాన్ని ఆకర్షణీయంగా మార్చడానికి, బౌద్ధారామాలు, కాటేజీలు నిర్మించేందుకు డిజైన్లు సిద్ధం చేశారు. ఏపీ టూరిజం శాఖ కాటేజీలు, పార్కులు ఏర్పాటుచేసే యోచనలో ఉంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అమరావతి రూపురేఖల్ని మార్చడమే లక్ష్యంగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
No Headline
స్ట్రాంగ్రూమ్కు పోస్టల్ బ్యాలెట్లు
గిజబలో సంచరిస్తున్న ఏనుగులు
పరారీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత రెడ్డి..
అబ్రాడ్కు వెళ్లిపోయిన రజనీకాంత్
శుక్రవారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2024
రైతుల పక్షాన పోరాటం సాగిస్తాం..
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
ఉపాధి కూలీల ఆర్థిక పురోగతికి సహకరించాలి
ఇంటర్ సప్ల్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement