-
వీధి కుక్క మృతి.. కాలనీలో వెలసిన పోస్టర్లు
తిరువనంతపురం: మానవుడికి జంతువులకు మధ్య విడదీయరాని బంధం ఉంటుంది. విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న శునకానికి ఆదరణ మిగతావాటికన్నా ఎక్కువే. చాలా మంది వాటిని పేరు పెట్టి పిలుస్తూ సాకుతారు. వాటికి క్యూట్ క్యూట్ పేర్లు పెట్టి ముద్దాడుతుంటారు. అలాంటి ఓ కుక్క ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా కేరళలో ఓ వీధి వీదంతా విషాదంలో మునిగింది. ఆ వీధిలోని వ్యాపారులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఆ కుక్క పేరుతో కాలనీలో పోస్టర్లు వేసి నివాళులర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలయ్యాయి. ఈ విశేష ఘటన కేరళలోని పథానంతిట్ట జిల్లా మనక్కాల పట్టణంలో జరిగింది. పట్టణంలోని కాలేజ్ జంక్షన్ ప్రాంతంలో ఒక పంచాయతీ వారు ఒక కుక్కను వదిలివెళ్లారు. దీంతో స్థానికులు ఆ కుక్కకు తిండిపెట్టి ఆదరించారు. దానికి రేమణి అని పేరు కూడా పెట్టారు. కాలనీవాసులు ఆహారం అందిస్తుండడంతో రేమణి కాలనీకి, దుకాణాలకు కాపలాగా నిలవడం మొదలుపెట్టింది. దాని అరుపులకు ఆ ప్రాంతంలోకి అపరిచితులు వెళ్లాలంటే హడలిపోయేవారు. కాలనీవాసులు ఎవరైనా రాత్రిళ్లు ఆలస్యంగా వస్తే వారికి తోడుగా రేమణి వచ్చేదని టైర్ల వ్యాపారం నిర్వహించే ప్రదీప్ తెలిపారు. అయితే గతవారం వేగంగా వెళ్తున్న రెండు వాహనాల మధ్య రేమణి పరుగెత్తడంతో ప్రమాదానికి గురై మృతి చెందింది. రేమణి మృతితో ఆ కాలనీ షాక్కు గురైంది. ముఖ్యంగా దుకాణదారులు, వ్యాపారులు రేమణి మృతిని తట్టుకోలేకపోయారు. తమ వ్యాపారాలకు రక్షణగా నిలిచిన రేమణిని గుర్తు చేసుకుంటున్నారు. వియ్ లవ్ యూ.. మిస్ యూ.. రిప్ టు రేమణి అంటూ సోషల్ మీడియాలోనూ కామెంట్లు చేస్తున్నారు. -
అమ్మకు అశ్రునివాళి
► అమ్మ మరణంతో మూగబోయిన పల్లెలు ► శోక సముద్రంలో ప్రజలు ► వెల్ల్లివిరిసిన అభిమానం ► షాపులను స్వచ్ఛందంగా మూసివేసి వ్యాపారుల నివాళి గుమ్మిడిపూండి: రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణవార్త విని అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. 75 రోజులుగా అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత త్వరగా కోలుకుని పాలనా పగ్గాలు చేపట్టాలని వివిధ మతాల వారు ప్రత్యేక పూ జలు, ప్రార్థనలు చేశారు. అరుుతే జయలలిత ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా దిగ్భాంతికి గురయ్యారు. ఈ వార్తను టీవీలో చూసి అనేక మంది అమ్మ అభిమానులు గుండెపోటుతో మృతిచెందారు. సోమవారం సాయంత్రం నుంచే బస్సులు, వ్యాపారసంస్థలు, ఆటోలు, పెట్రోల్ బంకులు మూసివేయడంతో జనం ఇబ్బందులు పడ్డారు. అమ్మ మరణ వార్త తెలిసిన వెంటనే గుమ్మిడిపూండి, ఆరంబాక్కం, మాదరపాక్కం, పాదిరివేడు, కవరపేట, ఆరణి గ్రామాల్లో అమ్మ మృతికి సంతాపంగా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి అమ్మపై ప్రేమను చాటుకున్నారు. అన్ని షాపులు, హోటల్స్, బస్సులు నిలిపివేయడంతో రోడ్లన్నీ బోసిపొయారుు, జనం అమ్మ గురించి ప్రసారమవుతున్న వార్తలను చూస్త్తూ ఇళ్లకే పరిమితమయ్యారు. గుమ్మిడిపూండి జైహింద్ నగర్లోని డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో అమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. యూనియన్ కార్యదర్శి మణిబాలన్ అమ్మ ఫొటోకు మాలవేశారు. అలాగే స్థానిక నెహ్రూనగర్లోని తెలుగువారు జయలలిత ఫొటోకు నివాళులర్పించి ఆమె అత్మకు శాంతి కలగాలని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలుగువారి కోసం అమ్మ చేపట్టిన సంక్షేమ పథకాలు గుర్తుచేసుకున్నారు. అలాగే 38 వార్డు మాజీ కౌన్సిలర్ ఎస్.సంతానం బజారువీధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరం వద్ద అమ్మ ఫొటోకు మాలవేసి దీపాలు వెలిగించారు. నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థారుుగా నిలిచారని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఎక్క డ చూసినాఅమ్మకు నివాళులర్పించి ఆమె ఆ త్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. ఆంధ్ర సరిహద్దు గ్రామం తడ వద్ద ప్రత్యేక పోలీసు బలగాలు తమిళనాడులోకి వచ్చే వాహనాలను విసృ్తతంగా తనిఖీ చేసి పంపుతున్నారు. కాగా అమ్మ మరణవార్తతో ప్రజలు విషాదంలో మునిగిపోయారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: సజ్జల
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement