-
35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం
కోటా: రాజస్తాన్కు చెందిన సుజీత్ స్వామి అనే ఇంజనీర్ రైల్వే నుంచి తనకు రావాల్సిన 35 రూపాయలను ఐదేళ్ల పాటు పోరాడి మరీ సాధించుకున్నాడు! ఆ క్రమంలో దేశవ్యాప్తంగా మరో 3 లక్షల మందికీ లబ్ధి చేకూర్చాడు. 2017 జూలై 2న కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆ ఏడాది ఏప్రిల్లో స్వామి టికెట్ బుక్ చేసుకున్నాడు. తర్వాత దాన్ని రద్దు చేసుకున్నాడు. క్యాన్సలేషన్లో భాగంగా 35 రూపాయల సర్వీస్ చార్జిని కూడా టికెట్ డబ్బుల్లోంచి రైల్వే శాఖ మినహాయించుకుంది. అదేమంటే జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిందన్న బదులు వచ్చింది. జూలై 1కి ముందే రద్దు చేసుకున్న టికెట్పై సర్వీస్ చార్జి ఎలా వసూలు చేస్తారంటూ ఆయన న్యాయ పోరాటానికి దిగాడు. ఆర్టీఐ కింద ఏకంగా 50 దరఖాస్తులు పెట్టడంతో పాటు నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలపై లేఖలు రాశాడు. వరుస ట్వీట్లు చేశాడు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను, జీఎస్టీ కౌన్సిల్ను టాగ్ చేశాడు. ఎట్టకేలకు సర్వీస్ చార్జీ మొత్తాన్ని వెనక్కిస్తామంటూ రైల్వే శాఖ 2019లో దిగొచ్చింది. కానీ రౌండాఫ్ పేరుతో 33 రూపాయలే రీఫండ్ చేసింది. దాంతో మిగతా 2 రూపాయల కోసం కూడా పట్టుబట్టిన స్వామి, మూడేళ్ల పోరాటంతో వాటినీ సాధించాడు! 2017 జూన్ 2కు ముందు టికెట్లు రద్దు చేసుకున్న 2.98 లక్షల మందికీ రూ.35 సర్వీస్ చార్జి రిఫండ్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. -
నేను ఆ తప్పు చేయలేదు!
టికెట్ చూపించమని అడిగినందుకు రైల్వే సెక్యూరిటీ గార్డుపై దాడిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్వీర్ సంధూ తాజాగా కోర్టు విచారణకు హాజరయింది. సెంట్రల్ లండన్కు సమీపంలోని స్లౌఘ్ పట్టణంలో నివాసముంటున్న ఆమె తాను ఏ తప్పు చేయలేదని, ఆత్మరక్షణ కోసమే సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకున్నానని రీడింగ్ క్రౌన్ కోర్టుకు వాంగ్మూలమిచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 7న స్లౌఘ్ రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ గార్డు, టికెట్ కండక్టర్తో దురుసుగా వ్యవహరించి జాతివివక్ష పూరితమైన వ్యాఖ్యలు చేసినట్టు సంధూ ఆరోపణలు ఎదుర్కొంటున్నది. టికెట్ చూపించాలని అడిగినందుకు 'కోతి' అని దూషించి నానా దుర్భాషలాడినట్టు ఆమెపై పోలీసులు అభియోగాలు మోపారు. టికెట్ లేదని ఆమెను సెక్యూరిటీ గార్డు నిలిపివేయడంతో ఈ గొడవ జరిగింది. అయితే, 25 ఏళ్ల సంధూ వద్ద సీజన్ టికెట్ ఉన్నట్టు తర్వాత సెక్యూరిటీ గార్డు, కండక్టర్ గుర్తించారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో తమపై సంధూ చేయిచేసుకున్నదని, నానా దుర్భాషలాడుతూ, జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ రభస సృష్టించిందని సెక్యూరిటీ గార్డు బ్రాండన్ థాంప్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, తనపై అతడు చేసిన అభియోగాలను సంధూ పూర్తిగా తిరస్కరించింది. తాను అతనిని ఉద్దేశించి జాతివివక్ష వ్యాఖ్యలు చేయలేదని, అతడే తనపై దాడికి దిగాడని, దీంతో ఆత్మరక్షణ కోసమే చేయి చేసుకున్నానని స్పష్టం చేసింది. తనపై సెక్యూరిటీ గార్డు దాడి చేశాడని, ఈ కేసులో తానే బాధితురాలనంటూ మొదట సంధునే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఇరువర్గాలవారి తరఫు లాయర్ల వాదనలు విన్న క్రౌన్ కోర్టు కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement