-
ప్రభుత్వ బోధనా వైద్యులకు రవాణా భత్యం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు రవాణా భత్యం (టీఏ) ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించి సీఎం కేసీఆర్ ఆమోదం తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోధన వైద్యులకు టీఏ ఇవ్వాలని నిర్ణయించినా ఇప్పటివరకు అమలు కాలేదు. తాజాగా దాన్ని అమలుచేసేందుకు సర్కారు ముందుకు వచ్చింది. దీంతో హైదరాబాద్లోని బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 1,361 మందికి, జిల్లాల్లో పనిచేస్తున్న 755 మందికి మొత్తంగా 2,116 మంది వైద్యులకు టీఏ అందనుంది. హైదరాబాద్లో పనిచేసే వైద్యులకు నెలకు రూ.800, మిగిలిన ప్రాంతాల వారికి రూ.400 చొప్పున టీఏ చెల్లించనున్నారు. టీఏ కోసం నెలకు రూ.1.66 కోట్లు అదనంగా అందజేయడంతో పాటు 2009 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు అర్హులైన ఆయా వైద్యులకు ఎరియర్స్ కింద బకాయిలు చెల్లిస్తారు. బకాయిల కింద రూ.14.19 కోట్లు అందనున్నాయి. -
బ్యాంకర్ల నిర్లక్ష్యం
విద్యార్థుల పేరుపై ఖాతాలు తెరిచేందుకు విముఖత రోజూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న విద్యార్థులు అకౌంట్లు లేక అందని రవాణా భత్యం అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వం మంజూరు చేస్తున్న రవాణా భత్యం పొందడానికి గ్రామీణ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు వస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం రవాణా ఖర్చును అందజేస్తోంది. గతంలో ఈ మొత్తాన్ని ఎస్ఎంసీ ఖాతాల్లో జమ చేయగా, ప్రధానోపాధ్యాయులు డ్రా చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేసేవారు. అయితే ఇందులో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్ చర్యలు తీసుకున్నారు. రవాణా మొత్తం నేరుగా విద్యార్థికి అందేలా వారిపేరుపై బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలని హెచ్ఎంలను ఆదేశించారు. పిల్లలతో బ్యాంకు ఖాతాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలనే ఆదేశాలను చాలా మంది హెచ్ఎంలు పట్టించుకోలేదు. ఎస్ఎస్ఏ అధికారుల ఒత్తిడితో సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు చొరవ తీసుకుని విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని పిలుచుకుని బ్యాంకు వెళ్తే వారు ఖాతాలు తెరిచేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు సీఆర్పీ సుధారాణి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఝాన్సీ గురువారం ఉదయం 15 విద్యార్థులను వెంటబెట్టుకొని చెన్నేకొత్తపల్లిలోని కెనరా బ్యాంకుకు వచ్చారు. ఖాతాలు ప్రారంభించాలని బ్యాంకు సిబ్బందిని కోరగా వారు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశారు. చివరకు ఇప్పుడు కుదరదు.. నెల, లేదా మూన్నెల్ల తర్వాత వస్తే పరిశీలిస్తామని సిబ్బంది సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని లీడ్ బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా విద్యార్థుల ఖాతాలు మాత్రం ఓపెన్ కాలేదు. ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. అందని రవాణా భత్యం.. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి 7737 మంది పిల్లలకు రవాణా భత్యం రూ. 2.29 కోట్లు మార్చి 18న ప్రభుత్వం మంజూరు చేసింది. కలెక్టర్ ఆమోదముద్ర కూడా వేశారు. అయితే విద్యార్థుల పేరిట ఖాతాలు తెరవడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. 7,737 మంది విద్యార్థులకు గాను ఇప్పటి వరకూ 4,152 మంది మాత్రమే ఖాతాలు తెరిచారు. మిగిలిన 3,585 మందికి బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో రవాణా భత్యం అందలేదు. మార్చిలో వచ్చిన బడ్జెట్ బ్యాంకులో మూలుగుతోంది. ఇప్పట్లో విద్యార్థులకు అందేలా లేదు. ఇప్పటికైనా విద్యార్థుల ఖాతాలు తెరిచేలా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయాలని పిల్లల తల్లిదండ్రులు, హెచ్ఎంలు కలెక్టర్ను కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement