-
ఢిల్లీ చేరుకున్న అరుణ్ జైట్లీ
-
వైద్యంలో ఒరవడి
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో వైద్య రంగం సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నదని ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. అత్యాధునిక వైద్యాన్ని ప్రజల ముంగిటకు తీసుకెళ్లడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసినట్టు వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటుపరంగా అవయవదానాల్లో, మార్పిడి శస్త్ర చికిత్సల్లో దూసుకెళుతున్నామన్నారు. గ్లోబల్ హెల్త్ సిటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీఐ అండ్ హెచ్పీబీ సర్జరీస్ ఆధ్వర్యంలో శనివారం చెన్నైలో గ్లోబల్ గ్యాస్ట్రో అప్ డేట్స్ అనే అంశంపై అవగాహన సదస్సు ప్రారంభమైంది. రెండు రోజల పాటు సాగనున్న ఈ సదస్సుకు తొలి రోజు ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఇలాంటి సదస్సులు వైద్య రంగంలో సరికొత్త మెళుకువలకు, నాణ్యత పెంపునకు దోహద పడతాయని వివరించారు. గ్లోబల్ హెల్త్ సిటీలో శస్త్ర చికిత్సల పరంగా సమష్టిగా వైద్య నిపుణులు ముందుకు సాగుతున్నారని పేర్కొంటూ, సమష్టిగా పనిచేయడం ద్వారా అవయవమార్పిడి శస్త్ర చికిత్సలను మరింతగా ముందుకు దూసుకెళ్లడానికి వీలుందన్నారు. ఇక్కడ సాగుతున్న వీడియో లెక్చర్ను చూస్తుంటే, ఒక్కో శస్త్ర చికిత్స ఒక్కో విధంగా ఉన్నాయని వివరిస్తూ, ఇలాంటివి యువ, జూనియర్ డాక్టర్లకు అవగాహనా పరంగా అనుభవాన్ని నేర్పుతాయని వ్యాఖ్యానించారు. వైద్యపరంగా మేధాసంపతిని మరింత పెంచుకోవడంతో పాటు, మెరుగైన వైద్యాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళదామని పిలుపునిచ్చారు. గ్లోబల్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ కే రవీంద్రనాథ్ మాట్లాడుతూ దక్షిణ భారతంలోని దాదాపుగా రెండు వందల యాభై మందికి పైగా వైద్యులు ఈ సదస్సుకు హాజరు అయ్యారని పేర్కొన్నారు. అన్న వాహిక, పెద్ద ప్రేగు, ఉదర కోశ, కాలేయ సంబంధిత రోగాలు, చేపట్టిన శస్త్ర చికిత్సల గురించి వీడియో లెక్చర్ అందిస్తున్నామని, అలాగే, అత్యాధునిక వైద్య పరికరాలను గురించి వివరించడం జరుగుతున్నన్నారు. ఉబకాయం కాలేయ క్యాన్సర్ తదితర వ్యాధులకు ఆధునికతతో సాగుతున్న కీ హోల్ సర్జరీ గురించి తెలియజేస్తామని తెలిపారు. తమ హెల్త్ సిటీలో అవయవమార్పిడి శస్త్ర చికిత్సల వేగం పెరిగాయని గుర్తు చేస్తూ, ఈ సదస్సు ద్వారా ముప్పై ఐదు రకాల శస్త్ర చికిత్సల గురించి వివరించనున్నామన్నారు. గ్లోబల్ ఆసుపత్రి ఓ వైద్య విజ్ఞాన సంస్థగా రూపొందుతున్నదని వివరిస్తూ, శస్త్ర చికిత్సల్లోనే కాదు, ప్రత్యేక పరిశోధనలు, బోధనలు, యువ వైద్యులకు ప్రత్యేక శిక్షణతో సరికొత్త విధానాలతో ముందుకు సాగుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సదస్సులో వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మి, డాక్టర్ వైదీశ్వరన్, డాక్టర్ శ్రీకాంత్, ప్రొఫెసర్ మహేష్సుందరం, రవిచంద్రన్ వైద్య విధాన, శస్త్ర చికిత్సల పరంగా ఒక్కో అంశాన్ని విశదీకరించారు. -
విషజ్వరంతో ఒకరి మృతి
సారంగాపూర్ : మండలంలోని పెంబట్ల గ్రామానికి చెందిన కళ్లాళ శంకర్(45) విషజ్వరంతో మంగళవారం మృతిచెందాడు. శంకర్ మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. జగిత్యాలలోని ఓ ప్రై వేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అయినా తగ్గలేదు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మధ్యహ్నం మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement