-
‘శత’క్కొట్టిన విహారి, పృథ్వీ షా
నార్తంప్టన్: ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (131 బంతుల్లో 147; 13 ఫోర్లు, 5 సిక్స్లు) భారీ శతకానికి తోడు యువ సంచలనం పృథ్వీ షా (90 బంతుల్లో 102; 16 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో ముక్కోణపు వన్డే సిరీస్లో భారత ‘ఎ’ జట్టు 203 పరుగలతో వెస్టిండీస్ ‘ఎ’పై గెలిచింది. ఈ ఇద్దరు శతకాలతో కదం తొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 354 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం వెస్టిండీస్ 37.4 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ 4, చహర్ 2 వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. రిషభ్ పంత్ (5), శ్రేయస్ అయ్యర్ (0) నిరాశ పర్చడంతో 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ పృథ్వీ షాతో జతకట్టిన విహారి విండీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు. అలవోకగా బౌండరీలు బాదుతూ భాగస్వామ్యాన్ని పెంచుతూ పోయాడు. వీరిద్దరు మూడో వికెట్కు 160 పరుగులు జోడించారు. ఆ తర్వాత పృథ్వీ ఔటైనా మిడిలార్డర్తో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన విహారి జట్టుకు భారీ స్కోరు అందించి ఇన్నింగ్స్ చివరి బంతికి వెనుదిరిగాడు. విండీస్ బౌలర్లలో చెమర్ హోల్డర్కు 3 వికెట్లు దక్కాయి. భారీ లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ భారత బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి లక్ష్యంలో సగం పరుగులైనా చేయకుండానే ఆలౌటైంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట గెలిచిన భారత్ ‘ఎ’ సోమవారం జరిగే టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్ ‘ఎ’తో తలపడనుంది. -
ఫైనల్లో వెస్టిండీస్
► ముక్కోణపు వన్డే టోర్నీ ► ఆఖరి లీగ్లో దక్షిణాఫ్రికాపై విజయం ► డారెన్ బ్రేవో సెంచరీ బ్రిడ్జిటౌన్: సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు వన్డే టోర్నీలో వెస్టిండీస్ ఫైనల్కు చేరింది. రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన చివరి లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ 100 పరుగులతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటిం గ్ చేసిన వెస్టిండీస్ 49.5 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటయింది. డారెన్ బ్రేవో (103 బంతుల్లో 102; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్ను... బ్రేవో, పొలార్డ్ (71 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఐదో వికెట్కు 156 పరుగులు జోడించి ఆదుకున్నారు. హోల్డర్ (46 బంతుల్లో 40; 3 ఫోర్లు; 2 సిక్సర్లు), బ్రాత్వైట్ (42 బంతు ల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. రబడ, మోరిస్లకు మూడేసి వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా జట్టు 46 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటయింది. బెహర్డీన్ (57 బంతు ల్లో 35; 4 ఫోర్లు), మోర్కెల్ (47 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) మినహా ఎవరూ కుదురుగా ఆడలేదు. విండీస్ బౌలర్లలో గాబ్రియెల్ (3/17), నరైన్ (3/28) రాణించారు. నేడు (ఆదివారం) జరిగే ఫైనల్లో వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement