-
వారు స్త్రీలు మాత్రమే కాదు!
దేశం నివ్వెరపోయింది. ఆ మహిళ దేహం మీద నిర్భీతిగా, నిర్లజ్జగా, నిస్సంకోచంగా పాకిన ఆ మగ చేతిని చూసి ప్రజానీకం నిస్సహాయ క్రోధంతో వణికిపోతున్నారు. మణిపుర కుకీ గిరిజన తెగకి చెందిన ముగ్గురు క్రిస్టియన్ మహిళలను నగ్నంగా మార్చి, ఊరేగించి, అందులో ఒకరిని అత్యాచారం చేసిన ఘటన తాలూకు వీడియో ఇపుడు దేశంలో అనేకమందిని కలవరానికి లోను చేస్తోంది. సోషల్ మీడియా అందరికీ అందు బాటులోకి వచ్చాక స్త్రీలను, దళిత, గిరిజనులను వివస్త్రలను చేసి చితక బాదడం, చంపడం వంటి వీడియోలు అడపాదడపా వైరల్ అవుతూ ఉన్నాయి. నచ్చిన దుస్తులు వేసుకోవడం, నచ్చిన చోట్లకి వెళ్ళడం, నచ్చిన వారితో కలిసి గడపడం, ఇష్టమైన ఆహారం తినడం తప్పుగా మారి పోయాయి. ప్రేమలు, పరువులు, చేతబడుల వంక బెట్టి వారి శరీరాలను దారుణంగా హింసించడం – వీటన్నిటికీ పీడిత వర్గాల పట్ల సమాజానికి ఉన్న తక్కువ భావనే తక్షణ కారణం అయి ఉండొచ్చు. కానీ చాలా సందర్భాల్లో వేరే బలమైన కారణాలు ఉంటాయి. గుజరాత్లో ముస్లిం జాతి హనన మారణకాండలో వేలాది స్త్రీలమీద మూకుమ్మడి అత్యాచారాలు చేయడం, ప్రాబల్య కులాల స్త్రీలు కూడా దగ్గరుండి ప్రోత్సహించడం సమీప చరిత్ర. నగ్నదేహాలతో, రోడ్డున దొరికే చిత్తుపాతలు కప్పుకుంటూ ప్రాణాలు కాపాడుకోవడానికి పోలీస్ స్టేషన్లకు పరుగులు పెట్టిన గుజరాత్ ముస్లిం మహిళల గురించి అనేక నివేదికలు తెలియజెప్పాయి. ఇప్పుడు మణిపురలో జరుగుతున్నది సారంలో గుజరాత్కి భిన్నం కాదు. అక్కడ ముస్లింలు అయితే ఇక్కడ గిరిజన క్రిస్టియన్లు. ఇటువంటి సందర్భాలకి ప్రతిస్పందించే విషయంలో మనం చాలాసార్లు చేసే పొరపాటు – బాధితులను జండర్కి మాత్రమే కుదించి చూడడం. మణిపుర ఘటన వెనుక మతం, రాజకీయ ప్రయోజ నాలతో పాటు ఆర్థిక అంశాల పాత్ర తిరుగులేనిది. కులమైనా, మతమైనా, దేశమైనా– సమాజంలోని ఏ ప్రధానమైన అంశంలోనయినా బలమైన వర్గం బలహీన వర్గంపై దాడి చేయాలంటే అందుకు అనువుగా దొరికేది ముందుగా స్త్రీలు. వారి ద్వారా ప్రత్యర్థి వర్గం మీద పైచేయి సాధించడం ఆటవిక సమాజాల స్వభావం. అదిప్ప టికీ సాగుతూనే ఉంది. అయితే ఏ స్త్రీలు ప్రధానంగా బాధితులు అన్నది గ్రహించడం చాలా ముఖ్యం. పై మహిళల విషయానికి వస్తే వారి చుట్టూ కొల్లగొట్టదగిన ఖనిజ సంపదలు ఉన్నాయి కనుక, వారు కుకీ తెగ గిరిజనులు కనుక, వారు క్రిస్టియన్లు కనుక, ఈ అస్తిత్వాలు మైనార్టీ కనుకనే వారి మీద వందలాదిగా తరలి వచ్చి దాడి చేశారు. వందల, వేల గుంపులు కూడి సాగించే దాడులలో ప్రధానంగా కులమో, మతమో, వర్గమో, దేశభక్తో ఉండి తీరుతుంది. ఆయా కక్షలు తీర్చుకోవడానికి స్త్రీలను వాహికలుగా ఉపయోగించుకుంటారు. ఈ ఘటనలో నగ్నంగా ఊరేగించిన తమ స్త్రీలను కాపాడుకోవడానికి ప్రయత్నించిన ఒక తండ్రిని, అతని కొడుకుని విద్వేషకారులు చంపేయడం చూస్తే అక్కడి మైనార్టీలకి మాత్రమే సంపదలు ఒనగూడుతున్నాయన్న తీవ్ర ద్వేషం కనపడుతుంది. ఇటువంటి ఘటనలలో గుర్తించవలసిన మరొక విషయం – దాడులు సాగించినవారే కాస్త సమయం చూసుకుని తమ ప్రతాపాలను వీడియోల రూపంలో సోషల్ మీడియాకి ఎక్కించడం. మూకుమ్మడిగా దాడి చేయడం వల్ల తమ ఉనికి తెలీదన్న ధీమా, తప్పొప్పుల విచక్షణ ఏ కోశానా లేకపోవడం, కులం, మతం, వర్గం, స్థానిక ప్రభుత్వాల దన్ను తమకు ఉంటుందన్న అహం ఆణువణువూ నిండిపోవడం, పై పెచ్చు ఇవన్నీ విజయ సంకేతాలుగా భావించడం – యథా రాజా తథా ప్రజ. ప్రభుత్వం ఈ వీడియోను అన్ని మాధ్యమాల నుంచి తొలగించే పని సత్వరం చేయడానికి కారణం ప్రజల భావోద్వేగాల పట్ల అక్కర కొద్దీ కాదు... ఎన్నికల ముందు తటస్థులను దూరం చేసుకోకూడదన్న విజ్ఞత వల్ల మాత్రమే! ఇక మెల్లిగా ‘ఉరిశిక్ష రాగం’ గొంతు సవరిస్తోంది. ఆ మహిళలకు న్యాయం జరగాలంటే ఉరిశిక్ష వేస్తామని ఒక పెద్దాయన సెలవిచ్చాడు. మరి వందల మందికి, ఆ మహిళలని మూకకి అప్పగించి చూస్తూ నిలబడిన పోలీసులకి ఉరితాళ్ళు సిద్ధం చేస్తున్నారా సారూ! ఈ సారైనా మనం ‘ఉరి’ ఉచ్చులో చిక్కుకోకూడదు. రగిలే గుండెలకీ, భయంతో వణికే మనసుకీ అటువంటి శిక్ష కాస్త సాంత్వననూ, ధైర్యాన్నీ ఇవ్వొచ్చు. అక్కడికి దుష్ట శిక్షణ జరిగిందని ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ మన బాధ్యత అక్కడితో తీరేది కాదు. అందరూ ప్రభుత్వాలతో తలపడే ఆచరణలోకి దిగలేకపోవచ్చు. కనీసంగానైనా మనమేం చేయాలి? లోకపు రీతుల పట్ల మనం ఏర్పరుచుకునే అవగాహన, భవిష్యత్ నాయకుల ఎంపికకు మార్గాన్ని చూపుతుందని నమ్మాలి. దాడి చేసినవారిలో అనువుగా దొరికిన ఒకరిద్దరిని ఉరితీసి, ప్రజల కోరికని మన్నించిన వీరుల్లా ఛాతీ విరుచుకు నిలబడే అసలు దొంగలను గుర్తించాలి. మణిపురలో కుకీ జాతి హనన మారణకాండకు వెనకుండి అండ దండలు అందించిన శక్తులను ముందుగా మనం గుర్తించాలి. సొంత ప్రజల మధ్యనున్న వర్గ, సామాజిక వైరుద్ధ్యాలను అవకాశవాదంతో పక్కన పెట్టి, సాంస్కృతిక, రాజకీయ భిన్నత్వపు సౌందర్యాన్ని ధ్వంసం చేసి, ‘జాతీయ’ రహదారి మీద ఏకతా యాత్ర చేస్తున్న బుల్డోజర్కి అందరమొక్కటై ఎదురుగా నిలబడాలి. నిలబడదాం రండి! కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త జాతీయ కార్యదర్శి, ప్రరవే -
వైఎస్సార్సీపీనే గెలిపించాలి: పెరికే వరప్రసాదరావు
దళిత క్రైస్తవులకు ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షుని పిలుపు సాక్షి, హైదరాబాద్: దళిత క్రైస్తవులందరూ వైఎస్సార్సీపీకి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు పెరికే వరప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. నీతి, నిజాయితీకి నిలువుటద్దమైన జగన్మోహన్రెడ్డికి పట్టం కట్టి ప్రజాస్వామ్య పాలనకు సహకరించాలని సూచిం చారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని 2009 ఆగస్టు 25న అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందీ ఆయనేనని గుర్తుచేశారు. జెరూసలెం వెళ్లే యాత్రికులకోసం రూ.2 కోట్ల సబ్సిడీని ప్రకటించిన ఘనత వైఎస్దేనన్నారు. రాష్ట్రంలోని దళితులకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లల్లో సమ ప్రాతినిధ్యం కల్పించిన ఘనత కూడా వైఎస్దేనని పేర్కొన్నారు. ప్రస్తుత కీలక తరుణంలో వైఎస్ తనయుడు జగన్మోహన్రెడ్డిని గెలిపించడం ఎంతో అవసరమన్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..
నామినేషన్కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
మీ బిడ్డ పాలనలోనే ఈ గొప్ప మార్పులు: సీఎం జగన్
సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు
ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా
కుమారుడికి తాతగా నటించనున్న బ్రహ్మానందం
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
‘ డిబేట్కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు
కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement