-
ట్రైబల్ సబ్ప్లాన్ పటిష్టంగా అమలు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా, ప్రతి పైసా గిరిజనులకే చేరేలా చూడాలని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీ ఆమోదం పొందకుండా నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేయడాన్ని నియంత్రించాలని కోరారు. తాత్కాలిక సచివాలయంలో బుధవారం ఆమె గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో గిరిజన గురుకుల విద్యా సంస్థలలో ఏర్పాటు చేసిన డిజిటల్, వర్చువల్ క్లాసు రూములపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. హాస్టళ్ల నుంచి స్కూళ్లుగా స్థాయి పెంచిన అన్ని పాఠశాలల భవనాల నిర్మాణానికి కావాల్సిన స్థలాలను గుర్తించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన గురుకుల విద్యాలయాలపై ఆమె సమీక్షించారు. -
టీఎస్పీ అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తాం
నల్లగొండ అర్బన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిజన సబ్ప్లాన్ ద్వారా జరుగుతున్న అభివృద్ధి, తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జిల్లా పర్యటనకు వచ్చినట్లు న్యూఢిల్లీకి చెందిన రీసెర్చ్ పసిపిక్ ఇండియా సంస్థకు చెందిన రీసెర్చ్ డెరైక్టర్ జేమ్స్ వాషింగ్టన్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ‘సాక్షి’తో మాట్లాడారు. తమ సంస్థకు చెందిన ఆపరేటివ్ మేనేజర్ జి.అంకుర్శర్మ, సీనియర్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అనిల్కుమార్, మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ, స్వచ్ఛంద పరిశోధకురాలు డాక్టర్ పి. మాధవిలతో కూడిన బృందం తెలంగాణలోని నల్లగొండ, ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గాను ముందుగా ఆయా రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు టిడి. అరుణ, విద్యాసాగర్లను కలిసినట్లు చెప్పారు. టీఎస్పీ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుపై టెక్నికల్ అసెస్మెంట్ కోసం ప్రపంచ బ్యాంకు ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో తాము పర్యటన సాగిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలో నాలుగు రోజుల పాటు పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి బ్లాక్లో 5 గ్రామపంచాయతీలను సందర్శిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ఆయా పథకాల అమలు తీరు, లబ్ధిదారులు ఏమేరకు ప్రయోజనం పొందారు, అమలు ప్రభావం తీరుతెన్నులపై సమీక్షిస్తామని తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమాధికారి పాండునాయక్, మాడా పీఓ నాగేశ్వర్రావు, దేవరకొండ, మిర్యాలగూడ ఏటీడబ్ల్యూఓలు ప్రభువరణ్, సంజీవరావులతో సమావేశమై రూట్మ్యాప్, జిల్లాలో అమలు చేస్తున్న పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవరకొండ, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో పర్యటనకు బయలుదేరారు.
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Fact Check: చంద్రబాబుకోసమే... రామోజీ నేలబారు రాతలు!
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ
అభివృద్ధి లేదంటూ అసత్య ప్రచారం.. కారణం ఇదే..
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
కిక్కిరిసిన కర్నూల్
డైరెక్ట్గా ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్ష్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
"కూటమి కట్టినా ఓటమి తప్పదు"
చెలరేగిన కోహ్లి, పటిదార్ 60 పరుగులతో బెంగళూరు ఘనవిజయం (ఫొటోలు)
తప్పక చదవండి
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
Advertisement