-
ట్రిపుల్ ట్రీట్: ఒక సినిమా.. మూడింతల ఆనందం
వెండితెరపై తమ అభిమాన హీరో ఒక్క పాత్రలో కనిపిస్తేనే కేకలు, విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తారు అభిమానులు. అదే హీరో ద్విపాత్రాభినయం చేస్తే ఫ్యాన్స్ ఆనందం డబుల్ అవుతుంది. ట్రిపుల్ గెటప్స్లో కనిపిస్తే.. ఫ్యాన్స్ ఆనందం మూడింతలు అవుతుంది. తాజాగా దక్షిణాదిలో ధనుష్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, టొవినో థామస్ వంటి హీరోలు తొలిసారి ట్రిపుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం. కెప్టెన్ మిల్లర్ వైవిధ్యమైన చిత్రాలతో దూసుకెళుతున్నారు హీరో ధనుష్. ప్రస్తుతం అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఆయన పాన్ ఇండియా సినిమా ‘కెప్టెన్ మిల్లర్’ చేస్తున్నారు. 1930–1940 నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ధనుష్ మూడు గెటప్స్లో కని పిస్తారు. ఇప్పటికి రెండు గెటప్స్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ లుక్లో పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, పెద్ద సైజు గన్ను పట్టుకుని చుట్టూ మరణించిన సైనికుల మధ్య యుద్ధ భూమిలో నిల్చుని ఉన్న ధనుష్ లుక్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ధనుష్ చేస్తున్న పాత్రల్లో కెప్టెన్ మిల్లన్ పాత్ర ఒకటి. మిగతా రెండు పాత్రల వివరాలు తెలియాల్సి ఉంది. మామా మశ్చీంద్ర కెరీర్ పారంభం నుంచి వినూత్నమైన, కథా బలమున్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని సొంతం చేసుకున్నారు హీరో సుధీర్ బాబు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మామా మశ్చీంద్ర’. నటుడు, డైరెక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మృణాలినీ రవి, ఈషా రెబ్బా హీరోయిన్లు. ఈ సినిమాలో తొలిసారి మూడు పాత్రల్లో (డీజే, డాన్, దుర్గ) సందడి చేయనున్నారు సుధీర్ బాబు. ఈ మూడు లుక్స్కి సంబంధించిన పోస్టర్లు విడుదలయ్యాయి. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ని ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. కామెడీ, రొమాన్స్, యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రీక్వెల్లో మూడు పాత్రలు.. డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో శ్రీ విష్ణు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సామజ వరగమన’ జూన్ 29న విడుదలై సూపర్ హిట్గా దూసుకెళుతోంది. శ్రీ విష్ణు కెరీర్లో అత్యధిక వసూళ్లు (ఇప్పటికే 40 కోట్లు దాటాయి) సాధించిన చిత్రంగా ‘సామజ వరగమన’ నిలిచింది. ఈ మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న శ్రీ విష్ణు తాను ఓ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘రాజ రాజ చోర’ (2021)తో హిట్ కాంబో అనిపించుకున్న శ్రీ విష్ణు– డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. ఈ మూవీలోనే శ్రీ విష్ణు త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ‘రాజ రాజ చోర’కి ప్రీక్వెల్గా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. -
త్రిపాత్రాభినయంలో సోదరులు
ఒకే కుటుంబంలో సోదరులిద్దరూ ప్రముఖ కథానాయకులుగా రాణించడమే అరుదైన విషయం. ఇక ఈ సోదర ద్వయం ఏక కాలంలో త్రిపాత్రాభినయం చేయడం నిజంగా విశేషమే. యాదృచ్చికమే అయినా నటుడు సూర్య, కార్తీలు తాము నటిస్తున్న తాజా చిత్రాలలో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రాల సంగతేమిటో చూద్దాం. నటుడు సూర్య నటిస్తున్న చిత్రం 24. మలయాళ దర్శకుడు విక్రమ్కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూర్య సొంతంగా తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్ ఇటీవలే విడుదలై పెద్ద హైప్నే క్రియేట్ చేసింది. కాగా ఇందులో సూర్య త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ విషయం గురించి సూర్య తెలుపుతూ ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేయాలన్న ఆసక్తి తనకు లేదన్నారు. అసలు ద్విపాత్రాభినయమే వద్దనుకున్న తనను మాస్ చిత్రం అటువైపు లాగిందన్నారు. ఇక తాజా చిత్రం 24 విషయానికి వస్తే ద్విపాత్రాభినయం కంటే ఎక్కువ పాత్రలు చేయాలన్నది దర్శకుడు విక్రమ్కుమార్ కథ డిమాండ్ మేరకే జరిగిందని పేర్కొన్నారు. ఇక ఆయన సోదరుడు కార్తీ నటిస్తున్న తాజా చిత్రం కాష్మోరా విషయానికి వస్తే ఇందులో ఆయన సరసన నయనతార, శ్రీదివ్య నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోకుల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కార్తీ త్రిపాత్రాభినయం చేస్తున్నారన్నది గమనార్హం. దీని గురించి ఆయన మాట్లాడుతూ ఇది ఒక ఆత్మ ఇతివృత్తంతో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం అన్నారు. చాలా ట్విస్ట్లు, మలుపులతో కూడిన ఈ చిత్రంలో ఒక చారిత్రక అంశం కూడా చోటు చేసుకుంటుందన్నారు. ఈ కారణాలే ఇందులో తనను ఒకటి కంటే ఎక్కువ పాత్రలు పోషించడానికి దోహదం చేశాయని కార్తీ పేర్కొన్నారు. -
మూడు పాత్రలలో మెప్పించడానికి రెడీ!
ఇద్దరూ ఇద్దరే. ఒకరు ప్రముఖ స్టైలిష్ దర్శకుడు గౌతం మీనన్. మరొకరు కోలీవుడ్ టాప్ స్టార్, యాక్షన్ హీరో అజిత్. సక్సెస్, ఫెయిల్యూర్లతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎవర్గ్రీన్ మాస్, కమర్షియల్ ఇమేజ్ ఉన్న హీరో అజిత్. ఈ ఇద్దరి కాంబినేషన్లో చిత్రం అంటే భారీ స్థాయిలోనే అంచనాలు ఉంటాయి. దానికి తోడు ఈ మూవీలో అజిత్ మూడు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడు. చాలామంది హీరోలు ద్విపాత్రాభినయం చేస్తుంటారు. మూడు పాత్రలు పోషించడం చాలా అరుదు. అజిత్ మూడు పాత్రలలో కనిపించి మెప్పించడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలో అజిత్ సరసన స్వీటీ అనుష్క, బ్యూటీ త్రిష హీరోయిన్స్గా కనిపించబోతున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా ప్రారంభమైన సమయంలో అజిత్ తెల్లజుట్టుతో ఉన్న ఫొటోలు వచ్చాయి. ఆ తర్వాత మంగాత్తా, వీరం, ఆరంభం... చిత్రాల్లో స్టైల్లోనే సాల్ట్పెప్పర్తో ఓ ఫొటో విడుదలైంది. ఆ తర్వాత అజిత్ చాలా స్మార్ట్గా, యువకుడిలా నల్ల జుట్టుతో ఉన్న ఫొటోలు విడుదలయ్యాయి. అవి అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు నల్లజుట్టు, గడ్డంతో ఉన్న మాస్ ఫొటో తాజాగా విడుదలైంది. అది ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. గతంలో వచ్చిన 'దీనా' చిత్రంలో ఉన్నట్లు అజిత్ కనిపిస్తున్నారని ఆయన అభిమానులు చెబుతున్నారు. దీపావళికి ఈ చిత్రం ట్రైలర్, పాటలను విడుదల చేసే అవకాశముందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు "తలా 55 " అనే టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. **
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement