-
సభ్యత్వ నమోదుపై కేటీఆర్ టెలికాన్పరెన్స్
-
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు తీరుపై...తుమ్మల సీరియస్
ఖమ్మం వైరా రోడ్: టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో అలసత్వంగా వ్యవహరిస్తున్న నాయకులపై ఆ పార్టీ నేత, రాష్ర్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీ ఏ ఒక్కరితో నడిచేది కాదని, అందరూ సమష్టిగా కృషి చేస్తేనే మనుగడ సాధ్యమవుతుందని శ్రేణులకు హితబోధ చేశారు. పార్టీ ఖమ్మం నియోజకవర్గ సభ్యత్వ నమోదు బాధ్యులతో ఆయన ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘‘సభ్యత్వ నమోదులో కొందరు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఆసక్తి ఉంటే చేరుుంచండి. లేకపోతే సభ్యత్వ పుస్తకాలు తిరిగి ఇచ్చేయండి. మీ చేతగానితనంతో ప్రజలు నష్టపోతారు. పార్టీకి చెడ్డ పేరు వస్తే సహించేది లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో పాల్గొనాలనే ఆలోచన, కోరిక, శక్తి ఉన్న వారికి మాత్రమే సభ్యత్వ పుస్తకాలు ఇవ్వాలని నాయకులను ఆదేశించారు. పదవులు రావాలంటే.. ముందుగా మన ధర్మాన్ని మనం పాటించాలని అన్నారు. అనేక పార్టీల నుంచి వచ్చిన వారు టీఆర్ఎస్లో ఉన్నారని, అందరూ కలిసిమెలిసి పనిచేయూలని అన్నారు. పార్టీ కోసం శ్రమించిన వారికి ఎన్నటికైనా గుర్తింపు లభిస్తుందన్నారు. కష్టపడి పనిచేస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుస్తామని, తద్వారా రాజకీయ పరమార్థం దక్కుతుందని అన్నారు. టీఆర్ఎస్లో చేరేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారని అన్నారు. సభ్యత్వం పూర్తిచేసిన పుస్తకాలను సోమవారం నాటికి ఇవ్వాలని బాధ్యులను ఆదేశించారు. సభ్యత్వ ఆన్లైన్ ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తవుతుందన్నారు. నియోజకవర్గ ఇచ్చార్జ్ ఆర్జేసీ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, ఖమ్మం పార్లమెంట్ ఇన్చార్జ్ ఎస్బి.బేగ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, నాయకులు మదార్సాహెబ్, నల్లమల వెంకటేశ్వరరావు, కొండబాల కోటేశ్వరరావు, చింతనిప్పు కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకు వెనుకబడ్డామో చెప్పాలి కూసుమంచి: ‘‘రాజకీయ చైతన్యమున్న జిల్లాగా ఖమ్మానికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానముంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల చూపు మన వైపే ఉంది. కానీ పార్టీ సభ్యత్వ నమోదులో మాత్రం మనం ఎందుకు వెనుకబడ్డామో మీరే చెప్పాలి’’ అని నాయకులు, కార్యకర్తలనుద్దేశించి టీఆర్ఎస్ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరు నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్ష సమావేశం శనివారం పాలేరులోని బీవీ రెడ్డి ఫంక్షన్ హాలులో జరిగింది. ఖమ్మం రూరల్ మండలంలో సభ్యత్వ నమోదుపై మంత్రి తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ... ఖమ్మం రూరల్ మండలంలో సభ్యత్వ నమోదును వేగవంతం చేయూలని కోరారు. రానున్న రోజుల్లో జిల్లాలో పెను మార్పులు వస్తాయని, టీఆర్ఎస్ ప్రభంజనానికి అడ్డే ఉండదని అన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల దరికి చేరేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నాయకులు దిండిగాల రాజేందర్, బేగ్, బత్తుల సోమయ్య, రావెళ్ళ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక.. సంస్థాగత బాట
ఈనెల 20వరకు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు నియోజకవర్గానికి 30వేల సభ్యత్వం లక్ష్యం పార్టీ కమిటీలన్నీ రద్దు.. ఏప్రిల్లో కొత్త జిల్లా కమిటీ వార్డు స్థాయి నుంచి అన్ని కమిటీలూ కొత్తవే సభ్యత్వ నమోదు రాష్ట్ర బాధ్యతలు రాజేశ్వరరెడ్డికి జిల్లా నుంచి జెల్లా, సామేలుకు చోటు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్లో సంస్థాగత నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసుకునే దిశలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను అమలుపర్చేందుకు జిల్లా నాయకత్వం సంసిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదును వెంటనే ప్రారంభించి, జిల్లా వ్యాప్తంగా 3.60లక్షల మంది పార్టీ సభ్యులను చేర్చుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు పార్టీ నేతలు. అయితే, పార్టీ సభ్యత్వ నమోదు రాష్ట్ర బాధ్యతలను జిల్లాకు చెందిన నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డికి అప్పగించారు. సభ్యత్వ నమోదు స్టీరింగ్ కమిటీ కన్వీనర్గా ఆయనను నియమించారు. ఆయనతోపాటు మొత్తం 11 మంది సభ్యులున్న ఈ కమిటీలో జిల్లా నుంచి జెల్లా మార్కండేయులు, మందుల సామేలుకు స్థానం దక్కింది. 25వేలు సాధారణ, 5వేలు క్రియాశీలక.. పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో యుద్ధప్రాతిపదికన సభ్యత్వ నమోదు చేస్తామని జిల్లా నాయకులంటున్నారు. నియోజకవర్గానికి 25వేల మంది సాధారణ సభ్యులను, 5వేల మంది క్రియాశీల సభ్యులను చేర్పించాల్సి ఉంది. అంటే జిల్లా వ్యాప్తంగా మొత్తం 3.6లక్షల మందిని టీఆర్ఎస్ సభ్యులుగా చేర్చనున్నారన్నమాట. అదే విధంగా ప్రస్తుతం ఉన్న పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేస్తూ రాష్ట్రస్థాయి సమావేశంలో తీర్మానం చేయడంతో ఇప్పుడున్న కమిటీలన్నీ రద్దయినట్టే. వార్డు స్థాయి నుంచి జిల్లా కమిటీ వరకు కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. మార్చి1 నుంచి 10వ తేదీ వరకు వార్డు, గ్రామ స్థాయి కమిటీలు, ఆ తర్వాత 20వరకు మండల, మున్సిపల్ కమిటీలను నియమించనున్నారు. ఏప్రిల్లో జిల్లాకు కూడా కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర సమావేశంలో నిర్ణయించారు. ఇంకా తేదీ ప్రకటించలేదు. అన్ని స్థాయిల్లో పార్టీని బలోపేతం చేసేలా ఈ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటామని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, జిల్లాలో ఎమ్మెల్యేలు లేని చోట్ల పార్టీని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు లేని చోట్ల బహునాయకత్వం సమస్య పార్టీకి ఉంది. కోదాడ, హుజూర్నగర్, దేవరకొండల్లో ఈ విషయంలో కొంత సమస్య ఉందనేది పార్టీ నేతల అభిప్రాయం. దీనికి సంబంధించి అందరూ కలిసి పనిచేయాలని, నియోజకవర్గాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నందున అందరికీ అవకాశం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా అందరికీ తగిన ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్రెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నేటి నుంచే సభ్యత్వ నమోదు : పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం నుంచి ప్రారంభిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి చెప్పారు. సమావేశం అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఉపయోగించుకుంటామన్నారు. ఆది నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారిని, కొత్తగా వచ్చి న వారికి కలుపుకుని వెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ శ్రేణులందరూ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో చురుకుగా పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
టుడేస్ లీడర్: రోజా హ్యాట్రిక్! వన్స్ మోర్ జగన్
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement