-
టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్ను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. వాస్తవానికి ఈ నెల 5వ తేదీనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రూపొందించినప్పటికీ గోప్యంగా ఉంచిన విద్యాశాఖ, గురువారం అర్థరాత్రి వెల్లడించింది. శాఖలో 22 వేల వరకూ ఖాళీలున్నప్పటికీ, కేవలం 5,089 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నట్టు వెల్లడించింది. 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీలను కూడా భర్తీ చేస్తామని గతంలో ప్రకటించినా నోటిఫికేషన్లో ఆ ఖాళీలను ప్రస్తావించలేదు. స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, భాషా పండితుల పోస్టులను భర్తీ చేస్తున్నట్టు తెలిపింది. తొలిసారిగా ఆన్లైన్ (కంప్యూటర్ బేస్డ్)లో పరీక్షను నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు దశల వారీగా పరీక్ష ఉంటుందని తెలిపారు. గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లు.. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం నల్లగొండ, సంగారెడ్డిలో పరీక్ష కేంద్రాలుంటాయని ప్రభుత్వం పేర్కొంది. అభ్యర్ధుల గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ళు, దివ్యాంగులకు పది సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఇస్తారు. అయితే ఈసారి టీఆర్టీ ఫీజును రూ.200 నుంచి రూ.1,000కి పెంచారు. పరీక్ష ఆన్లైన్లో పెడుతున్న కారణంగా ఫీజు పెంచినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 20 మధ్య ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఉత్తీర్ణతకు ఓసీలు 90, బీసీలు 75, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు 60 మార్కులు తెచ్చుకోవాలి. టెట్ మార్కుల్లో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టీఆర్టీలో వచి్చన మార్కుల ఆధారంగా ప్రతి పోస్టుకు ముగ్గుర్ని ఎంపిక చేస్తారు. వారి మార్కులు ఇతర మెరిట్స్ ఆధారంగా అందులో ఒకరిని ఎంపిక చేస్తారు. కాగా పూర్తి సమాచారం ఈ నెల 20వ తేదీ నుంచి www.schooledu.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. రెండు నెలల వ్యవధేనా? పాఠశాల విద్యాశాఖలో 22 వేల పోస్టులున్నాయని గత ఏడాది విద్యాశాఖ తెలిపింది. ఇందులో 13,086 పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ప్రస్తుతం టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపడుతున్నారు. దీనివల్ల కొన్ని ఖాళీలు ఏర్పడతాయి. వీటిని కూడా కలిపి ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తారని నిరుద్యోగులు భావించారు. కానీ 5,089 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ జారీ చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మరోవైపు కేవలం 2 నెలల వ్యవధిలోనే పరీక్ష నిర్వహిస్తుండటంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. పబ్లిక్ సరీ్వస్ కమిషన్ పరీక్షలకు కూడా ఆర్నెల్ల సమయం ఇస్తున్న సర్కార్, టీఆర్టీని ఇంత త్వరగా పెట్టడం ఏమిటని నిరుద్యోగులు అంటున్నారు. -
టీఆర్టీ నియామకాలకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) అభ్యర్థులకు శుభవార్త. ఏళ్లుగా ఎదురు చూస్తోన్న ఉపాధ్యాయ నియామకాలకు లైన్ క్లియరైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీ–2017 నిర్వహించింది. టీఎస్పీఎస్సీ ద్వారా అర్హత పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించినప్పటికీ కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో నియామకాల ప్రక్రియలో జాప్యం జరిగింది. దీంతో అభ్యర్థులు అప్పట్నుంచి ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రం చేశారు. ఈక్రమంలో టీఎస్పీఎస్సీ అర్హుల జాబితాను పాఠశాల విద్యాశాఖకు సమర్పించింది. దీంతో నియామకాల ప్రక్రియ టీఎస్పీఎస్సీ నుంచి విద్యాశాఖకు చేరింది. ఎట్టకేలకు ప్రభుత్వం శనివారం స్పష్టత ఇచ్చింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను నిబంధనలకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని స్పష్టం చేస్తూ జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి.విజయ్కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలకు కమిటీలు టీచర్ల నియామకాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేసింది. కమిటీకి చైర్మన్గా జిల్లా కలెక్టర్, వైస్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్, కార్యదర్శిగా జిల్లా విద్యాశాఖ అధికారి వ్యవహరిస్తారు. సభ్యులుగా జెడ్పీ సీఈవో, కొత్త జిల్లాల డీఈవోలు, మున్సిపల్ కార్పొరేషన్/ మున్సిపాలిటీ కమిషనర్లు, జిల్లా షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి వస్తే, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఉంటారు. ఇప్పటికే టీఆర్టీ ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ జిల్లా కమిటీలకు సమర్పించినట్లు సమాచారం. రోస్టర్, మెరిట్ ఆధారంగా త్వరగా నియామ కాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కమిటీలు తమ పరిధిలోని పాఠశాలల్లో సబ్జెక్టులవారీగా ఖాళీలను గుర్తించాల్సి ఉంది. కేటగిరీ 1,2,3,4 స్థానాలను సైతం నిర్ధారించాలి. ఈ ప్రక్రియ పూర్తైన అనంతరం నియామకాలు చేపట్టాలి. -
నియామకాలెప్పుడో..!
కరీంనగర్ఎడ్యుకేషన్: టీఆర్టీ నియామకాలపై సందిగ్ధం నెలకొంది. పాఠశాలల్లో ఇది వరకు పనిచేస్తున్న విద్యావాలంటీర్లనే తాజాగా కొనసాగించాలని ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. బడులు ప్రారంభమయ్యే సమయం దగ్గరపడిన కొద్దీ ఉపాధ్యాయుల నియామకంపై తర్జనభర్జన కొనసాగింది. ప్రభుత్వం టీఆర్టీ నియామకాలు చేపడుతుందా.. విద్యావాలంటీర్లను కొనసాగిస్తుందా అనే సందేహాలు ఉండగా తాజాగా తాత్కాలిక బోధకుల వైపే విద్యాశాఖ మొగ్గు చూపింది. ఈ నెల 11న రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారి జనార్దన్రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారులకు వెల్లడించారు. దీంతో ఏడాదిన్నరగా నియామకాల కోసం ఎదురు చూస్తున్న టిఆర్టీ అభ్యర్థుల కథ మళ్లీ మొదటికొచ్చింది. నియామకాలను భర్తీ చేసి మిగతా ఖాళీలను విద్యావాలంటీర్ల ద్వారా భర్తీ చేయాల్సిన విద్యాశాఖ టీఆర్టీ అభ్యర్థులను పక్కనబెట్టి విద్యావాలంటీర్లను కొనసాగించడంతో సందిగ్ధత నెలకొంది. పాతవారే కొనసాగింపు.. సర్కారు బడుల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కొన్నేళ్ల నుంచి విద్యావాలంటీర్లను నియమిస్తోంది. రెండేళ్ల నుంచి నెలకు రూ.12 వేల వేతనం అందజేస్తూ వారితో వివిధ సబ్జెక్టుల వారీగా బోధన చేయిస్తోంది. కిందటేడాది వరకు కొత్తగా నియామకాలు చేపడుతూ అర్హత ప్రకారం నియమించేవారు. ఇలా ప్రతీ ఏడాది దరఖాస్తులు చేసుకోవడం, మెరిట్ తదితర కారణాల రీత్యా ఇబ్బందులు పడుతున్నామని కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఇదివరకు పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావాలంటీర్లనే ఈ ఏడాది నుంచి కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం సైతం ఇందుకు సుముఖంగా ఉండడంతో తాత్కాలిక బోధకులను బడుల్లో కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బడులు పునః ప్రారంభం కావడంతో ఆయా జిల్లాల విద్యాధికారులు సైతం ఉపాధ్యాయుల కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో వారు తాత్కాలిక బోధకులను కొనసాగించాలని ఆదేశించారు. జిల్లా అధికారులు వారికి బడుల్లో చేరాలని సమాచారం అందించారు. ఇది వరకు ఉపాధ్యాయులు లేనిచోట, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి బోధకుల కొరత ఉన్నచోట, ప్రాధాన్యతక్రమంలో వీరిని నియమించారు. ఆయా పాఠశాలల్లో తాజా సంఖ్యను బట్టి మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చని అధికార వర్గాల ద్వారా తెలిసింది. కిందటేడాదిలో పలువురు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయడంతో వారి స్థానంలో కొత్తగా మరికొందరిని కూడా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారు 134 మంది వరకు ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. తాజాగా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతున్న పాఠశాలలకు విద్యావాలంటీర్లు రావడంతో కొంత ఉపశమనం కలిగినట్లవుతోంది. టీఆర్టీ అభ్యర్థులకు నిరీక్షణ తప్పదా..! ప్రభుత్వం తాజాగా సర్కారు బడుల్లో విద్యావాలంటీర్లను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల టీఆర్టీ నియామకాలపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఇప్పటి కే తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు సంబంధించి ఫలితాల ను ప్రకటించింది. ఫలితాలు ప్రకటించి సుమారు నాలు గు నెలలు కావస్తున్నా... వీరికి నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. బడులు తెరిచే నాటికి వీరిని బడుల్లో నియమించాలని అనేక డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం ఎటూ తేల్చలేకపోతోంది. ఎంపికైన అభ్యర్థులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. పలు ఉపాధ్యాయ సంఘాలు సైతం నియామక ఉత్తర్వులు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం తాత్కాలికంగా విద్యావాలంటీర్లనే బడుల్లో కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. దీంతో మరికొంత కాలం టీఆర్టీ అభ్యర్థులకు నిరీక్షణ తప్పదనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వి ద్యావాలంటీర్లను కొనసాగిస్తున్నామని డీఈవో వెంకటేశ్వర్లు వివరించారు. పాఠశాలల్లో ప్రాధాన్య క్రమంలో వారిని నియమించినట్లు వివరించారు. -
టీఆర్టీ నియామకాలు చేపట్టాలి
ఖమ్మంసహకారనగర్: టీచర్స్ రిక్రూట్మెంట్మెం ట్టెస్ట్ (టీఆర్టీ) నియామకాలు వెంటనే చేపట్టా లని టీపీటీఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వి.మనోహర్రాజు డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని టీపీటీఎఫ్ తలపెట్టిన నిరసన ర్యాలీ సంఘం కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మనో హర్రాజు మాట్లాడుతూ నిరుద్యోగ విద్యావంతులైన యువకులు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయ ని ఆశించారని, అవి అమలుకు నోచుకోవటం లేదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ్డి మా ట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమంలో పోరాటం చేసిన యువత ప్రస్తుతం నిరాశ నిస్పృహలతో ఉన్నారన్నారు. ఉద్యమాలు చేయకముం దే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులకు సంవత్సర నుంచి ఇవ్వాల్సిన కరవుభత్యం (డీఏ) ఈ నెలలో ప్రకటించారని, ఈ సంవత్సరం ఇవ్వాల్సిన డీఏ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పీఆర్సీ వెంటనే కొత్త స్కేల్ను ప్రకటించాలన్నారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు పలికారు. అనంతరం కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు విజయ్, నర్సింహారావు, ప్రసాదరావు, నాగేశ్వరరావు, నాగిరెడ్డి, ఉమాదేవి పాల్గొన్నారు. -
టీఆర్టీ సవరణ జారీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పాత పది జిల్లాల ప్రకారమే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపడతామని ప్రకటిస్తూ.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. 8,792 ఉపాధ్యాయ పోస్టుల్లో ఈ జిల్లాల వారీగా, కేటగిరీలవారీగా అందుబాటులో ఉండే వాటి వివరాలను వెల్లడించింది. దరఖాస్తుల గడువును ఈ నెల 30వరకు పొడిగించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు పాత జిల్లాల ప్రకారం తమ స్థానిక జిల్లాను ఎంపిక చేసుకునేందుకు ‘డిస్ట్రిక్ట్ ఎడిట్’ఆప్షన్ను వెబ్సైట్లో పొందుపరుస్తున్నట్లు తెలిపింది. ఇక ఫిబ్రవరి 24–28 తేదీల మధ్య వివిధ పోస్టుల భర్తీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు.. టీఎస్పీఎస్సీ రాష్ట్రంలో 31 కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ‘టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) నోటిఫికేషన్’జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. 31 జిల్లాల వారీగా భర్తీ రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని స్పష్టం చేసింది. పాత 10 జిల్లాల ప్రకారమే టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పాత జిల్లాల ప్రకారమే పోస్టుల భర్తీకి వీలుగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను సవరించింది. పాత జిల్లాలు, కేటగిరీల వారీగా పోస్టుల వివరాలను అభ్యర్థులు tspsc.gov.in వెబ్సైట్లో పొందవచ్చని వెల్లడించింది. అభ్యర్థులు పోస్టుల వివరాలను సరిచూసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తుల గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించింది. వారు ఇప్పటికే ఇచ్చిన జిల్లాల వారీ ప్రాధాన్యాలను మార్చుకోవచ్చని.. ఇందుకోసం వెబ్సైట్లో ‘డిస్ట్రిక్ట్ ఎడిట్’ఆప్షన్ లింకును ప్రత్యేకంగా పొందుపరుస్తున్నట్లు తెలిపింది. ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు వెబ్సైట్లోని ఆ లింకు ద్వారా తమ జిల్లాల ఆప్షన్ను ఇచ్చుకోవాలని సూచించింది. అలాగే హైకోర్టు ఆదేశాల మేరకు.. డీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) చదివినవారు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు, బీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) చేసిన వారు స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. నాలుగు జిల్లాల మైదాన ప్రాంతాల్లో తక్కువగా ఎస్జీటీ పోస్టులు పాత పది జిల్లాల ప్రకారం పోస్టులను ఇచ్చినా... నాలుగు జిల్లాల్లోని మైదాన ప్రాంతాల్లో ఎస్జీటీ పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఖమ్మంలో కేవలం 7 పోస్టులు మాత్రమే ఉండగా, వరంగల్లో 20, నల్లగొండలో 40, కరీంనగర్లో 74 పోస్టులు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో మైదాన ప్రాంతంలో పీఈటీ పోస్టులు కేవలం 8 మాత్రమే ఉండగా, లాంగ్వేజ్ పండిట్ పోస్టులూ తక్కువగా ఉన్నాయి. ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టులు నాలుగు జిల్లాల్లో మాత్రమే ఉన్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement