-
టీఎస్ఐఐసీలో ఘనంగా ఇఫ్తార్ విందు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. టీఎస్ఐఐసీ వీసీఎండీ వెంకటనర్సింహారెడ్డి, సీఈఓ సుధాకర్, ఉన్నతాధికారులతో పాటు ముస్లిం ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వమతాల ఐక్యతకు రంజాన్ పండగ ప్రతీక అని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఇన్చార్జి చీఫ్ ఇంజనీర్ శ్యాంసుందర్, సీజీఎం గీతాంజలి, జనరల్ మేనేజర్లు కళావతి, సునీతా బాయి, డీజీఎంలు కవిత, దీపక్ కుమార్, జోనల్ మేనేజర్ మాధవి పాల్గొన్నారు. -
పెట్టుబడులకు ఆస్ట్రేలియా సుముఖత
* మంత్రి జూపల్లిని కలసిన ఆస్ట్రేలియా బృందం * ప్రభుత్వ విధానాలను వివరించిన మంత్రి సాక్షి, హైదరాబాద్ : పారిశ్రామికీకరణ దిశలో వేగంగా అడుగులు వేస్తున్న రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఉన్నాయని ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం వ్యాఖ్యానించింది. ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ పార్లమెంటరీ కార్యదర్శి, ఎంపీ హాన్ స్టీవెన్ సియోబో గురువారం సచివాలయంలో రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయ్యారు. గనులు, వ్యవసాయం, నీటి యాజమాన్యం తదితర రంగాల్లో ప్రావీణ్యం కలిగిన ఆస్ట్రేలియాకు తెలంగాణలో ఆయా రంగాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని సియోబో అభిప్రాయం వ్యక్తం చేశారు. సూక్ష్మ సేద్యం, మౌలిక సౌకర్యాలు, విద్య, రోడ్డు భద్రత తదితర అంశాల్లో తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలకు అవకాశం ఉందన్నారు. పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలను మంత్రి జూపల్లి కృష్ణారావు వారికి వివరించారు. భారత్లో ఆస్ట్రేలియా హై కమిషనర్ పాట్రిక్ సక్లింగ్, దక్షిణ భారత కాన్సుల్ జనరల్ సీన్ కెల్లీతో పాటు వాణిజ్య బృందం సభ్యులు మంత్రి జూపల్లిని కలిసిన వారిలో ఉన్నారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, కమిషనర్ మణికారాజ్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. హాంకాంగ్కు చెందిన మెజ్జో హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ జాన్ ఎడ్మండ్సన్ నేతృత్వంలోని ఈశాన్య ఆసియా పెట్టుబడిదారుల బృందం మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయింది. తైవాన్, జపాన్, హాంకాంగ్, చైనా దేశాలకు చెందిన పెట్టుబడిదారులు ఈ బృందంలో ఉన్నారు. సెల్ఫోన్ విడిభాగాలు, ఆటోమోటివ్ పార్టులు, గృహ, మౌలిక సౌకర్యాలకు సంబంధించిన యూనిట్లు రాష్ట్రంలో నెలకొల్పేందుకు ఈ బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. భౌగోళికంగా హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకతలను వివరించడంతో పాటు, ఎగుమతులు, రవాణాకు అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని మంత్రి తెలిపారు. డ్రైపోర్టులు, విద్యుత్, మౌలిక సదుపాయాలు తదితర రంగాల అభివృద్ధికి సహకారం అందిస్తామని ఈశాన్య ఆసియా బృందం సభ్యులు హామీ ఇచ్చారు. రూ.1,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన సమగ్ర ప్రణాళికతో త్వరలో వస్తామని ప్రకటించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement