-
ఫిరాయింపులపై హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హతపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారిని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం (టీ-టీడీఎల్పీ) టీఆర్ఎస్లో విలీనమైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ఈ ఏడాది మార్చి 10న జారీచేసిన బులెటిన్ అమలును నిలిపేయాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ వ్యాజ్యం పై బుధవారం హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన ఫిర్యాదులను పరిష్కరించకుండానే టీఆర్ఎస్లో టీటీడీఎల్పీ విలీనమైనట్లు అసెంబ్లీ కార్యదర్శి బులెటిన్ జారీచేయడం రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని కొట్టేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం తేలేదాకా బులెటిన్ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. -
టీటీడీఎల్పీ విలీనంపై తీర్పు వాయిదా
- హైకోర్టులో ముగిసిన వాదనలు - ఏజీ, న్యాయమూర్తి మధ్య వాడి వేడి సంభాషణలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం (టీటీడీఎల్పీ) టీఆర్ఎస్లో విలీనమైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ఈ ఏడాది మార్చి 10న జారీ చేసిన బులెటిన్ అమలును నిలిపేయాలంటూ దాఖలైన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేపై దాఖలైన ఫిర్యాదులను పరిష్కరించకుండానే టీఆర్ఎస్లో టీటీడీఎల్పీ విలీనమైనట్లు అసెంబ్లీ కార్యదర్శి బులెటిన్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని కొట్టేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఇటీవల హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేదాకా బులెటిన్ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ అనుబంధ పిటిషన్పై ఈ నెల 8న విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు.. ప్రతివాదులుగా ఉన్న అసెంబ్లీ కార్యదర్శికి, 10వ షెడ్యూల్ కింద ఫిరాయింపులపై విచారణ జరిపే ట్రిబ్యునల్కు చైర్మన్ హోదాలో స్పీకర్కు, పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం మళ్లీ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్, న్యాయమూర్తి మధ్య వాడివేడిగా సంభాషణలు జరి గాయి. స్వరాన్ని పెంచొద్దని ఏజీని ఉద్దేశించి న్యాయమూర్తి, వాదనలు చెప్పకుండా తనను అడ్డుకోజాలరంటూ ఏజీ వ్యాఖ్యానించేంత వరకు వెళ్లాయి. చివరకు ఏజీ తాననుకున్న వాదనలనే వినిపించారు. అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఫిరాయింపులు, అనర్హత, విలీనం తదితర అంశాలపై స్పీకర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోజాలరన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద వీటిపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో నిర్ణ యం తీసుకునే స్పీకర్కు, శాసనసభ కార్యకలాపాలను నిర్వహించే స్పీకర్కు మధ్య స్పష్టమైన తేడా ఉందన్నారు. ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ ముందు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని తేల్చకుండా విలీనంపై నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనని ట్రిబ్యునల్ తేలిస్తే అప్పుడు విలీనమన్నదే ఉత్పన్నం కాదన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement