-
ఎంతపని సేశావు సామీ..
‘అందరం సల్లంగుండాలని నీకు మొక్కులు చెల్లించడానికి బయలుదేరితే ఇదేం ఘోరం దేవుడా.. ఎంత పని చేశావు స్వామీ.. మేమేం తప్పు చేశాం భగవంతుడా.. పిల్లా జల్లా ఎట్లా మారిపోయారో చూడు స్వామీ..’ అంటూ ఓ కుటుంబం, ‘నీకేం తక్కువ చేశాం స్వామీ.. మాకిలా చేశావు.. అన్నిటికీ నీవే అండగా ఉండాలని మొక్కులు చెల్లించుకుంటిమిగద స్వామీ’ అని మరో కుటుంబం ఘటన స్థలిలో రోదించడం అందరినీ కలచి వేసింది. రాజంపేట రూరల్, కడప అర్బన్ : రెండు వాహనాలు(తుఫాన్) ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజంపేట మండలం (కడప-రేణిగుంట హైవే) చొప్పావారిపల్లె క్రాస్ వద్ద గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వృుతులు, క్షతగాత్రులందరూ కర్నూలు జిల్లాకు చెందిన వారు. క్షతగాత్రులను కడపలోని రిమ్స్కు తరలించారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పలుకూరుకు చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని బుధవారం అర్ధరాత్రి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. వీరు ప్రయాణిస్తున్న (ఏపీ02వై0872) వాహనంలో డ్రైవర్తో కలిపి 17మంది ఉన్నారు. అదే జిల్లాలోని గడివేములకు చెందిన వెంకటన్న తన మనవళ్లు ప్రశాంత్, శ్యామ్ప్రసాద్లకు తలనీలాలు తీయించే కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి తుఫాన్ (ఏపీ21టీడబ్ల్యూ6199) వాహనంలో తిరుమలకు వెళ్తున్నారు. ఈ వాహనంలో డ్రైవర్తో కలిపి 16 మంది ఉన్నారు. ఈ రెండు వాహనాలు చొప్పావారిపల్లె క్రాస్ వద్దకు రాగానే వెంకటన్న కుటుంబం ఉన్న వాహన డ్రైవర్ చింతా జనార్ధన్ (నందికొట్కూరుకు చెందిన బాలస్వామి కుమారుడు) నిద్రమత్తుతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. వెంకటన్న కుటుంబానికి చెందిన చిన్నమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందగా, ఇరు వాహనాల్లోని 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఎస్ఐ సుధాకర్, కానిస్టేబుళ్లు 108 ద్వారా రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటన స్థలి, ఆస్పత్రి దద్దరిల్లింది. అనంతరం వారిలో 27 మందిని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు పంపారు. తిరుమల నుంచి ఆదోనికి బయలు దేరిన వాహన డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం చోటుచేసుకుందని స్పష్టమైంది. చిన్నారిని వదలని తల్లి ప్రమాదం జరగ్గానే పలువురు ఇరు వాహనాల్లో ఇరుక్కుపోయారు. వెనుక వస్తున్న వాహనాల వారు, స్థానికులు వెంటనే సహాయక చర్యలకు ఉపక్రమించారు. వాహనాల్లో ఇరుక్కుపోయిన వారిని బయటకు లాగారు. ఆలోగా పోలీసులు 108ను రప్పించారు. అందరినీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఓ మహిళ తన ఏడాది చిన్నారిని రెండు చేతులతో ఒడిసి పట్టుకుని స్పృహ తప్పి ఉన్న దృశ్యం చూసి స్థానికుల కళ్లు చెమర్చాయి. ఇంత ప్రమాదం జరిగినా ఆ చిన్నారి మాత్రం గాయపడక పోవడం అదృష్టమని స్థానికులు చర్చించుకున్నారు. చికిత్స పొందుతూ ఒకరి మృతి రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను కడప రిమ్స్కు తరలించగా కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన డ్రైవర్ జనార్దన్ (29) చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. గడివేములకు చెందిన అనంతమ్మ (32) పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రగాయాలతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఆర్తనాదాలు చేస్తుండటం అందరినీ కలచివేసింది. మన్నూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులు వీరే.. తిరుమల నుంచి పలుకూరుకు వెళుతున్న వాహనంలో ఉన్న అనంతమ్మ, హనుమంతు, రామలక్ష్మీ, గాయత్రి, మంగమ్మ, తేజ, సావిత్రి, కావ్వ, జయలక్ష్మీ, అనిత, లక్ష్మీ, హరిత, డ్రైవర్ ఫయాజ్ మరికొందరు.. గడివేముల నుంచి తిరుమలకు వెళుతున్న వాహనంలో వెంకటన్న, శ్రీనువాసులు, రమణ, మధుకిరణ్, సీ.శ్రీనువాసులు, ప్రణీత, తులసీ, రమణమ్మ, శీలం లక్ష్మీ, జనార్ధన్, మదన్కుమార్, శ్యాంప్రసాద్, మరికొందరు ప్రమాదంలో గాయపడ్డారు. కడప రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరిని గురువారం సాయంత్రం నంద్యాలకు తరలించారు. -
రెండు వాహనాల ఢీ: ఇద్దరి మృతి
మేడికొండూరు, న్యూస్లైన్: ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన బుధవారం డోకిపర్రు అడ్డరోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. నరసరావుపేట రూరల్ మండలం, జొన్నలగడ్డ గ్రామానికి చెందిన చిన్నపరెడ్డి శ్రీనివాసరెడ్డి (35), రంగారెడ్డిపాలేనికి చెందిన నాగిరెడ్డి(38)లు ద్విచక్రవాహనంపై విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా డోకిపర్రు అడ్డరోడ్డు సమీపంలో ఫిరంగిపురం నుంచి ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. రెండు వాహనాలు వేగంగా వస్తుండడంతో ద్విచక్ర వాహనంపై వున్న శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డిలు ఎగిరి మార్జిన పక్క పడిపోయి అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరూ సమీప బంధువులు. టాటా ఏస్ వాహనాన్ని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి మేడికొండూరు ఎస్ఐ జె. అనూరాధ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement