-
లివింగ్ లెజెండ్ అన్నవరపు రామస్వామి
తొంభై ఆరేళ్ల వ్యక్తి బతికి ఉండడాన్ని మీరు ఎన్ని సార్లు ... ఎన్ని చోట్ల చూసారు ? ఒకటో రెండో సార్లు .... కదా ? ఒక వేళా బతికి ఉన్నా వారి ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది ? మందగించిన కంటి చూపు ... వినికిడి ... జ్ఞాపక శక్తి ! మంచం నుంచి లేవలేని స్థితి . అవునా ? తొంభైఆరేళ్ల లివింగ్ లెజెండ్ ను పరిచయం చేస్తా .... రండి . ..... శంకరాభరణం సినిమా చూసారు కదా ? తెలుగువాడన్నాక చూడకుండా ఎలా ఉంటారులెండి! శంకర శాస్త్రి ! తెలుగువాడి గుండెల్లో పాగా వేసాడు కదా . నిజజీవిత ప్రేరణ లేకుండా అంతటి పాత్ర ను మలచడం సాధ్యమా ? ఆ శంకర శాస్త్రి పాత్ర నిజ జీవితం లో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు . తలపాగా .. ఆహార్యం .. నిబద్దత .. క్రమశిక్షణ సంగీతం ... . అన్నీ .. అన్నీ . 1883 అంటే నూట నలభై ఏళ్ళ క్రితం పుట్టారు . సంగీత మహాగురువు . త్యాగరాజ స్వామి .. శిష్యుల్లో నాలుగో తరానికి చెందిన వారు పంతులు గారు . విజయవాడ అలంకార థియేటర్ సెంటర్ లో ఆయన విగ్రహం ఉంది. పంతులు గారు ఎంతో మంది సంగీత కారుల్ని తయారు చేసారు . ఆయన శిష్యుల్లో అందరికీ బాగా తెలిసిన వారు లెజెండ్ మంగళం పల్లి బాలమురళి కృష్ణ . రామకృష్ణయ్య పంతులు శిస్యుల్లో బాల మురళి కంటే సీనియర్ అయిన వ్యక్తే మనం చెప్పుకొంటున్న హీరో ఆ హీరో పేరు అన్నవరపు రామస్వామి . పుట్టింది 1926 . అంటే తొంబై ఆరేళ్ళ క్రితం . దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయ్యింది కదా . దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆయన 21 ఏళ్ళ యువకుడు . వామ్మో .. అప్పుడెప్పుడో పుట్టిన వ్యక్తి ఇంకా బతికున్నారా ? అని మీరు ఆశ్చర్య పోతున్నారా ? బతికుండమేంటి ? పాపం ప్రతిహతమగు కాక . చేతిలో కనీసం కర్ర లేదు . నాకంటే వేగం గా నడుస్తారు . మెట్లెక్కుతారు . కంటిచూపు పర్ఫెక్ట్ . వినికిడి పర్ఫెక్ట్ . జ్ఞాపక శక్తి సూపర్ . చాదస్తం లేదు సరి కదా .. చిలిపితనం ఎక్కువ. బాల మురళి సంగీత ప్రపంచం లో లెజెండ్ . ఆయనకు భారత రత్న రాలేదంటే అది తెలుగువాడి దౌర్బాగ్యం . బాలమురళి పాడిన త్యాగరాజ పంచరత్న కీర్తనలు యూట్యూబ్ లో చూడండి . ఆయనకు వయోలిన్ సహకారాన్ని అందిస్తున్న ఆయన సీనియర్ రామస్వామి కనిపిస్తారు . అదీ అన్నవరపు రామస్వామి గారి స్థాయి . అలాంటి వ్యక్తిని పరిచయం చెయ్యాల్సి రావడం ఇబ్బందికరం కాకపోతే ఇంకేంటి ? కాంట్రవర్సీ, సెన్సెషనల్ లాంటి విషయాల పట్ల ఉన్న ఆసక్తి , ఇంకా మన ముందే బతికి ఉన్న లెజెండ్స్ పట్ల ఉండదు . ఇదే మన సమాజ దౌర్బాగ్యం . అదే మన పతనావస్థ. మొన్న ఒక జర్నలిస్ట్ వాట్సాప్ గ్రూప్ లో ఒక బ్రేకింగ్ వార్త. అన్నమయ్య కీర్తన వివాదం తెలిసిందే కదా . దాని పై ఓ కరాటే మహిళ అభిప్రాయం అట .. అదీ ఆ బ్రేకింగ్ న్యూస్ . ఆ వివాదమే ఒక శుద్ధ దండగమారి వివాదం . పోనీ దానిపై అభిప్రాయం చెప్పాలంటే ఎవరు చెప్పాలి ? సంగీతం లో ఉద్దండులు చెప్పాలి . కదా? . వ్యక్తిగా ఎవరి అభిప్రాయం ఆమెకుండవచ్చు . తప్పులేదు . నాకు ఒళ్ళు మండిపోయింది . ఏందయ్యా ఇది? అని అడుగుదామని కొన్నా. "ఎవరండీ ఈమె?" అని అడిగా . నా వ్యంగ్యం ఆ గ్రూప్ లో ఎవరికీ అర్థం కాలేదు . రామాయణం లో పిడకల వేట లాగా ఇది ఎందుకు చెప్పానంటే ఇదీ మన స్థితి .. మన ఆలోచన విధానం .. మన మీడియా ధోరణి .... అని చెప్పడానికి . తిరిగి అన్నవరపు రామస్వామి గారి విషయానికి వచ్చేదాము . బాలమురళి గారి సంగీత కచ్చేరి ఎనిమిదేళ్ల క్రితం నా పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతి లో ఏర్పాటు చేశా .అప్పుడే తొలిసారి నాకు అన్నవరపు రామస్వామి గారితో పరిచయ భాగ్యం కలిగింది . అటుపై విజయవాడ లో మా స్కూల్ ప్రారంభించినప్పుడు తిరిగి బాల మురళి కచేరి ఏర్పాటు చేశా . తన చిన్ననాటి ఊరు విజయవాడ లో బాలమురళి చివరి కచేరి అదే . విజయవాడ లో మా స్కూల్ ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించింది బాలమురళి గారే. అటుపై మా స్కూల్ లో విద్యార్థులకు తొలిపాఠం గా సంగీతాన్ని నేర్పింది ఆయనే. ఆయనే వెంట అన్నవరపు రామస్వామి గారు . అటుపై విజయవాడ పోరంకి లో మా స్కూల్ లో నూతన భవనాన్ని ప్రారంభించింది రామ స్వామి గారే { అప్పటికి బాల మురళి కచేరిని దేవతలు స్వర్గం లో ఏర్పాటు చేసుకొన్నారు } . నేను సంగీతకారుడిని కాను . సంగీతం లో ఓనమాలు .. కాదు... కాదు .. సరిగమలు కూడా రాదు . మరి వీరి తో సంబంధాలేంటి ? ఇంగువ మూట గట్టిన బట్టకే వాసన అంటుకొంటుందట . అలాంటిది సుగంధ చందనం మూట గట్టిన బట్టకు ? నాకు శాస్త్రీయ సంగీతమంటే అందునా త్యాగయ్య సంగీతమంటే ప్రాణం . అదే బాలమురళి లాంటి లెజెండ్ ను కలిసే అవకాశమిచ్చింది . అదే నాదసుధార్ణవ పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని కలిసే అవకాశం , ఆయన విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగానే గన్నవరం లోని మా స్కూల్ లో ఏర్పాటు చేసే అవకాశాన్నిచ్చింది . తొంబై ఆరేళ్ళ లివింగ్ లెజెండ్ అన్నవరపు రామస్వామి మహా చిలిపి . ఇరవై ఏళ్ళ కుర్రాడిలో వుండే చిలిపితనం ఆయనలో ఉంది . మొన్న ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మెడలో పూలదండ వేసాం. అటు పై నేను మాట్లాడుతుంటే.. ఉన్నట్టుండి తన మెడలోని పూలదండ నాకు వేసేసారు . గన్నవరం లో మా స్కూల్ ప్రాంగణం లో ఆయన విగ్రహం .. దాన్ని ఆయనే ప్రారంభించడం .. ఆ కార్యక్రమం లో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి మనువడు సుధాకర్ త్యాగయ్య కీర్తన తో ప్రారంభించడం .. అంత ఒక కలలాగుంది. ఆహా.. ఇంతకంటే ఏమి కావాలి ? విగ్రవిష్కరణ సందర్భంగా సుమారు నలబై నిముషాలు ఎండలో నిలుచున్నారు అన్నవరపు గారు . ఇప్పటికీ ఆల్ ఇండియా రేడియో లో వయోలిన్ తో కచేరి చేస్తారు . సంగీతమే నా ఆరోగ్య రహస్యం అంటారాయన . నేను కూడా అంటా .. కర్నాటిక్ సంగీతం ఈజ్ ది సీక్రెట్ అఫ్ మై ఎనర్జీ . - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
త్యాగరాజ స్వామి నడయాడిన ఊరు తిరువయ్యారు
దేవునికి ఉత్సవాలు జరుగుతాయి. కాని ఒక వాగ్గేయకారునికి కూడా జరుగుతాయా? జరుగుతాయి. ఆ గౌరవం, వైభవం త్యాగరాజ స్వామికే దక్కింది. వేదిక తిరువయ్యారు. అవును. తమిళనాడులో తంజావూరుకు చేరువలోనున్న తిరువయ్యారులో ప్రతి ఏటా శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు వీనుల విందుగా కన్నుల పండువగా జరుగుతాయి. కావేరీ నది ఒడ్డున త్యాగరాజ స్వామివారి సమాధి వద్ద జరిగే ఈ కార్యక్రమాల్లో దేశం నలుమూలలకు చెందిన సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని, త్యాగరాజ కీర్తనలను గానం చేస్తారు. త్యాగరాజ పంచరత్న కీర్తనలను బృందగానం చేస్తారు. కర్ణాటక సంగీత ప్రపంచంలో త్రిమూర్తులుగా ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, త్యాగరాజు ఖ్యాతిపొందారు. ఈ త్రిమూర్తులలో తెలుగువాడైన త్యాగరాజుకు మాత్రమే ఇంతటి అరుదైన గౌరవం దక్కడం విశేషం. త్యాగరాజ స్వామి 1847లో పుష్య బహుళ పంచమి నాడు తిరువయ్యారులో సమాధి పొందాడు. ఆయన అంత్యక్రియలు కావేరి నది ఒడ్డున జరిగాయి. సంవత్సరం తర్వాత ఆయన శిష్యులు వచ్చి ఆయనకు నివాళిగా ఆరాధనోత్సవాలు ప్రారంభించారు. 1921 వరకు రెండు బృందాలు ఈ కచ్చేరిలు నిర్వహించేవి. అయితే ప్రఖ్యాత నర్తకి, గాయని బెంగుళూరు నాగరత్నమ్మ ఇక్కడ త్యాగరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించడమే గాక అంతవరకూ స్త్రీలకు ప్రవేశం లేని ఆ ఆరాధనోత్సవాలలో స్త్రీలు పాల్గొనాలనే ఉద్యమాన్ని ప్రారంభించింది. తనే స్వయంగా వేదిక కట్టి ఆరాధనోత్సవాల్లో కచ్చేరీలు ఇచ్చింది. అంతేకాదు శేషజీవితం అక్కడే గడుపుతూ తన ఆస్తి ఐశ్వర్యాలన్నీ త్యాగరాజ స్వామికే అంకితం చేసింది. ఈ పోటాపోటీ కొనసాగుతుండగా ఇది సరైనది కాదని 1940లో అందరూ కలిసి సమూహిక ఆరాధన చేసే ఏర్పాటు జరిగింది. అప్పటి నుంచి ఏటా ఆ తిథిని బట్టి ఐదు రోజుల పాటు ఆరాధనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది జనవరి 24 నుంచి 28వ తేదీ వరకు ఈ ఆరాధనోత్సవాలు జరగనున్నాయి. ఐదు నదుల ఊరు ఐదు పవిత్ర నదుల మధ్య ఉన్న ఊరు కావడం వల్ల తిరువయ్యారుకు ఆ పేరు వచ్చింది. ఆ నదులు: అరిసిలారు, వెన్నారు, వెట్టారు, కుడమురుత్తియారు, కావేరియారు. తమిళంలో ‘తిరు’ అంటే పవిత్ర, ‘ఐ’ అంటే ఐదు, ‘ఆరు’ అంటే నది అని అర్థం. తంజావూరు నుంచి తిరువైయారుకు చేరుకోవాలంటే ఈ ఐదు నదుల మీద నిర్మించిన వంతెనలను దాటుకుంటూ రావాల్సిందే. కాని వాస్తవానికి ఇక్కడ ఆరునదులు ఉన్నాయని చెప్పాలి. సంగీతం ఆ ఆరోనది. త్యాగరాజస్వామి ఆ నదీపురుషుడు. ప్రాచీన క్షేత్రం పంచనదీశ్వరాలయం త్యాగరాజస్వామి సమాధి చెందిన ఊరు కావడం వల్లే కాక ప్రాచీన శైవక్షేత్రమైన పంచనదీశ్వరాలయం వల్ల కూడా తిరువయ్యారు ప్రసిద్ధి చెందింది. పంచ ప్రాకారాలతో 60 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సువిశాల ఆలయ ప్రాంగణంలో వివిధ కాలాల్లో చోళులు, పల్లవులు, పాండ్యులు తదితర రాజవంశాలకు చెందిన రాజులు నిర్మించిన మందిరాలు, వేయించిన శిలాశాసనాలు ఉన్నాయి. ఈ ఆలయ దక్షిణ భాగాన్ని దక్షిణ కైలాసం అని, ఉత్తర భాగాన్ని ఉత్తర కైలాసమని అంటారు. ఉత్తర కైలాస భాగాన్ని రాజరాజ చోళుని భార్య క్రీస్తుశకం పదో శతాబ్దంలో నిర్మించిందని చెబుతారు. ఆ సందర్భంగా ఆమె పలు దానాలు చేసినట్లు శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయంలోనే ‘ఆట్కొండర్’ (కాల సంహారమూర్తి) మందిరం, దాని ఎదుట ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన హోమగుండం కనిపిస్తాయి. ఏటా ఇక్కడకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తూనే ఉంటారు. కార్తీక మాసంలో, మహాశివరాత్రి వేడుకల్లో ఇక్కడ ఘనంగా పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయానికి చేరువలో ఉన్న చిన్న ఇంట్లోనే త్యాగరాజు తన సన్యాసాశ్రమ జీవితాన్ని గడిపారు. భక్తి వినా సన్మార్గము కలదే... ‘సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా...’ అని మానవాళికి బోధించిన త్యాగరాజు తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువారూరులో 1767 మే 4వ తేదీన జన్మించారు. అసలు పేరు కాకర్ల త్యాగబ్రహ్మం అయినా భక్తులు, సంగీతాభిమానులు త్యాగరాజుగా, త్యాగయ్యగా పిలుచుకుంటారు. రామభక్తుడైన త్యాగరాజు పూర్వీకులు ప్రకాశం జిల్లాలోని కాకర్ల గ్రామానికి చెందిన వారు. బాల్యంలో సొంఠి వెంకటరమణయ్య వద్ద సరిగమలు నేర్చుకున్న త్యాగరాజు అనతి కాలంలోనే వాగ్గేయకారుడిగా ఎదిగారు. శిష్యుడి గురించి తంజావూరు రాజుకు సొంఠి వెంకట రమణయ్య సిఫారసు చేయగా, రాజు ఆయనను ఆహ్వానించారు. సభకు విచ్చేసిన త్యాగయ్యకు రాజు విలువైన కానుకలను సమర్పించి, ఆస్థాన పదవి అలంకరించమని కోరారు. అయితే, ‘నిధి చాల సుఖమా... రాముని సన్నిధి సుఖమా...’ అంటూ కోరి వచ్చిన సంపదను సైతం తృణప్రాయంగా తిరస్కరించి, రాముని సన్నిధినే పెన్నిధిగా ఎన్నుకున్న భాగవతోత్తముడు త్యాగయ్య. అందుకే, ఆయన అంటే నేటికీ సంగీత విద్వాంసులకు, సంగీతాభిమానులకు అంతటి భక్తి ప్రపత్తులు. త్యాగయ్య తన జీవితకాలంలో దాదాపు 24 వేలకు పైగా కీర్తనలను రచించి, స్వరపరచాడు. అయితే, ప్రస్తుతం దాదాపు ఏడువందల కీర్తనలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చరమకాలంలో సన్యాసం స్వీకరించిన త్యాగయ్య తన శేషజీవితాన్ని తిరువయ్యారులో గడిపారు. ఇక్కడే ఒక చిన్న ఇంటిలో ఉంటూ పలు అపురూప కీర్తనలను రచించి, స్వరబద్ధం చేశారు. ఇక్కడే ఆయన 1847 జనవరి 6న సమాధి చెందడంతో నాటి నుంచి ఇది కర్ణాటక సంగీతకారులందరికీ పుణ్యస్థలిగా మారింది. - పన్యాల జగన్నాథ దాసు తిరువయ్యారుకు వెళ్లాలంటే... వైమానికమార్గం తిరుచిరాపల్లిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. తిరువయ్యారుకు ఈ విమానాశ్రయం 71 కిలోమీటర్ల దూరం. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి ఈ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. తిరుచిరాపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది. తిరుచిరాపల్లి నుంచి తిరువయ్యారుకు రైలు/రోడ్డుమార్గాన చేరుకోవచ్చు. రైలుమార్గం తిరువయ్యారుకు సమీపంలోని తంజావూరులో రైల్వేస్టేషన్ ఉంది. త్రిచి, మదురై, కోయంబత్తూర్,నాగోర్ రైల్వే లైన్లు ఈ స్టేషన్కు అనుసంధానించి ఉన్నాయి. హైదరాబాద్ నుంచి నేరుగా తంజావూరుకు రైలు సదుపాయం ఉంది. రోడ్డు మార్గం హైదరాబాద్ నుంచి తంజావూరుకు బస్సు సదుపాయాలు కూడా ఉన్నాయి. తంజావూరు నుంచి తిరువయ్యారుకు 13 కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుంచి బస్సు ద్వారా తిరువయ్యారుకు చేరుకోవచ్చు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement