-
స్వదేశీ హైస్పీడ్ డ్రోన్
సాక్షి, హైదరాబాద్: స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన వినూత్నమైన డ్రోన్.. ‘ఎయిర్బార్న్ మెడికల్ రాపిడ్ ట్రాన్స్పోర్ట్–25 (ఏఎంఆర్టీ25)’ను విజయవంతంగా పరీక్షించిన ట్టు టీవర్క్స్ గురువారం ప్రకటించింది. ఈ డ్రోన్ నిలువుగా పైకి ఎగిరి, వేగంగా ప్రయాణించి, మళ్లీ నిలువుగా (వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్– వీటీఓఎల్) కిందికి దిగుతుందని వెల్లడించింది. దేశంలో ఇలాంటి హైబ్రిడ్ డ్రోన్లను రూపొందించి, తయారు చేసి, పరీక్షించగలిగే అతికొద్ది సంస్థల జాబితాలో ‘టీవర్క్స్’ కూడా చేరినట్టు తెలిపింది. ఈ డ్రోన్లో ప్రధాన ఫ్రేమ్తోపాటు ఇతర విడిభాగాలన్నింటినీ టీవర్క్స్లోనే తయారుచేశామని వివరించింది. హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న తమ కేంద్రంలో సాఫ్ట్వేర్ డిజైన్ టూల్స్, 3డీ ప్రింటింగ్, లేజర్ కట్టింగ్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ (సీఎన్సీ) రూటర్ పరికరాలు ఉన్నాయని.. వాటి సాయంతో విడిభాగాలను రూపొందించామని పేర్కొంది. 30 సార్లు విజయవంతంగా..:ఏఎంఆర్టీ25ని ఇప్పటివరకు 30 సార్లు విజయవంతంగా పరీక్షించామని.. గరిష్ట దూరం, సామర్థ్యం, నిర్దేశిత గమ్యాన్ని చేరుకోవడం, ప్రయోగించిన చోటికి తిరిగి రావడం వంటి అంశాల్లో సంతృప్తికరమైన ఫలితాలు సాధించిందని టీవర్క్స్ వెల్లడించింది. ఈ డ్రోన్ 33 నిమిషాల వ్యవధిలో 45 కిలోమీటర్ల దూరం ప్ర యాణించి, సురక్షితంగా ల్యాండ్ అయిందని వివరించింది. ఈ దూరాన్ని, బరువు మోసుకెళ్లే సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది. తాము రూపొందించిన డ్రోన్.. సాధారణ డ్రోన్లతో పోలిస్తే కేవలం పావు వంతు ఇంధనాన్ని మాత్రమే ఉపయోగించుకుంటుందని, ఎక్కువ బరువును, ఎక్కువ దూరం మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉందని వెల్లడించింది. రకరకాల డ్రోన్లను తయారు చేసేందుకు అవసరమైన విడిభాగాలను ఇప్పటికే తమ ‘ప్రోటో టీవర్క్స్’ విభాగం ద్వారా అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింది. ‘మెడిసిన్ ఫ్రం స్కై’ స్ఫూర్తితో.. :కరోనా పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఉమ్మడిగా ‘మెడిసిన్ ఫ్రం స్కై’ కార్యక్రమాన్ని ప్రకటించాయి. డ్రోన్ల ద్వారా ఔషధాలను తరలించాలని నిర్ణయించాయి. ఈ ఏడాది జూన్లో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వేగంగా, సురక్షితంగా, అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్లు, మందులను సరఫరా చేసే డ్రోన్ల కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకున్న టీవర్క్స్.. అడవులు, కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లగలిగే డ్రోన్ల రూపకల్పనపై దృష్టిపెట్టింది. ఎక్కడైనా టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేలా హెలికాప్టర్ తరహా రోటార్లను.. వేగంగా ప్రయాణించేందుకు వీ లుగా విమానాల వంటి రెక్కలు, ముందు భాగంలో ప్రొపెల్లర్ ఫ్యాన్ను అమర్చి ఈ డ్రోన్ను రూపొందించింది. మరింత మెరుగైన యూఏవీ తయారుచేస్తాం తక్కువ ఎత్తులో, తక్కువ దూరం ప్రయాణించే మల్టీరోటార్ (బహుళ రెక్కల) డ్రోన్లను ప్రస్తుతం ఫుడ్ డెలివరీ, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలలో ఉపయోగిస్తున్నారు. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉండే కొన్ని మల్టీరోటార్ డ్రోన్లు 40 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలవు. కానీ ఎక్కువగా అందుబాటులో ఉన్న సాధారణ డ్రోన్లకు 20– 25 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. వాటికి తరచూ బ్యాటరీలను మార్చడమో, రీచార్జి చేయడమో తప్పనిసరి. అదే ‘టీవర్క్స్’ రూపొందించిన యూఏవీకి ఎక్కువ దూరం వేగంగా ప్రయాణించే సామర్థ్యం ఉంది. దీనిని మరింతగా మెరుగుపర్చే పనిలో ఉన్నాం. త్వరలో వంద కిలోమీటర్లకు పైగా దూరాన్ని చేరుకునేలా రూపొందిస్తాం. ఈ యూఏవీ తయారీకి అనుసరించిన సాంకేతికత, ఇతర అంశాలన్నింటినీ టీవర్క్స్ వెబ్సైట్లో పొందుపర్చాం. ఆసక్తి ఉన్న ఔత్సాహికులతో మా విజ్ఞానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. యూఏవీల తయారీలో ఆసక్తి ఉన్న ముందుకు రావాలి. – సుజయ్ కారంపురి, టీవర్క్స్ సీఈవో ఏఎంఆర్టీ25 ప్రత్యేకతలివీ.. ►ఉన్నది ఉన్నట్టుగా పైకి ఎగిరి, అదే తరహాలో కిందికి దిగుతుంది. టేకాఫ్, ల్యాండింగ్ కోసం కేవలం ఐదు మీటర్లు పొడవు, 5 మీటర్లు వెడల్పు ఉన్న స్థలం సరిపోతుంది. ►గాల్లోకి ఎగిరిన తర్వాత విమానం తరహాలో వేగంగా ముందుకు దూసుకెళ్తుంది. సుమారు 80–90 మీటర్ల ఎత్తులో.. గంటకు 100 కిలోమీటర్లకుపైగా వేగంతో వెళ్లగలదు. ►నిలువుగా గాల్లోకి ఎగరడం (వీటీఓఎల్) కోసం నాలుగు రోటార్లు, ముందుకు దూసుకెళ్లడానికి ప్రొపెల్లర్ ఉన్నాయి. ►4 వీటీఓఎల్ రోటార్లకు 10వేల మిల్లీఆంపియర్హవర్ (ఎంఏహెచ్) బ్యాటరీని అనుసంధానం చేశారు. ►ముందుకు దూసుకెళ్లే ప్రొపెల్లర్ కోసం 30 సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ను అమర్చారు. ►విమానం తరహాలో ఉండే రెక్కల వెడల్పు 2.5 మీటర్లు (రెండు వైపులా కలిపి..) ►ఈ డ్రోన్లోని అల్యూమినియం ప్రధాన ఫ్రేమ్తోపాటు కలప, ప్లైవుడ్, కార్బన్ ఫైబర్ విడిభాగాలను ‘టీవర్క్స్’లోనే త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో తయారు చేశారు. ►ప్రస్తుతం ఔషధాల సరఫరాకు వినియోగించినా.. ఏరియల్ సర్వే, తనిఖీలు, నిఘా, రక్షణ రంగ అవసరాల కోసం వీటిని ఉపయోగించవచ్చు. ►ఏఎంఆర్టీ25 కిలో నుంచి కిలోన్నర బరువు మోసుకుని.. గరిష్టంగా 45–50 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ►వంద కిలోమీటర్ల దూరం, 3.5 కిలోల బరువు మోసుకెళ్లేలా ఈ డ్రోన్ కొత్త మోడల్ను తయారు చేస్తున్నారు. -
చేత్తో విసిరే సరిహద్దు నిఘా పరికరాలు
న్యూఢిల్లీ: చేతితో విసిరితే ఎగురుకుంటూ వెళ్లి శత్రు స్థావరాల సమాచారాన్ని తెలియజేసే పది కిలోమీటర్ల రేంజ్ కలిగిన 200 ఆర్క్యూ–11 రావెన్ యూఏవీలను కొనుగోలు చేయడానికి భారత ఆర్మీ సిద్ధమైంది. వీటితో పాటు ఇజ్రాయిల్ టెక్నాలజీతో తయారైన స్పైక్ ఫైర్ ఫ్లై ఆయుధాలను కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. (ముంబై మురికివాడ ప్రపంచానికి అడుగుజాడ) ఫైర్ ఫ్లై ఆయుధాలను 40 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న శత్రువులపై గురి తప్పకుండా ప్రయోగించొచ్చు. ఒక వేళ అనుకున్న టార్గెట్ ప్రాంతాన్ని మారిపోతే ఫైర్ ఫ్లై తిరిగి వెనక్కు వచ్చేస్తుంది. రావెన్ యూఏవీలు 500 అడుగుల ఎత్తులో 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. శుత్రు సైన్యంపై నిఘా కోసం వీటిని వాడతారు. సరిహద్దుల్లో గల్వాన్ వ్యాలీ లాంటి ఉదంతాలు జరిగినప్పుడు శత్రువును అంచనా వేయడానికి ఇవి పనికొస్తాయని నిపుణులు భావిస్తున్నారు. (కరోనా వేళ.. కొత్త రకం కరెన్సీ!) ఈ నెలలోనే భారతీయ వాయుసేనకు ఫ్రాన్స్ నుంచి ఐదు రఫేల్ ఫైటర్ జెట్లు అందనున్నాయి. వీటిలో నాలుగింటిని పైలట్ల శిక్షణ కోసం వాడనుంది. ఈ ఏడాది చివరకు భారత నేవీ అణ్వాయుధ సామర్ధ్యం కలిగిన ఐఎన్ఎస్ అరిఘాత్ను కమిషన్ చేయనుంది. లడఖ్ ఘటన తర్వాత హిందూ మహాసముద్రంలో చైనా ఆరు యుద్ధ నౌకలను పంపిందని పేరు చెప్పడానికి ఇష్టపడని నేవీ ఆఫీసర్ ఒకరు చెప్పారు. వాటిపై భారత నేవీ నిఘా పెట్టిందన్నారు. దాంతో తొలుత మూడు చైనా నౌకలు తిరిగి వెనక్కు పోయాయని, ఇటీవల మిగతావి కూడా వెళ్లాయని వెల్లడించారు. -
గాల్లోకి ఎగిరిన 3డీ యూఏవీ
సాక్షి, హైదరాబాద్: తొలి 3డీ ముద్రిత మానవ రహిత ఏరియల్ వెహికల్ (యూఏవీ) తొలిసారిగా మంగళవారం విజయవంతంగా గాలిలోకి ఎగిరింది. 3డీ ముద్రిత మానవ రహిత విమానాన్ని ‘టి వర్క్స్’గతేడాది నవంబర్లో రూపొందించగా, పలు ప్రయత్నాల తర్వాత గాలిలోకి ఎగిరింది. గంటకు 80 కి.మీ. వేగంతో గాలిలోకి ఎగిరిన విమానం వేగం పుంజుకుని ఆ తర్వాత గంటకు 140 కి.మీ. వేగాన్ని అందుకుంది. సుమారు రెండు నిమిషాల పాటు గాలిలో ప్రయాణించిన తర్వాత రేడియో సంబంధాలను కోల్పోయి నేలకూలింది. ఈ అనుభవంతో మరింత మెరుగైన యూఏవీని త్వర లో తయారుచేస్తామని టి వర్క్స్ ప్రకటించింది. 3డీ ముద్రిత యూఏవీని తయారు చేయడంలో టి వర్క్స్ చేసిన కృషిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అభినందించారు. ఎన్నో ప్రత్యేకతలను కలిగిన యూఏవీ తయారీలో పూర్తిగా 3డీ ముద్రిత విడి భాగాలను ఉపయోగించారు. ఈ విడి భాగాలను పాలీ లాక్టిక్ యాసిడ్ (పీఎల్ఎ), అక్రిలోనైట్రిల్ బ్యూటడీన్ స్టిరీన్, హై ఇంపాక్ట్ పాలిస్ట్రీన్ (హెచ్ఐపీఎస్) వంటి పదార్థాలతో తయారు చేశారు. ఒకటిన్నర కిలోల బరువున్న ఈ యూఏవీని గంటకు 200 కి.మీ. వేగంతో పయనించే సామర్థ్యం తో రూపొందించారు. మంగళవారం జరిగిన ప్రయోగ ఫలితాల ఆధారంగా భవిష్యత్లో 3డీ ముద్రిత యూఏవీల ఎయిరోడైనమిక్ ధర్మాలను విశ్లేషించి, మరింత మెరుగైన యూఏవీని తయారుచేసేందుకు టి వర్క్స్ సన్నాహాలు చేస్తోంది. ప్రోటోటైప్ల తయారీ సులభం.. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమెకానికల్, మెకానికల్ రంగాలకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్ సెంటర్గా పేరొందిన టి వర్క్స్.. ఎయిరోస్పేస్ రంగంలో 3డీ ప్రింటింగ్ అప్లికేషన్ల సామర్థ్యం, పనితీరుపై వరుస పరిశోధనలు చేస్తోంది. గతంలో ఎయిర్క్రాఫ్ట్ల విడిభాగాలను కలప, ఫ్లైవుడ్తో తయారు చేసేందుకు నాలుగైదు వం దల గంటల సమయం పట్టేది. కానీ కంప్యూటర్ లో విడి భాగాల డిజైనింగ్, 3డీ ప్రింటర్ల ద్వారా ప్రోటోటైప్ల తయారీ సులభతరమైంది. యూ ఏవీలో అంతర్భాగాలను నట్లు, బోల్టులు తదితరాలతో సంబంధం లేకుం డానే తేనెపట్టులో అమర్చినట్లు బిగించి రూపాన్ని ఇచ్చారు. లిథి యం పాలిమర్ బ్యాటరీ వినియోగంతో తక్కువ ఖర్చుతో, తక్కువ సంక్లిష్టతతో తయారు చేసిన ఈ యూఏవీ డిజైన్, 3డీ విడి భాగాల ముద్రణకు వంద గంటల సమయం మాత్రమే పట్టిందని టి వర్క్స్ వర్గాలు వెల్లడించాయి. -
త్రీడీ సాంకేతికతతో యూఏవీ
సాక్షి, హైదరాబాద్: పూర్తిగా త్రీడీ సాంకేతికతతో తయారైన విడిభాగాలతో రూపొందించిన మానవ రహిత ఏరియల్ వెహికల్ (యూఏవీ)ను ‘టీ–వర్క్స్’పరీక్షించింది. గురువారం హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. యూఏవీ విడి భాగాలను పాలీ లాక్టిక్ యాసిడ్ (పీఎల్ఎ), అక్రిలోనైట్రిల్ బ్యూటాడిన్ స్టిరీన్, హై ఇంపాక్ట్ పాలిస్టైరీన్ (హెచ్ఐపీఎస్) పదార్థాలతో తయారుచేశారు. ఒకటిన్నర కిలోల బరువున్న ఈ యూఏవీని గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పయనించేలా రూపొందించారు. గురువారం జరిగిన ప్రయోగ ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో త్రీడీ ముద్రిత యూఏవీల ఏరో డైనమిక్ ధర్మాలను విశ్లేషించనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో మెకానికల్, మెకానికల్ రంగాలకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్ సెంటర్గా పేరొందిన టీ వర్క్స్.. ఎయిరోస్పేస్ రంగంలో త్రీడీ ప్రింటింగ్ అప్లికేషన్ల సామర్థ్యం, పనితీరుపై వరుస పరిశోధనలు చేస్తోంది. ‘గతంలో ఎయిర్క్రాఫ్ట్ల విడిభాగాలను కలప, ప్లేవుడ్తో తయారు చేసేందుకు గతంలో నాలుగైదు వందల గంటలు పట్టేది. కానీ కంప్యూటర్లో విడి భాగాల డిజైనింగ్, త్రీడీ ప్రింటర్ల ద్వారా ప్రోటోటైప్ల తయారీ సులభతరమైంది’అని టీ–వర్క్స్ సుజయ్ కారంపూరి వివరించారు. తక్కువ ఖర్చుతో తయారీ.. లిథియం పాలీమర్ బ్యాటరీ వినియోగంతో తక్కువ ఖర్చుతో, తక్కువ సంక్లిష్టతతో తయారు చేసినట్లు సుజయ్ వెల్లడించారు. గురువారం పరీక్షించిన యూఏవీ డిజైన్, త్రీడీ విడి భాగాల ముద్రణకు 100 గంటల సమయం మాత్రమే పట్టిందని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న టీ–వర్క్స్ భవనం మరో 5 నెలల్లో పూర్తవుతుందని, అయితే ఈ ఏడాది డిసెంబర్లో మొట్టమొదటి అత్యాధునిక ఏరోమోడలింగ్ వర్క్షాప్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. సొంతంగా యూఏవీల డిజైన్, నిర్మాణంపై ఆసక్తి ఉన్నవారు టీ–వర్క్స్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. -
నిఘా కోసం చైనా డ్రోన్లు
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని బాలాకోట్లో జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరంపై భారత వైమానిక దళం మెరుపుదాడి చేయడంతో పాకిస్తాన్కు రక్షణ పరంగా తన వైఫల్యాలేమిటో తెలిసి వచ్చింది. దాంతో భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతోంది. భారత్ విషయంలో ఇంత వరకు అనుసరిస్తున్న వ్యూహాలను మార్చుకుంటోంది. సైనిక స్థావరాల వద్ద భద్రతను పటిష్టం చేయడం, సరిహద్దులో నిఘాను పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ఏ మాత్రం దొరక్కుండా, రాడార్లకు కూడా చిక్కకుండా భారత్ దాడి చేయడం, ఆ తర్వాత భారత్పై దాడికి చేసిన యత్నం విఫలమవడాన్ని పాక్ సైన్యం జీర్ణించుకోలేకపోతోందని భారత నిఘావర్గాల భోగట్టా. అత్యాధునిక ఆయుధాలు, నిఘా వ్యవస్థలను సత్వరమే సమకూర్చుకోవాలని, సరిహద్దులో నిఘాను పెంచాలని నిర్ణయించింది. వాస్తవాధీన రేఖ, పాక్ ఆక్రమిత కశ్మీర్లలో నిఘాకోసం మరిన్ని డ్రోన్లను ఉపయోగించాలని, వాటిని చైనా నుంచి కొనాలని నిర్ణయించింది. అలాగే, సరిహద్దులో చైనా తయారీ మధ్యంతర క్షిపణులను మోహరించాలని కూడా ఆలోచిస్తోంది. అత్యాధునిక రైన్బో డ్రోన్లు, యూఏవీల కొనుగోలుకు చైనాతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మరోవైపు ఉగ్ర సంస్థలకు కూడా జాగ్రత్తలు చెబుతోంది. ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించవద్దని, వాస్తవాధీన రేఖకు దూరంగా శిబిరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్టు నిఘా వర్గాల సమాచారం. అలాగే, ఉగ్రవాదులంతా పాక్ సైనిక యూనిఫాంలు లేకుండా బయట తిరగవద్దని కూడా స్పష్టం చేసింది. భారత్పై దాడుల కోసం ఉగ్రవాదుల కన్సార్టియం ఏర్పాటుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోందని తెలిసింది. ఇందుకోసం జైషే, హఖానీ, తాలిబన్, ఐసిస్ వంటి ఉగ్ర సంస్థల మధ్య సమావేశాలు ఏర్పాటు చేస్తోందని నిఘా వర్గాలు పసిగట్టాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- 'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement